బాలీవుడ్ ఇండస్ట్రీ లో కొంత మంది హీరోయిన్ లు పై కేసులు నమోదు అవ్వడం వారు నిరంతరం కోర్ట్ కి అలాగే పోలీస్ స్టేషన్ కి హాజరవడం లాంటివి నిరంతరం చూస్తూనే వున్నాం.ఎక్కువగా హీరోయిన్ల పై నే కేసులు నమోదు అవుతున్నాయి. మరి ముఖ్యంగా చెక్ బౌన్స్ కేసులో ఇప్పటికే చాలామంది హీరోయిన్ లు కోర్టుల చుట్టూ తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఇదే తరహాలో ప్రముఖ బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ అయిన అమీషా పటేల్ కూడా ఒక కేసులో ఇరుక్కున్నట్లు సమాచారం.. ఆ కేసులో భాగంగా తాజాగా ఆమె కోర్టులో సరెండర్ కూడా అయ్యిందని తెలుస్తుంది.
తాజాగా జూన్ 17న ఉదయం రాంచి సివిల్ కోర్టులో ఆమె లొంగిపోయినట్లు సమాచారం.. సినిమా నిర్మాత మరియు వ్యాపారవేత్త అయిన అజయ్ కుమార్, అమీషా పటేల్ పై చెక్ బౌన్స్ కేసు వేశాడు . దాంతో ఆమె కోర్ట్ మెట్లు ఎక్కాల్సి వచ్చింది. అయితే గతంలో సినిమా నిర్మిస్తానంటూ అమీషా పటేల్ తన దగ్గర 2.5 కోట్లు అప్పుగా అయితే తీసుకుందని, ఆ తర్వాత ఆమె సినిమా ను పూర్తిచేయలేదని, తన డబ్బు ను కూడా తిరిగి ఇవ్వలేదని అజయ్ కుమార్ తన పిటిషన్లో పేర్కొన్నాడు. అసలు .2.5 కోట్లకు వడ్డీ 50 లక్షలు కలిపి మొత్తం 3 కోట్లు ఇప్పించాలని ఆయన కోర్టును కోరినట్లు తెలుస్తుంది.. ఈ కేసు విచారణ చేసిన కోర్టు ఏప్రిల్ నెల 6న అమీషాకు వారెంట్ ఇష్యూ చేసినట్లు సమాచారం.. ఈ నేపథ్యంలో ఆమె ఈరోజు కోర్టులో లొంగిపోయింది. ఆ తరువాత కోర్టు ఆమె షరతులతో కూడిన బెయిల్ కూడా మంజూరు చేసింది.. దాంతో కోర్టు బయటికి వచ్చిన ఆమె వెంటనే స్పీడ్ గా స్పందించి తలకు ముసుగు కప్పకున్నట్లు సమాచారం.మీడియాను చూసి తలకు ముసుగు కప్పుకుంది. కోర్టులో ఏం జరిగిందో చెప్పమని మీడియా ప్రతినిధులు ఆమెను పదేపదే ప్రశ్నించినా కూడా ఆమె పట్టించుకోకుండా కారులోకి ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోయిన్నట్లు సమాచారం.. అయితే ఆమె కోర్ట్ నుంచి బయటికి వస్తున్న నేపథ్యంలో మీడియాను చూసి వారిని ఎదుర్కొలేక అలా ముసుగు వేసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయింది. అందుకు సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. ఆ ఫోటోలు వీడియోలు చూసిన ఆమెను పలు విధాలుగా ట్రోల్ చేస్తున్నారు.