Drugs Mafia: రూ.36 వేల కోట్ల విలువైన డ్రగ్స్ను కొలిమిలో తగలబెట్టిన పోలీసులు.. ఎందుకంటే?
- 222 ప్లాస్టిక్ సంచులలో మత్తుపదార్థాలు.
- బారన్ ద్వీపం దగ్గర పట్టుకున్న నేవీ.
- రూ.36 వేల కోట్ల విలువైన డ్రగ్స్ను కొలిమిలో తగలబెట్టిన అధికారులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Drugs Mafia: ప్రపంచంలోని ప్రతి దేశంలో డ్రగ్స్ వాడకం ఈ మధ్య ఎక్కువగా కనపడుతుంది. ఇక అత్యంత ఎక్కువ జనాభ ఉన్న దేశాలలో భారత్ ఒకటి. దింతో భారత్ లో ప్రమాదకరమైన డ్రగ్స్ ను అమ్మెందుకు డ్రగ్స్ డీలర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మరోవైపు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం ఈ డ్రగ్స్ ను nనివారించడానికి అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇకపోతే తాజాగా అండమాన్ నికోబార్ రాజధాని శ్రీ విజయపురంలో పోలీసులు రూ.36 వేల కోట్ల విలువైన డ్రగ్స్ ని కొలిమిలో తగులబెట్టారు. అయితే ఇలా డ్రగ్స్ ని కొలిమిలో కాల్చడానికి గల కారణాన్ని తెలుపుతూ.. ఈ డ్రగ్స్ చాలా ప్రమాదకరమైనవని, వాటిని బహిరంగ ప్రదేశాల్లో కాల్చలేమని పోలీసులు తెలిపారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న మాదక ద్రవ్యాల సరుకు దేశంలోనే అతిపెద్ద మాదక ద్రవ్యాల మొత్తంగా ఉంది. ఈ చర్యకు డీజీపీ ధాలివాల్ స్వయంగా నాయకత్వం వహిస్తున్నారు. డ్రగ్స్ ను నాశనం చేయడానికి ఇదే ఏకైక మార్గం అని ఆయన పేర్కొన్నారు.
Also Read: Vidyasagar Rao: అప్పుడు నాకోసం 5 గురు సీఎంలు వేయిట్ చేశారు.. ఇప్పుడు రేవంత్ను రిసీవ్ చేసుకున్నా..
Also Read
- Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
- Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
- Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
- StepX Neo: ప్రపంచంలోనే తొలి ఐఏ స్టార్మ్ఫోన్ వచ్చేసింది.. చిటికెలో అన్ని పనులు ఫినిష్!
బహిరంగ ప్రదేశంలో కాల్చినా, గుంతలో పూడ్చినా కాలుష్యం ఎక్కువగా వస్తుందని.. అలా చేయడం వల్ల దీని ప్రభావం ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన అన్నారు. సివిల్ అధికారుల నుంచి అనుమతి తీసుకున్న తర్వాతే ఈ చర్య తీసుకున్నట్లు తెలిపారు. అండమాన్-నికోబార్ పోలీసులు భారీగా డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారని, అంతర్జాతీయ మార్కెట్లో దీని ధర దాదాపు రూ.36 వేల కోట్లు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అలాగే వీటికి సంబంధించిన ఆరుగురు విదేశీ స్మగ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
#WATCH | Port Blair, Andaman & Nicobar | On the destruction of drugs worth Rs 36000 crore seized by police in Sri Vijayapuram, DGP Hargobinder Singh Dhaliwal said, "…Andaman and Nicobar Police have started destroying India's largest drug seizure of over 6000 kg. Incineration is… pic.twitter.com/ps6FeanRJn
— ANI (@ANI) January 12, 2025
పోలీసులు స్వాధీనం చేసుకున్న రూ. 36000 కోట్ల విలువైన డ్రగ్స్ను ధ్వంసం చేయడంపై డీజీపీ హరగోబిందర్ సింగ్ ధాలివాల్ మాట్లాడుతూ.. అండమాన్ అండ్ నికోబార్ పోలీసులు 6000 కిలోల కంటే ఎక్కువ విలువైన డ్రగ్స్ ధ్వంసం చేసుకున్నారని, 222 ప్లాస్టిక్ సంచులలో ఈ మత్తుపదార్థాలను సముద్రంలో తీసుకెళ్తున్న సమయంలో బారన్ ద్వీపం దగ్గర నేవీ వారిని పట్టుకుంది. ఇది భారతదేశంలోనే అతిపెద్ద స్వాధీనం అని అన్నారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, హోం మంత్రిత్వ శాఖతో పాటు స్థానిక అధికారుల సహకారంతో అతి తక్కువ సమయంలో ఇంత భారీ మొత్తం డ్రగ్స్ ను ధ్వంసం చేయగలిగామని చెప్పారు.
తాజావార్తలు
-
AK 64 : శ్రీలీల ఆఫర్ కయాద్ లోహార్ తన్నుకు పోయిందా..?
-
Basil Joseph: అల్లు అర్జున్తో బాసిల్ జోసెఫ్ మూవీ ఖాయమేనా? ఒక్క పోస్టుతో ఊహాగానాలకు చెక్!
-
Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
-
Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
-
OTR: సింగనమల వైసీపీలో సెగలు..
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!