Anantapur Honey Trap Case: అనంతపురం హనీ ట్రాప్ కేసులో బిగ్ ట్విస్ట్.. వైసీపీ నేత అరెస్ట్..!
Anantapur Honey Trap Case: అనంతపురంలో సంచలనం సృష్టించిన హనీ ట్రాప్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ వ్యవహారంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఉపసర్పంచ్ నరేందర్ రెడ్డిని పోలీసులు కీలక సూత్రధారిగా అనుమానిస్తున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా ఆయనను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. హనీ ట్రాప్ కేసులో ఇప్పటికే అరెస్టయిన నిందితులతో నరేందర్ రెడ్డి పలుమార్లు మాట్లాడినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. మొబైల్ ఫోన్ కాల్ డేటా, వాయిస్ రికార్డుల ఆధారంగా ఈ విషయాన్ని నిర్ధారించినట్లు సమాచారం. కేసులో కొత్త ఆధారాలు బయటపడటంతో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. నరేందర్ రెడ్డిని ప్రశ్నిస్తున్న అధికారులు, ఈ వ్యవహారంలో ఆయన పాత్ర ఎంతవరకు ఉందనే దానిపై దృష్టి సారించారు.
Read Also: Driver Subrahmanyam Case: మూడు రోజులకే సర్పవరం సీఐపై బదిలీ వేటు..
Also Read
- TCS Nashik Case: ఛాతి వైపు అసభ్యంగా చూపులు… పిల్లల కోసం మౌల్వీని కలవమని ఒత్తిడి
- IRS Officer Daughter Murder: నిందితుడి నేర చరిత్ర తెలిసి షాకైన పోలీసులు.. బ్యాగ్రౌండ్ ఎంత ఘోరమంటే..!
- Gujarat: సూరత్లో ప్రముఖ పారిశ్రామికవేత్త కోడలు ఆత్మహత్య.. 2 నెలల క్రితమే పెళ్లి
- IRS Officer Daughter Murder: ఐఆర్ఎస్ అధికారి కుమార్తె కేసులో వీడిన మిస్టరీ! వెలుగులోకి సంచలన విషయాలు
పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, నరేందర్ రెడ్డిని రేపు మీడియా ముందుకు తీసుకురావచ్చని తెలుస్తోంది. విచారణలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని భావిస్తున్నారు. ఈ పరిణామంతో అనంతపురం జిల్లాలో రాజకీయంగా కూడా చర్చలు మొదలయ్యాయి. హనీ ట్రాప్ కేసులో మరిన్ని ప్రముఖుల పేర్లు బయటకు వచ్చే అవకాశముందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
కాగా, గత కొంతకాలంగా ప్రముఖులే టార్గెట్గా సాగుతున్న హనీట్రాప్ వ్యవహారం బట్టబయలైన విషయం విదితమే.. ఈ కేసులో ఇప్పటికే ఐదుగురు నిందుతులను అరెస్ట్ చేశారు పోలీసులు.. కింగ్ రంగమ్మ నాయుడు అలియాస్ చిన్ని నాయుడమ్మతో పాటూ దబ్బర రాజేష్, జయలక్ష్మి, మల్లేశ్వరి, అనంత కుమారిని అరెస్ట్ చేశారు. ఉదయ్ భాస్కర్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు.. ఇక, ఈ ముఠా ఇప్పటివరకు పలువురిని హనీ ట్రాప్ చేసి లక్షల రూపాయలు వసూలు చేసినట్లు తెలుస్తోంది.. పోలీసులు చెబుతున్న ప్రకారం.. ప్లాన్ చేసి అమాయకులను, బాగా డబ్బున్నవాళ్లకు వల వేసి ట్రాప్ చేసేవారని.. ఆ తర్వాత బెదిరింపులకు దిగేవారని.. వారికి చాలా మంది బాధితులు లక్షలాది రూపాయలు సమర్పించుకున్నారని పోలీసులు చెబుతున్నారు.. ఇక, నిందితుల వద్ద నుంచి రూ.13 లక్షల నగదు, రెండు కత్తులు, అలాగే ప్రామిసరీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు..
తాజావార్తలు
-
Anantapur Honey Trap Case: అనంతపురం హనీ ట్రాప్ కేసులో బిగ్ ట్విస్ట్.. వైసీపీ నేత అరెస్ట్..!
-
West Bengal Election: 90 కొట్టిన బెంగాల్ ఓటర్లు.. తమిళనాడులో 82 శాతం.. రికార్డ్ స్థాయిలో పోలింగ్..
-
TCS Nashik Case: ఛాతి వైపు అసభ్యంగా చూపులు… పిల్లల కోసం మౌల్వీని కలవమని ఒత్తిడి
-
Driver Subrahmanyam Case: మూడు రోజులకే సర్పవరం సీఐపై బదిలీ వేటు..
-
Summer Holidays: విద్యార్థులకు శుభవార్త.. రేపటి నుంచే వేసవి సెలవులు.. ఎప్పటివరకంటే..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!