Amzath Basha: పేద ప్రజలంటే సీఎం చంద్రబాబుకు అలుసా?.. ప్రైవేటీకరణ రద్దు చేస్తాం!
- మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడం దారుణం
- పేద ప్రజలంటే సీఎం చంద్రబాబుకు అలుసా?
- వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రైవేటీకరణ రద్దు చేస్తాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడం దారుణం అని మాజీ డిప్యూటీ సీఎం, పీఏసీ సభ్యుడు అంజద్ భాష పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేద ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారని మండిపడ్డారు. పేద ప్రజలంటే సీఎం చంద్రబాబుకు అంత అలుసా? అని ప్రశ్నించారు. మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రైవేటీకరణ రద్దు చేస్తాం అని చెప్పారు. వందల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేస్తున్నారని, ఆ డబ్బును ప్రభుత్వ ఆస్పత్రులకు కేటాయించవచ్చు కదా? అని అంజద్ భాష ఫైర్ అయ్యారు. కడపలో అయన ఈరోజు మీడియా సమావేశం నిర్వహించారు.
‘మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడం దారుణం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని పూర్తిగా ఖండిస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేద ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారు. పేద ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించేందుకు మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి రిమ్స్ నిర్మించారు. తర్వాత వైఎస్ జగన్ ప్రతి జిల్లాల్లో ఒక్కో మెడికల్ కళాశాలలను నిర్మించారు. పులివెందుల మెడికల్ కాలేజీలో కేటాయించిన 50 సీట్లను కూడా వెనక్కి ఇచ్చింది. పేద ప్రజలంటే చంద్రబాబుకు అలుసా?. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రైవేటీకరణ రద్దు చేస్తాం. పేద ప్రజలకు ఆరోగ్య శ్రీ ద్వారా నాణ్యమైన చికిత్సలను ఉచితంగా అందించాం. వందల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేస్తున్నారు, ఆ డబ్బును ప్రభుత్వ ఆస్పత్రులకు కేటాయించవచ్చు కదా?’ అని అంజద్ భాష మండిపడ్డారు.
Also Read
- JD Vance-Iran: జేడీ వాన్స్కు ఇరాన్ రహస్య హెచ్చరిక? అంతర్జాతీయంగా తీవ్ర కలకలం
- YS Jagan: పార్లమెంట్ వ్యూహాలపై వైసీపీ భేటీ.. ఎంపీలకు జగన్ దిశానిర్దేశం.. సర్కార్పై తీవ్ర ఆరోపణలు..
- Bigg Boss 10: బిగ్ బాస్ సెట్ వర్క్ మొదలు.. ఆరోజు నుంచే షో.!
- AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం.. ముగ్గురు నిందితులకు 3 రోజుల ఈడీ కస్టడీ..!
Also Read: Botsa Satyanarayana: ఎలాంటి వారికి గవర్నర్ పదవి.. అశోక్ గజపతిరాజు వ్యాఖ్యలపై బొత్స సీరియస్!
2019-2024 మధ్య వైసీపీ ప్రభుత్వం 17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను నిర్మించింది. విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల.. ప్రాంతాలలో 2023-24 నుంచే కళాశాలలు ప్రారంభమయ్యాయి. దాంతో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 2360 నుంచి 4910కి పెరిగింది. ఈ కాలేజీలలో సగం సీట్లను ఉచితంగా, మిగిలిన సీట్లను ప్రైవేటు కళాశాలలతో పోలిస్తే తక్కువ ఫీజుతో అందించాలని అప్పటి సీఎం నిర్ణయించారు. పేద, మధ్యతరగతి విద్యార్థులకు వైద్య విద్య అందుబాటులోకి వస్తుందని భావించారు. 2024లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం.. 17 కళాశాలలలో పదింటిని పీపీపీ పద్ధతిలో ప్రైవేటు సంస్థలకు అప్పగించాలని నిర్ణయించింది. ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలో ఇందుకు ఆమోదం లభించింది.
తాజావార్తలు
-
Bhatti Vikramarka : సీతారామ ప్రాజెక్టుపై భట్టి కీలక ప్రకటన.. ఇక వెనక్కి తగ్గేది లేదు..
-
JD Vance-Iran: జేడీ వాన్స్కు ఇరాన్ రహస్య హెచ్చరిక? అంతర్జాతీయంగా తీవ్ర కలకలం
-
Amitabh Bachchan: అయోధ్యలో అమితాబ్ బచ్చన్ మెగా ప్లాన్ ? రూ.100 కోట్లతో బిగ్ బీ ఏం చేశారో తెలుసా!
-
YS Jagan: పార్లమెంట్ వ్యూహాలపై వైసీపీ భేటీ.. ఎంపీలకు జగన్ దిశానిర్దేశం.. సర్కార్పై తీవ్ర ఆరోపణలు..
-
Bigg Boss 10: బిగ్ బాస్ సెట్ వర్క్ మొదలు.. ఆరోజు నుంచే షో.!
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!