Houthi Rebels: హౌతీ రెబల్స్పై అమెరికా, యూకే స్ట్రైక్స్.. 11 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎర్ర సముద్రంలో కార్గో షిప్లను నిరంతరం లక్ష్యంగా చేసుకుంటున్న హౌతీ రెబల్స్ పై అగ్రరాజ్యం అమెరికా, బ్రిటన్ భారీ ఎత్తున దాడులకు దిగింది. నిన్న ( సోమవారం) యూఎస్-బ్రిటీష్ సంకీర్ణ దళాలు పశ్చిమ యెమెన్లోని ఓడరేవులు, చిన్న పట్టణాలపై వైమానిక దాడులు నిర్వహించాయి. ఈ దాడుల్లో దాదాపు 11 మంది మరణించారు. అలాగే, 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. హౌతీలకు సంబంధించిన మీడియా సంస్థ అల్ మసీరా ప్రకారం.. US-బ్రిటీష్ సంకీర్ణం యెమెన్లో హోడెయిడా నగరం, రాస్ ఇస్సా నౌకాశ్రయంతో సహా దాదాపు 17 వైమానిక దాడులు నిర్వహించింది అని తెలిపింది.
Read Also: NIA Raids: దేశవ్యాప్తంగా 30 చోట్ల ఎన్ఐఏ సోదాలు..
Also Read
- Punjab: మాజీ కేంద్ర మంత్రి అరెస్ట్.. పంజాబ్లో హై-వోల్టేజ్ డ్రామా..
- LPG UPI Payments: కొత్త యూపీఐ నిబంధన.. ఎల్పీజీ సిలిండర్లపై తీవ్ర ప్రభావం..?
- CM Chandrababu: రాజముద్ర వేసి ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం.. మిగిలిన వారికి కూడా ఇస్తాం..
- Greenland Deal: ట్రంప్ ఆశ నెరవేరింది.. గ్రీన్ల్యాండ్పై డెన్మార్క్తో డీల్..
ఇక, హౌతీ రెబల్స్ దాడిలో ముగ్గురు పౌరులు మరణించి ఓడ మునిగిపోయిన కొద్ది రోజులకే ఈ దాడి జరగడం గమనార్హం. గాజా దాడులకు నిరసనగా ఎర్ర సముద్రంలో హౌతీ తిరుగుబాటుదారులు దాడులు చేయడం ప్రారంభించిన తర్వాత ముగ్గురు సామాన్య పౌరులు మరణించిన తొలి దాడి ఇది. అమెరికా- బ్రిటన్ల ఆపరేషన్ తర్వాత కూడా.. హౌతీలు తమ దాడులను కొనసాగిస్తున్నారు. హౌతీ రెబల్స్ ను కంట్రోల్ చేయడంలో ఇటువంటి వైమానిక దాడులు విజయవంతమవుతాయో లేదో చెప్పడం కష్టంగా మారింది. ఇక, ఈ దాడులతో కార్గో షిప్స్ అన్ని సౌతాఫిక్రా నుంచి వెళ్లాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలోనే యూఎస్, యూకే దాడులు చేసినట్లు తెలుస్తుంది.
Read Also: CAA: నేడు సీఏఏకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా బంద్.. సీఎం హెచ్చరించిన పట్టించుకోని పార్టీలు..
ఇక, నేటి (మంగళవారం) ఉదయం యెమెన్ టెలివిజన్లో హౌతీ ప్రతినిధి తెలిపిన ప్రకటన ప్రకారం.. ఎర్ర సముద్రంలో అమెరికన్ నౌక (పినోచియో) క్షిపణులతో లక్ష్యంగా చేసుకుంది.. ఐఎంఓ తెలిపిన వివరాల ప్రకారం, పినోచియో అనేది సింగపూర్- రిజిస్టర్డ్ కంపెనీ ఓమ్- మార్చ్ 5 ఇంక్ యాజమాన్యంలోని లైబీరియా-ఫ్లాగ్డ్ కంటైనర్ షిప్ అని వెల్లడించారు.
తాజావార్తలు
-
Vijay Sethupathi: సీఎం విజయ్ ఫోన్ చేశాడు.. ఆ సీక్రెట్ కాల్ ముచ్చట్లు బయటపెట్టిన సేతుపతి..!
-
Punjab: మాజీ కేంద్ర మంత్రి అరెస్ట్.. పంజాబ్లో హై-వోల్టేజ్ డ్రామా..
-
America: హౌతీలతో లోపయకారి ఒప్పందం.. సౌదీని రోడ్డున పడేసిన అగ్రరాజ్యం!
-
LPG UPI Payments: కొత్త యూపీఐ నిబంధన.. ఎల్పీజీ సిలిండర్లపై తీవ్ర ప్రభావం..?
-
CM Chandrababu: రాజముద్ర వేసి ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం.. మిగిలిన వారికి కూడా ఇస్తాం..
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!