Anakapalle Murder Case: శరీర భాగాలు లభ్యం కేసు.. హత్యకు గురైంది మహిళ కాదు..!
- అనకాపల్లి హత్య కేసులో పోలీసుల పురోగతి
- అనకాపల్లి వై జంక్షన్ సమీపంలో మిగతా శరీర భాగాలు
- హత్యకు గురైంది మహిళ కాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అనకాపల్లి జిల్లాలో కలకలం సృష్టించిన మహిళ శరీర భాగాలు లభ్యం కేసులో పోలీసులు పురోగతి సాధించారు. తల ఒకచోట.. మొండెం, కాళ్లు, చేతులు మరో చోట లభించాయి. హత్యకు గురైంది దీప అనే ట్రాన్స్ జెండర్గా గుర్తించారు పోలీసులు. మొత్తం 8 పోలీసు బృందాలు నిందితుల కోసం, మిగతా శరీర భాగాల కోసం గాలించగా.. ఈరోజు ఉదయం అనకాపల్లి వై జంక్షన్ సమీపంలో మిగతా శరీర భాగాలను గుర్తించారు. వై జంక్షన్ సమీపంలో తల, మరో చెయ్యి లభించింది. డెడ్ బాడీ వద్ద లభించిన ఆనవాళ్లు ఆధారంగా దర్యాప్తు చేయగా.. హిజ్రా దీపగా గుర్తించారు. నాలుగేళ్ల క్రితం సర్జరీ చేసుకున్నట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇంతకీ ఎవరు హత్య చేశారు?, ఎందుకు హత్య చేశారు? అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కసింకోట మండలం తాళ్లపాలెం బ్రిడ్జి కింద మహిళ మెడ నుండి నడుము వరకు శరీర భాగం గుర్తించిన పోలీసులు గుర్తించారు. నిన్న బయ్యవరం వద్ద నడుము కింద నుండి రెండు కాళ్లు, ఒక చెయ్యి లభించాయి. ఈరోజు అనకాపల్లి వై జంక్షన్ వద్ద డైట్ కాలేజీ సమీపంలో తల, ఒక చెయ్యి దొరికాయి. తోటి ట్రాన్స్ జెండర్స్పై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పలువురు ట్రాన్స్ జెండర్స్ను విచారిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిందితుల కోసం గాలింపు మొదలెట్టారు. ట్రాన్స జెండర్గా మారిన దీపు, మరొక హిజ్రా, ఓ వ్యక్తితో కలిసి గదిలో అద్దెకు ఉంటున్నారు.
Also Read
- 200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
- Donald Trump: అమెరికా అధ్యక్షుడి రహస్య ప్రయాణం.. అసలు కారణం ఇదే!
- Jharkhand Student Protest: జార్ఖండ్లో ఉద్రిక్తంగా మారిన నిరుద్యోగుల పోరు.. అర్ధరాత్రి పోలీసులు ఎందుకు వచ్చారు?
- CM Chandrababu: సైబర్ క్రైమ్, గంజాయి, బ్లేడ్ బ్యాచ్లపై ఉక్కుపాదం.. నేడు సీఎం ఉన్నతస్థాయి సమీక్ష..
అనకాపల్లి ఘటనలో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీసులను ఆదేశించారు. ఈ ఘటనలో నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు సీఎంకు జిల్లా ఎస్పీ, పోలీసు ఉన్నతాధికారులు వివరించారు. అగంతుకులను అదుపులోకి తీసుకున్నట్టు సీఎంకు తెలిపారు. నిన్ననే ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు, అనకాపల్లి జిల్లా ఎస్పీతో సీఎం మాట్లాడారు. ఢిల్లీ నుంచి ఇవాళ ఉదయం మరోమారు అనకాపల్లి జిల్లా ఎస్పీతో సీఎం మాట్లాడారు. నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు సీఎంకు పోలీసు అధికారులు వివరించారు. ఈ దారుణానికి పాల్పడిన నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలని సీఎం ఆదేశించారు. త్వరిత గతిన దర్యాప్తు పూర్తి చేసి శిక్ష పడేలా చూడాలని చెప్పారు.
తాజావార్తలు
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడి రహస్య ప్రయాణం.. అసలు కారణం ఇదే!
-
Fauji vs Eta: ప్రభాస్ ‘ఫౌజీ’కి బిగ్ టెన్షన్.. హిందీ బెల్ట్లో గట్టి పోటీ!
-
BCCI: బీసీసీఐపై వీవీఎస్ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు.. షాక్లో మాజీ క్రికెటర్!
-
Jharkhand Student Protest: జార్ఖండ్లో ఉద్రిక్తంగా మారిన నిరుద్యోగుల పోరు.. అర్ధరాత్రి పోలీసులు ఎందుకు వచ్చారు?
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..