West Bengal Election: 90 కొట్టిన బెంగాల్ ఓటర్లు.. తమిళనాడులో 82 శాతం.. రికార్డ్ స్థాయిలో పోలింగ్..
- బెంగాల్లో రికార్డ్ స్థాయి ఓటింగ్..
- సాయంత్రం 5 గంటలకు 90 శాతం నమోదు..
- క్యూ లైన్లలో భారీగా ఉన్న ఓటర్లు..
- పోలింగ్ శాతం 90 శాతాన్ని దాటి నమోదయ్యే ఛాన్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
West Bengal Election: పశ్చిమ బెంగాల్లో తొలి విడత పోలింగ్ భారీ రికార్డుల్ని క్రియేట్ చేస్తోంది. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఓటర్లు పోలింగ్ సెంటర్ల ముందు బారులు తీరారు. సాయంత్రం 5 గంటల వరకు బెంగాల్లో 90 శాతం( 89.93%) ఓటింగ్ నమోదైంది. చాలా మంది ఇంకా క్యూ లైన్లలో నిలిచి ఉండటంతో ఈ పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. తొలి విడతలో భాగంగా బెంగాల్లో 152 స్థానాలకు గురువారం ఓటింగ్ జరిగింది. బెంగాల్లో మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాలు 294 కాగా, రెండోదైన చివరి విడత పోలింగ్ 142 స్థానాలకు ఏప్రిల్ 29న జరుగనుంది.
Read Also: TCS Nashik Case: ఛాతి వైపు అసభ్యంగా చూపులు… పిల్లల కోసం మౌల్వీని కలవమని ఒత్తిడి
Also Read
- PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
- Mohan Bhagwat: రిజర్వేషన్లు కొనసాగాలి, వారు వదులుకోవాలి: ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
- Mohan Bhagwat: స్వలింగ వివాహాలపై మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు
- Agni-4 Ballistic Missile: పాకిస్తాన్ మొత్తం భారత పరిధిలో.. అగ్ని-4 మిస్సైల్ సక్సెస్..
పోలింగ్ సరళిని చూస్తే అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ), ప్రతిపక్ష బీజేపీకి మధ్య హోరాహోరీ పోరు జరిగినట్లు తెలుస్తోంది. బెంగాల్ మొదటి విడత ఎన్నికల్లో 1478 మంది అభ్యర్థులు పోటీ చేశారు. బెంగాల్ ఎన్నికల్లో మరోవైపు హింస చెలరేగింది. ముర్షిదాబాద్లో టీఎంసీ కార్యకర్తలు ఏయూజేపీ పార్టీ చీఫ్ హుమాయున్ కబీర్పై దాడులు చేశారు. సిలిగురిలో టీఎంసీ, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. కుమార్గంజ్లో బీజేపీ అభ్యర్థి సువేందు సర్కార్పై టీఎంసీ గుండాలు దాడికి పాల్పడ్డారు. మరోవైపు, ఈ ఓటింగ్ చూస్తే ఎస్ఐఆర్ ప్రక్రియ, ఓట్ల తొలగింపుపై ప్రజల కోపాన్ని సూచిస్తోందని ఇది టీఎంసీకి అనుకూలమే అని సీఎం మమతా బెనర్జీ కామెంట్ చేసింది. మరోవైపు, మే 4 టీఎంసీకి గుడ్ బై అంటూ బీజేపీ చెబుతోంది.
మరోవైపు, తమిళనాడులో ఒకే విడతలో మొత్తం 234 స్థానాలకు ఓటింగ్ జరిగింది. సాయంత్రం 5 గంటల వరకు ఆ రాష్ట్రంలో 82.24 శాతం ఓటింగ్ నమోదైంది. గంటగంటకు పోలింగ్ పెరుగుతుండటంతో అధికార వ్యతిరేక ఓటింగ్ నమోదవుతున్నట్లు రాజకీయ నిపుణులు చెబుతున్నారు. తమిళనాడులో అధికార డీఎంకే, ప్రతిపక్ష అన్నాడీఎంకేతో పాటు విజయ్ టీవీకే పార్టీల మధ్య త్రిముఖ పోరు నెలకొంది. ఎండల్ని లెక్క చేయకుండా తమిళ ప్రజలు ఓటు హక్కును వినియోగించుకున్నారు.
తాజావార్తలు
-
Donald Trump: మన దగ్గర భారీ ఆయుధ నిల్వ ఉంది.. ఇరాన్ పేద దేశం.. యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన
-
Women’s Asia Cup 2026: మరోసారి తలపడనున్న భారత్, పాకిస్థాన్.. మహిళల ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!