AP Gram Panchayats: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన!
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
- గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన
- ఏప్రిల్ 2తో ముగియనున్న సర్పంచ్ల పదవీకాలం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో త్వరలో ప్రత్యేక అధికారుల పాలన అమల్లోకి రానుంది. గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రత్యేక అధికారుల నియామక బాధ్యతను జిల్లా కలెక్టర్లకు అప్పగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని మెజారిటీ గ్రామ పంచాయతీల సర్పంచ్లు, వార్డు సభ్యుల పదవీకాలం ఏప్రిల్ 2తో ముగియనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
సర్పంచ్లు, వార్డు సభ్యుల పదవీకాలం పూర్తయిన మరుసటి రోజు నుంచి గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన అమల్లోకి రానుంది. గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారి, పర్సన్-ఇన్-ఛార్జ్ లేదా పర్సన్-ఇన్-ఛార్జ్ కమిటీని నియమించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అవసరాన్ని బట్టి ఒక గ్రామ పంచాయతీకి ఒక ప్రత్యేక అధికారిని లేదా పలు గ్రామ పంచాయతీలకు కలిపి ఒక అధికారిని నియమించే అధికారం జిల్లా కలెక్టర్లకు ఇవ్వబడింది.
Also Read
Also Read: IPL 2026-SRH Schedule: ఆర్సీబీతో తొలి మ్యాచ్.. సన్రైజర్స్ హైదరాబాద్ షెడ్యూల్ ఇదే!
ఈ పదవులకు తహశీల్దార్, ఎంపీడీవో, ఎంఈవో, డిప్యూటీ ఎంపీడీవో లేదా అంతకంటే ఉన్నత హోదా కలిగిన అధికారులను నియమించాలని ప్రభుత్వం సూచించింది. గ్రామ పంచాయతీకి సంబంధించిన అధికారాలను వినియోగిస్తూ విధులు నిర్వహించేందుకు వీలుగా ఈ ప్రత్యేక అధికారులను నియమించనున్నారు. గ్రామ పంచాయతీలకు కొత్తగా ఎన్నికైన సర్పంచ్లు, వార్డు సభ్యులు బాధ్యతలు స్వీకరించే వరకు ఈ ప్రత్యేక అధికారుల పాలన కొనసాగనుంది. ఈ నిర్ణయానికి సంబంధించిన నోటిఫికేషన్ను పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్ అధికారికంగా జారీ చేశారు.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!