Mamata Banerjee: అమితాబ్ ఇంటికి వెళ్లి రాఖీ కట్టిన పశ్చిమ బెంగాల్ సీఎం మమత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం ముంబైలోని బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ నివాసంలో ఆయనతో సమావేశమయ్యారు. ఆగస్టు 31, సెప్టెంబర్ 1న జరిగిన ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇన్క్లూజివ్ అలయన్స్ (ఇండియా) కూటమి రెండు రోజుల సమావేశానికి హాజరయ్యేందుకు ముంబై విమానాశ్రయానికి చేరుకున్న వెంటనే మమతా బెనర్జీ సబర్బన్ జుహులోని అమితాబ్ బచ్చన్ నివాసానికి వెళ్లారు. ఆయన కుటుంబసభ్యులతో మమత సంభాషించారు. వారి విలువైన సమయాన్ని అందించినందుకు ఆమె వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు. వారి భవిష్యత్ ప్రయత్నాలన్నిటికీ శుభాకాంక్షలు తెలిపారు.
Also Read: Pew Research Survey: 80 శాతం ప్రధాని మోడీకి సానుకూలం.. ప్యూ సర్వేలో కీలక విషయాలు
Also Read
- Ganja Party Busted: గంజాయి పార్టీ గుట్టురట్టు.. పోలీసుల అదుపులో ఆయుర్వేద డాక్టర్.!
- Nara Lokesh: డబ్బులిచ్చి చేతులు దులుపుకోవడానికి రాలేదు.. మంత్రి లోకేశ్ ఫైర్!
- Vizag: విశాఖ స్టీల్ ప్లాంట్ విషాదం.. డీఎన్ఏ పరీక్షల తర్వాతే మృతదేహాల గుర్తింపు.! విచారణకు కేంద్రం ఉన్నతస్థాయి కమిటీ..
- AIIMS Study: వాయు కాలుష్యంతో కడుపులోని బిడ్డ ఎదుగుదలకు బ్రేక్.. ఎయిమ్స్ పరిశోధనలో షాకింగ్ విషయాలు!
ఈ రోజు తాను అమితాబ్కు రాఖీ కట్టినట్లు, ఈ రోజు గొప్ప రోజు అని మమతా బెనర్జీ అన్నారు. అమితాబ్ బచ్చన్ కుటుంబ సభ్యులను కలిసిన తర్వాత విలేఖరులతో మాట్లాడిన మమతా బెనర్జీ.. కోల్కతాను సందర్శించాల్సిందిగా తాను నటుడిని ఆహ్వానించినట్లు చెప్పారు. తన దృష్టిలో అసలు సిసలు భారతరత్న అమితాబ్ బచ్చనేనని తేల్చి చెప్పారు. ముంబైకి వచ్చినప్పుడు తన ఇంటికి రావాలని ఆహ్వానించారని పేర్కొన్నారు. దసరా పండగ సందర్భంగా కోల్కతలో జరిగే దుర్గాదేవి పూజలకు హాజరు కావాలని బచ్చన్ కుటుంబాన్ని కోరినట్లు వివరించారు. ఆయన కుటుంబం కూడా చిత్ర పరిశ్రమకు పెద్దపీట వేసిందన్నారు. అమితాబ్ బచ్చన్ గత సంవత్సరం కోల్కతా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడ మమతా బెనర్జీ భారతీయ సినిమాకి ఆయన చేసిన కృషికి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రదానం చేయాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.
ఇండియా కూటమి ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరనే ప్రశ్నకు మమతా బెనర్జీ మాట్లాడుతూ.. ఇండియా మన ప్రధానమంత్రి ముఖం అవుతుందన్నారు. దేశాన్ని రక్షించడమే తమ ప్రథమ కర్తవ్యం అని ఆమె అన్నారు. రక్షా బంధన్ సందర్భంగా ఇస్రో శాస్త్రవేత్తలకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు.
తాజావార్తలు
-
Ganja Party Busted: గంజాయి పార్టీ గుట్టురట్టు.. పోలీసుల అదుపులో ఆయుర్వేద డాక్టర్.!
-
Nara Lokesh: డబ్బులిచ్చి చేతులు దులుపుకోవడానికి రాలేదు.. మంత్రి లోకేశ్ ఫైర్!
-
Thalaivar173 : డాక్టర్ గా సూపర్ స్టార్.. డైరెక్టర్ ఎవరంటే
-
Most Valuable Celebrities List : మోస్ట్ వ్యాల్యుబుల్ సెలబ్రిటి లిస్ట్ విడుదల.. టాప్ ప్లేస్లో ఎవరున్నారు? అల్లు అర్జున్ ర్యాంక్ ఎంత?
-
Vizag: విశాఖ స్టీల్ ప్లాంట్ విషాదం.. డీఎన్ఏ పరీక్షల తర్వాతే మృతదేహాల గుర్తింపు.! విచారణకు కేంద్రం ఉన్నతస్థాయి కమిటీ..
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!