Qatar: ఖతార్లో భారతీయ ఇంజనీర్ అరెస్ట్.. సాయం చేయలంటూ విజ్ఞప్తి
- ఖతార్లో గుజరాత్కు చెందిన ఇంజనీర్ అరెస్టు
- క్రిమినల్ కేసు దర్యాప్తులో అమిత్ గుప్తా అరెస్ట్
- టెక్ మహీంద్రా సంస్థలో ఇంజనీర్గా పనిచేస్తున్న గుప్తా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గుజరాత్కు చెందిన ఇంజనీర్ అమిత్ గుప్తాను ఖతార్లో అరెస్టు చేసిన విషయం వెలుగుచూసింది. ఈ అరెస్టు క్రిమినల్ కేసు దర్యాప్తులో భాగంగా చేపట్టినట్లు అధికారులు తెలిపారు. అమిత్ గుప్తా టెక్ మహీంద్రా సంస్థలో ఇంజనీర్గా పనిచేస్తున్నారు. కాగా.. ఖతార్ పోలీసులు 2025 జనవరి 1న అమిత్ గుప్తాను అరెస్టు చేసినట్లు ఆయన తల్లి పుష్ప గుప్తా తెలిపారు. అయితే.. అమిత్ గుప్తాపై ఉన్న అభియోగాలు, అతన్ని ఏ నేరానికి అరెస్టు చేశారన్నది తెలియలేదు. ఈ విషయం పై గుప్తా కుటుంబం ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేస్తూ.. గోప్యతతో కూడిన విచారణ జరిపించి తమకు సహాయం అందించాలని కోరింది. గుప్తాను అన్యాయంగా అరెస్టు చేసినట్లు అతని కుటుంబం చెబుతోంది.
Read Also: Aamir Khan : ఆమె వల్ల నరకం అనుభవించా.. అమీర్ ఖాన్ ఎమోషనల్..
Also Read
అమిత్ గుప్తా నిర్దోషి.. డేటా దొంగతనం కేసులో అమిత్ గుప్తాను ఇరికించారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో.. అమిత్ గుప్తా తల్లి పుష్ప గుప్తా ఖతార్ వెళ్లి భారత రాయబార కార్యాలయంతో సంప్రదించింది. ఈ క్రమంలో భారత రాయబార కార్యాలయం అమిత్కు సహాయం అందించేందుకు సిద్ధంగా ఉందని.. దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. అమిత్ గుప్తా గత 10 సంవత్సరాలుగా ఖతార్లోని టెక్ మహీంద్రా సంస్థలో పనిచేస్తున్నాడు. మరోవైపు.. గుప్తాను కలవడానికి తన తండ్రి ఖతార్ వెళ్లారు. అయితే అతనిని కలవడం సాధ్యం కాలేదు.
Read Also: SYG : శ్రీకాంత్ పవర్ఫుల్ లుక్ రిలీజ్..
ఖతార్లో భారతీయులను అరెస్టు చేయడం ఇది మొదటిసారి కాదు. 2022లో ఎనిమిది మంది భారత నావికులను అరెస్టు చేశారు. వారికి మరణశిక్ష విధించిన అక్కడి ప్రభుత్వం.. ఆ తరువాత ఎమిర్ ఆదేశాల మేరకు కోర్టు వారిని విడుదల చేసింది. కాగా.. అమిత్ గుప్తా కుటుంబం.. ప్రభుత్వాన్ని, ఖతార్ అథారిటీస్ నుండి తగిన సహాయం అందించాలని కోరుకుంటోంది.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!