Sonia Gandhi: బీజేపీకి వచ్చిన ఎలక్టోరల్ బాండ్లపై విచారణ జరపాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: బీజేపీకి వచ్చిన ఎలక్టోరల్ బాండ్స్ పై విచారణ జరిపించాలని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యరాలు సోనియా గాంధీ డిమాండ్ చేశారు. ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బయటపడ్డ సమాచారంపై విచారణ జరగాల్సిందే అని అన్నారు. ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా బీజేపీకి 56 శాతం నిధులు వస్తే.. కాంగ్రెస్కు 11 శాతం ఫండ్స్ మాత్రమే వచ్చాయని తెలిపారు. బీజేపీకి వేల కోట్ల రుపాయాల ఎలక్టోరల్ బాండ్లు ఎలా వచ్చాయని ఆమె క్వశ్చన్ చేశారు. అక్రమంగా కాంగ్రెస్ బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేశారు.. కేంద్ర ప్రభుత్వ తీరును సోనియా గాంధీ తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కాంగ్రెస్ను ఆర్థికంగా దెబ్బ తీసేందుకు మోడీ సర్కార్ కుట్ర చేస్తుందని సోనియా గాంధీ అన్నారు.
Read Also: Kishan Reddy: ఎన్డీయే కూటమికి 400 సీట్లు దాటాలనే లక్ష్యంతో పని చేస్తున్నాం..
Also Read
- Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
ఇక, కాంగ్రెస్ బ్యాంక్ ఖాతాలను ఎలా ఫ్రీజ్ చేస్తారని బీజేపీపై ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు. ఫండ్స్ని కట్టడి చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు.. ఎన్నికల ముందు కాంగ్రెస్ను ఆర్థింగా దెబ్బ తీయాలని చూస్తున్నారు.. సీతారామ్ కేసరి కాలం నాటి అంశాలపై ఇప్పడు నోటీసులు ఇస్తున్నారని ఆయన పేర్కొన్నారు. చిన్న చిన్న లోపాలను అడ్డు పెట్టుకుని తీవ్ర చర్యలు చేపడుతున్నారని ఖర్గే మండిపడ్డారు. ఇలాంటి చర్యలు కొనసాగితే దేశంలో ప్రజాస్వామ్యం బతకడం కష్టమని ఆయన అన్నారు. నెల రోజులకు పైగా తమ అకౌంట్లను ఫ్రీజ్ చేశారు.. దీంతో మా ఖాతాల్లోని 285 కోట్ల రూపాయలను వాడుకోలేకపోతున్నాం.. ఏ పార్టీకి లేని నిబంధనలన్నీ కాంగ్రెస్ కే వర్తిస్తాయా? అంటూ ప్రశ్నించారు. సరిగ్గా ఎన్నికల సమయంలో మా పార్టీ బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ చేయడం దారుణం.. నిధులు వాడుకోలేకపోతే మేం ఎన్నికలను ఎలా ఎదుర్కొంటాం అని మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!