Anantapur Honey Trap Case: అనంతపురం హనీ ట్రాప్ కేసులో బిగ్ ట్విస్ట్.. వైసీపీ నేత అరెస్ట్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anantapur Honey Trap Case: అనంతపురంలో సంచలనం సృష్టించిన హనీ ట్రాప్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ వ్యవహారంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఉపసర్పంచ్ నరేందర్ రెడ్డిని పోలీసులు కీలక సూత్రధారిగా అనుమానిస్తున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా ఆయనను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. హనీ ట్రాప్ కేసులో ఇప్పటికే అరెస్టయిన నిందితులతో నరేందర్ రెడ్డి పలుమార్లు మాట్లాడినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. మొబైల్ ఫోన్ కాల్ డేటా, వాయిస్ రికార్డుల ఆధారంగా ఈ విషయాన్ని నిర్ధారించినట్లు సమాచారం. కేసులో కొత్త ఆధారాలు బయటపడటంతో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. నరేందర్ రెడ్డిని ప్రశ్నిస్తున్న అధికారులు, ఈ వ్యవహారంలో ఆయన పాత్ర ఎంతవరకు ఉందనే దానిపై దృష్టి సారించారు.
Read Also: Driver Subrahmanyam Case: మూడు రోజులకే సర్పవరం సీఐపై బదిలీ వేటు..
Also Read
- Digital Arrest Scam: డిజిటల్ అరెస్ట్ ఉచ్చులో వృద్ధ దంపతులు.. కృష్ణాజిల్లాలో రూ.1.43 కోట్ల సైబర్ మోసం
- House Collapse: నిద్రలోనే తెల్లారిన బతుకులు.. 100 ఏళ్ల నాటి ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
- Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
- Tragedy News: స్నేహం, పెళ్లి, కోపం.. చివరికి నదిలోకి తోసి ప్రాణాలు తీసిన యువకుడు!
పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, నరేందర్ రెడ్డిని రేపు మీడియా ముందుకు తీసుకురావచ్చని తెలుస్తోంది. విచారణలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని భావిస్తున్నారు. ఈ పరిణామంతో అనంతపురం జిల్లాలో రాజకీయంగా కూడా చర్చలు మొదలయ్యాయి. హనీ ట్రాప్ కేసులో మరిన్ని ప్రముఖుల పేర్లు బయటకు వచ్చే అవకాశముందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
కాగా, గత కొంతకాలంగా ప్రముఖులే టార్గెట్గా సాగుతున్న హనీట్రాప్ వ్యవహారం బట్టబయలైన విషయం విదితమే.. ఈ కేసులో ఇప్పటికే ఐదుగురు నిందుతులను అరెస్ట్ చేశారు పోలీసులు.. కింగ్ రంగమ్మ నాయుడు అలియాస్ చిన్ని నాయుడమ్మతో పాటూ దబ్బర రాజేష్, జయలక్ష్మి, మల్లేశ్వరి, అనంత కుమారిని అరెస్ట్ చేశారు. ఉదయ్ భాస్కర్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు.. ఇక, ఈ ముఠా ఇప్పటివరకు పలువురిని హనీ ట్రాప్ చేసి లక్షల రూపాయలు వసూలు చేసినట్లు తెలుస్తోంది.. పోలీసులు చెబుతున్న ప్రకారం.. ప్లాన్ చేసి అమాయకులను, బాగా డబ్బున్నవాళ్లకు వల వేసి ట్రాప్ చేసేవారని.. ఆ తర్వాత బెదిరింపులకు దిగేవారని.. వారికి చాలా మంది బాధితులు లక్షలాది రూపాయలు సమర్పించుకున్నారని పోలీసులు చెబుతున్నారు.. ఇక, నిందితుల వద్ద నుంచి రూ.13 లక్షల నగదు, రెండు కత్తులు, అలాగే ప్రామిసరీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు..
తాజావార్తలు
-
Cyber Crime: నకిలీ పాప్-అప్ టోల్ఫ్రీ నంబర్లతో బురిడీ.. అంతర్జాతీయ సైబర్ మోసాల ముఠా గుట్టురట్టు..
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!
-
Friday Horoscope: ఆ రాశి వారు జాగ్రత్త.. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు!
-
Ishan Kishan: బ్యాంక్ ఉద్యోగం, క్రికెట్ సరిపోలేదా?.. పార్ట్ టైమ్ టీ కొట్టు ఎప్పుడు పెట్టావ్ ఇషాన్ కిషాన్ భాయ్?
-
E3 Tryon: E3 ట్రయాన్ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల.. 165KM రేంజ్, AI ఫీచర్లు.. ధర ఎంతంటే?
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!