TCS Nashik Case: ఛాతి వైపు అసభ్యంగా చూపులు… పిల్లల కోసం మౌల్వీని కలవమని ఒత్తిడి
- టీసీఎస్ నాసిక్ కేసులో సంచలన విషయాలు..
- తాను ఎదుర్కొన్న వేధింపుల్ని బయటపెట్టిన మహిళా ఉద్యోగి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TCS Nashik Case: టీసీఎస్ నాసిక్ కేసులో నిందితుల అరాచకాలు నెమ్మదిగా వెలుగులోకి వస్తున్నాయి. ఎలా మహిళల్ని వేధించారు, మతమార్పిడులకు పాల్పడ్డారనే విషయాలపై బాధితులు పోలీసులకు చెబుతున్నారు. తాజాగా, ఒక సీనియర్ మహిళా ఉద్యోగి నిందితుల ప్రవర్తనపై ఆరోపణలు చేశారు. తాను ఎదుర్కొన్న వేధింపులపై సంస్థ చర్యలు తీసుకోవడంలో విఫలమైందని ఆరోపించారు. తనకు గర్భస్రావం అయిందని తెలిసి, జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసినట్లు వెల్లడించింది.
గత 11 ఏళ్లుగా ఆ సంస్థలో పనిచేస్తున్నట్లు బాధిత మహిళ చెప్పుకొచ్చింది. 2026 ఫిబ్రవరిలో నిందితుడు తౌసిఫ్ అత్తర్ తన వద్దకు వచ్చి తన ఆరోగ్యం గురించి అడిగాడని, ఇటీవల గర్భస్రావం కావడంతో అనారోగ్యంతో ఉన్నట్లు చెప్పానని మహిళ చెప్పింది. బిడ్డలు కలగాలంటే అజ్మీర్లోని ఒక మౌల్వీ వద్దకు వెళ్లాలని సూచించినట్లు, తన వ్యక్తిగత విషయాలపై వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపించింది. ఆ వ్యాక్యల్ని అవమానకరమైన, అనుచితమైన వ్యాఖ్యలుగా ఆమె అభివర్ణించింది.
Also Read
- Murder Plan: భార్యను బొందపెట్టడం ఎలా..? మగాళ్లను చంపడం ఎలా..? మార్కెట్లోకి కొత్త బుక్స్...
- Parents Kill Son: కొడుకుకు యాసిడ్ తాగించి హత్య చేసిన తల్లిదండ్రులు.. కారణం ఏంటంటే..
- Day Care: డేకేర్ సెంటర్లో మీ పిల్లల్ని జాయిన్ చేయించారా..? అయితే జాగ్రత్త.. వీళ్లేంచేస్తున్నారో చూడండి..
- Ram Mandir Donation Scam: రోజూ రూ.6-8 లక్షలు మాయం..? రామ మందిరం కేసులో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
Read Also: USA: డాలర్ కలలు కల్లలు.. అమెరికా నుంచి వెళ్లిపోవాలనుకుంటున్న భారతీయులు..
అత్తర్ తన వైవాహిత జీవితం, సంతానం లేకపోవడంపై పదే పదే వ్యాఖ్యలు చేసి, మానసికంగా వేధించినట్లు చెప్పింది. నిందితులైన డానిష్ షేక్, తౌసిఫ్, రజా మెమన్, షఫీ షేక్, షారుఖ్ ఖురేషి,ఆసిఫ్ అన్సారీ తనకు వ్యక్తిగతంగా తెలుసని, వారు తనలో అనుచితంగా ప్రవర్తించినట్లు చెప్పింది. ఈ నిందితులు హిందూ ఉద్యోగుల్ని టార్గెట్ చేసేవారిని ఆరోపించింది. మత విశ్వాసాలు, విగ్రహాలపై అవమానకరమైన వ్యాఖ్యలు చేయడం, మహిళా ఉద్యోగులను లైంగికంగా రెచ్చగొట్టే రీతిలో వ్యాఖ్యలు చేసే వారని చెప్పింది. పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ సంస్థ చర్యలు తీసుకోలేదని ఆరోపించింది.
2022లో షఫీ షేక్ అనే నిందితులు తన ఛాతి వైపు తదేకంగా చూస్తూ, అనుచితంగా నవ్విన ఘటనను గుర్తు చేసుకుంది. ఆ చూపులు భరించలేక బయటకు గదిలో నుంచి బయటకు వెళ్లినట్లు బాధితురాలు చెప్పింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇప్పటి వరకు ఈ కేసులో 9 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి.
తాజావార్తలు
-
Uttam Kumar Reddy : కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ గ్లోబల్ ప్రాపగాండా చేస్తోంది
-
IND Vs ENG: రెండో టీ20 ఓడిపోవడానికి కారణం ఇదే.. నిజం నిర్భయంగా చెప్పిన ఇషాన్ కిషన్..
-
Trump – Putin: ఉక్రెయిన్ యుద్ధానికి ఎండ్ కార్డ్? ట్రంప్కు పుతిన్ అర్ధరాత్రి ఫోన్.. 90 నిమిషాల పాటు ఏం మాట్లాడుకున్నారంటే!
-
Kajal Aggarwal: ‘రామాయణం’లో నా పాత్ర చిన్నదే.. అయినా అది జీవితాంతం గుర్తుండిపోతుంది!
-
Meta India notice: ఇన్స్టాగ్రామ్పై కేంద్రం సీరియస్.. బాలల లైంగిక దోపిడీ కంటెంట్ తొలగించాలని మెటాకు నోటీసులు
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!