AP Gram Panchayats: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన!
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
- గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన
- ఏప్రిల్ 2తో ముగియనున్న సర్పంచ్ల పదవీకాలం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో త్వరలో ప్రత్యేక అధికారుల పాలన అమల్లోకి రానుంది. గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రత్యేక అధికారుల నియామక బాధ్యతను జిల్లా కలెక్టర్లకు అప్పగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని మెజారిటీ గ్రామ పంచాయతీల సర్పంచ్లు, వార్డు సభ్యుల పదవీకాలం ఏప్రిల్ 2తో ముగియనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
సర్పంచ్లు, వార్డు సభ్యుల పదవీకాలం పూర్తయిన మరుసటి రోజు నుంచి గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన అమల్లోకి రానుంది. గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారి, పర్సన్-ఇన్-ఛార్జ్ లేదా పర్సన్-ఇన్-ఛార్జ్ కమిటీని నియమించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అవసరాన్ని బట్టి ఒక గ్రామ పంచాయతీకి ఒక ప్రత్యేక అధికారిని లేదా పలు గ్రామ పంచాయతీలకు కలిపి ఒక అధికారిని నియమించే అధికారం జిల్లా కలెక్టర్లకు ఇవ్వబడింది.
Also Read
- Road Accident: చిలకలూరిపేటలో ఘోర ప్రమాదం.. ఏడుగురి మృతి, 8 మందికి తీవ్ర గాయాలు!
- 8000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz AMOLED డిస్ప్లేతో Realme P4s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
- GV Narayana Rao: టాలీవుడ్లో తీవ్ర విషాదం.. సీనియర్ నటుడు, నిర్మాత జీవీ నారాయణరావు కన్నుమూత
- Nepal Floods: నేపాల్ వరదల్లో 140 మంది తెలుగు యాత్రికులు గల్లంతు.. కుటుంబాల్లో తీవ్ర ఆందోళన
Also Read: IPL 2026-SRH Schedule: ఆర్సీబీతో తొలి మ్యాచ్.. సన్రైజర్స్ హైదరాబాద్ షెడ్యూల్ ఇదే!
ఈ పదవులకు తహశీల్దార్, ఎంపీడీవో, ఎంఈవో, డిప్యూటీ ఎంపీడీవో లేదా అంతకంటే ఉన్నత హోదా కలిగిన అధికారులను నియమించాలని ప్రభుత్వం సూచించింది. గ్రామ పంచాయతీకి సంబంధించిన అధికారాలను వినియోగిస్తూ విధులు నిర్వహించేందుకు వీలుగా ఈ ప్రత్యేక అధికారులను నియమించనున్నారు. గ్రామ పంచాయతీలకు కొత్తగా ఎన్నికైన సర్పంచ్లు, వార్డు సభ్యులు బాధ్యతలు స్వీకరించే వరకు ఈ ప్రత్యేక అధికారుల పాలన కొనసాగనుంది. ఈ నిర్ణయానికి సంబంధించిన నోటిఫికేషన్ను పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్ అధికారికంగా జారీ చేశారు.
తాజావార్తలు
-
Road Accident: చిలకలూరిపేటలో ఘోర ప్రమాదం.. ఏడుగురి మృతి, 8 మందికి తీవ్ర గాయాలు!
-
8000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz AMOLED డిస్ప్లేతో Realme P4s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
GV Narayana Rao: టాలీవుడ్లో తీవ్ర విషాదం.. సీనియర్ నటుడు, నిర్మాత జీవీ నారాయణరావు కన్నుమూత
-
Sandeep Reddy Vanga: ప్రభాస్ ‘స్పిరిట్’ vs మహేశ్ ‘వారణాసి’.. క్లాష్పై వంగా కామెంట్ వైరల్!
-
Nepal Floods: నేపాల్ వరదల్లో 140 మంది తెలుగు యాత్రికులు గల్లంతు.. కుటుంబాల్లో తీవ్ర ఆందోళన
ట్రెండింగ్
-
165Hz డిస్ప్లే, 24GB RAM, 7,470mAh బ్యాటరీతో Lenovo Legion Tab Y700 AI టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే?
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?