Amit Shah: ఏపీజే అబ్దుల్ కలాం ఇంటికి అమిత్ షా.. పుస్తకాన్ని ఆవిష్కరించిన కేంద్ర మంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah: దివంగత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం జీవితంపై రాసిన ‘మెమోరీస్ నెవర్ డై’ పుస్తకాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం రామేశ్వరంలో ఆవిష్కరించారు. తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో రెండు రోజుల పర్యటనకు వచ్చిన అమిత్ షా రామనాథస్వామి ఆలయాన్ని కూడా సందర్శించారు. ఈ పుస్తకాన్ని ఏపీజేఎం నసీమా మరైక్యార్, శాస్త్రవేత్త వైఎస్ రాజన్లు రచించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ఎల్.మురుగన్, తమిళనాడు బీజేపీ చీఫ్ కె. అన్నామలై పాల్గొన్నారు. “ప్రధాని మోడీ నాయకత్వంలో మన విద్యార్థులకు, వారి స్టార్టప్లకు అంతరిక్ష శాస్త్రంలో అవకాశాలు తెరుచుకున్నాయి. అంతరిక్ష విజ్ఞానానికి సంబంధించి అబ్దుల్ కలాం కల ప్రధాని కొత్త ఆవిష్కరణల వల్ల నెరవేరుతుందని నమ్ముతున్నాను.’ అని పుస్తకావిష్కరణ కార్యక్రమంలో అమిత్ షా అన్నారు.
Also Read: Manipur: మణిపూర్కు ప్రతిపక్ష ఎంపీలు.. రాజకీయాలు చేసేందుకు కాదంటూ వ్యాఖ్య
Also Read
- Shoaib Akhtar: ఉగ్రవాదులతో క్రికెటర్కి సంబంధం ఏంటి? అదీ 26/11 ముంబై, పహల్గామ్ దాడుల సూత్రధారుతో..
- Pawan Kalyan: వైసీపీకి పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.. మౌనం బలహీనత కాదు..!
- Amaravati Tension: ఉండవల్లిలో హైటెన్షన్.. వైసీపీ నేతలపై కోడిగుడ్లు, రాళ్ల దాడి
- YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
అబ్దుల్ కలాం రాసిన పుస్తకం ‘ఇండియా 2020: విజన్ ఫర్ ది న్యూ మిలీనియం’లో హైలైట్ చేసిన దేశాభివృద్ధికి సంబంధించిన రోడ్మ్యాప్ను ఆయన గుర్తు చేసుకున్నారు. “కలాం మూడు విషయాలు చెప్పారు – భారతదేశం తన సామర్థ్యాన్ని గుర్తించాలి, సాంకేతికత ఆధారిత ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయాలి, వ్యవసాయం పరిశ్రమలు, నగరాలు, గ్రామాల మధ్య సమతుల్య వృద్ధిని నిర్ధారించాలి” అని అబ్దుల్ కలాం చెప్పినట్లు అమిత్ షా అన్నారు.
Also Read: Madhyapradesh: 12 ఏళ్ల బాలికపై అత్యాచారం.. నిందితుల ఇళ్లపై బుల్డోజర్ చర్యలు
రామేశ్వరంలోని ఏపీజే అబ్దుల్ కలాం ఇంటికి కూడా హోంమంత్రి అమిత్ షా వెళ్లారు. అంతకుముందు రోజు రామేశ్వరం ఆలయాన్ని సందర్శించిన అమిత్ షా ట్విట్టర్లో ఇలా అన్నారు. “రామేశ్వరం ఆలయంలో హారతి, అభిషేకం నిర్వహించడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. 12 జ్యోతిర్లింగాలలో, రాముడు శివుడిని పూజించిన ప్రదేశం ఇది. దేవాలయం సనాతన ధర్మం యొక్క ప్రాచీనతకు నిదర్శనం.” అని అమిత్ షా పేర్కొన్నారు. ప్రజలు, దేశ శ్రేయస్సు కోసం తాను ప్రార్థించానన్నారు. వచ్చే ఏడాది జరగనున్న లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడానికి అమిత్ షా తమిళనాడుకు చేరుకున్నారు. శుక్రవారం ఆయన తమిళనాడు బీజేపీ చేపట్టిన ‘ఎన్ మన్, ఎన్ మక్కల్’ (నా భూమి నా ప్రజలు) పాదయాత్రను ప్రారంభించి, రామేశ్వరంలో ర్యాలీలో పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Shoaib Akhtar: ఉగ్రవాదులతో క్రికెటర్కి సంబంధం ఏంటి? అదీ 26/11 ముంబై, పహల్గామ్ దాడుల సూత్రధారుతో..
-
Pawan Kalyan: వైసీపీకి పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.. మౌనం బలహీనత కాదు..!
-
Dhurandhar 2: ఓటీటీలోకి వచ్చినా తగ్గని జోరు.. 100 రోజుల థియేటర్ రన్తో మరో రికార్డు?
-
Amaravati Tension: ఉండవల్లిలో హైటెన్షన్.. వైసీపీ నేతలపై కోడిగుడ్లు, రాళ్ల దాడి
-
BMW X6 Facelift: భారత్లో BMW X6 ఫేస్లిఫ్ట్ లాంచ్.. 530HP పవర్, జస్ట్ 4.3 సెకన్స్ లో 100kmph స్పీడ్
ట్రెండింగ్
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!