Mamata Banerjee: అమితాబ్ ఇంటికి వెళ్లి రాఖీ కట్టిన పశ్చిమ బెంగాల్ సీఎం మమత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం ముంబైలోని బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ నివాసంలో ఆయనతో సమావేశమయ్యారు. ఆగస్టు 31, సెప్టెంబర్ 1న జరిగిన ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇన్క్లూజివ్ అలయన్స్ (ఇండియా) కూటమి రెండు రోజుల సమావేశానికి హాజరయ్యేందుకు ముంబై విమానాశ్రయానికి చేరుకున్న వెంటనే మమతా బెనర్జీ సబర్బన్ జుహులోని అమితాబ్ బచ్చన్ నివాసానికి వెళ్లారు. ఆయన కుటుంబసభ్యులతో మమత సంభాషించారు. వారి విలువైన సమయాన్ని అందించినందుకు ఆమె వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు. వారి భవిష్యత్ ప్రయత్నాలన్నిటికీ శుభాకాంక్షలు తెలిపారు.
Also Read: Pew Research Survey: 80 శాతం ప్రధాని మోడీకి సానుకూలం.. ప్యూ సర్వేలో కీలక విషయాలు
Also Read
- VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
- CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
- New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
- Uttar Pradesh: ‘‘నా అల్లుడు 25 పెళ్లిళ్లు చేసుకున్నాడు’’.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
ఈ రోజు తాను అమితాబ్కు రాఖీ కట్టినట్లు, ఈ రోజు గొప్ప రోజు అని మమతా బెనర్జీ అన్నారు. అమితాబ్ బచ్చన్ కుటుంబ సభ్యులను కలిసిన తర్వాత విలేఖరులతో మాట్లాడిన మమతా బెనర్జీ.. కోల్కతాను సందర్శించాల్సిందిగా తాను నటుడిని ఆహ్వానించినట్లు చెప్పారు. తన దృష్టిలో అసలు సిసలు భారతరత్న అమితాబ్ బచ్చనేనని తేల్చి చెప్పారు. ముంబైకి వచ్చినప్పుడు తన ఇంటికి రావాలని ఆహ్వానించారని పేర్కొన్నారు. దసరా పండగ సందర్భంగా కోల్కతలో జరిగే దుర్గాదేవి పూజలకు హాజరు కావాలని బచ్చన్ కుటుంబాన్ని కోరినట్లు వివరించారు. ఆయన కుటుంబం కూడా చిత్ర పరిశ్రమకు పెద్దపీట వేసిందన్నారు. అమితాబ్ బచ్చన్ గత సంవత్సరం కోల్కతా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడ మమతా బెనర్జీ భారతీయ సినిమాకి ఆయన చేసిన కృషికి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రదానం చేయాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.
ఇండియా కూటమి ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరనే ప్రశ్నకు మమతా బెనర్జీ మాట్లాడుతూ.. ఇండియా మన ప్రధానమంత్రి ముఖం అవుతుందన్నారు. దేశాన్ని రక్షించడమే తమ ప్రథమ కర్తవ్యం అని ఆమె అన్నారు. రక్షా బంధన్ సందర్భంగా ఇస్రో శాస్త్రవేత్తలకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు.
తాజావార్తలు
-
Hash Oil : స్నాప్చాట్లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
-
VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
-
CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
-
New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
-
Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!