Ambati Rambabu: వైసీపీ మీద కోపం ఉంటే మాతో పోరాడండి.. ఉద్యోగాలు పీకేయకండి..
- కూటమి సర్కారుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫైర్
- 410 మంది ఉద్యోగులను ఫైబర్ నెట్ నుంచి తొలగిస్తున్నారని మండిపాటు
- సూపర్ సిక్స్ అమలు చేయకపోవడానికి ఎవరు కారణమని ప్రశ్నలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ambati Rambabu: ఎన్నికల సమయంలో ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు ఉద్యోగాల నుంచి తొలగిస్తోందని.. 410 మంది ఉద్యోగులను ఫైబర్ నెట్ నుంచి తొలగిస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రంగా మండిపడ్డారు. నిరుద్యోగులకు ఇస్తాం అని చెప్పిన భృతి ఇవ్వడం లేదని ఆయన విమర్శించారు. వైసీపీ మీద కోపం ఉంటే మాతో పోరాడండి.. అంతే కాని మా ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలు పీకేయకండి అంటూ అంబటి రాంబాబు పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ముప్పై లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చామన్నారు. వాలంటీర్లను, ఉద్యోగాలు లేకుండా చేశారని విమర్శలు గుప్పించారు. ఈ నెల 27న పెంచిన విద్యుత్ చార్జీలకు నిరసనగా విద్యుత్ కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రతి దానికి వైఎస్ జగన్పై నిందలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సూపర్ సిక్స్ అమలు చేయకపోవడానికి ఎవరు కారణమని ఆయన ప్రశ్నించారు.
Read Also: AP New CS: ఆంధ్రప్రదేశ్ కొత్త సీఎస్ ఎవరు?.. సీఎం చంద్రబాబు ఆలోచన ఏంటి?
Also Read
- Ahmedabad: అహ్మదాబాద్ను ముంచెత్తిన కుండపోత వర్షం.. 2 గంటల్లో 177 మిల్లీమీటర్ల వర్షం
- Pakistan: సౌదీకి మేమున్నాం.. ఇరాన్కు పాకిస్తాన్ ప్రధాని వార్నింగ్..
- Paper Leaks: పంజాబ్లో పేపర్ లీక్.. చిక్కుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ..
- CJI Protest: నిరసనకారులకు ఢిల్లీ పోలీసులు బిగ్ షాక్.. అలా చేస్తే పాస్పోర్టులు రద్దు!
కూటమి పార్టీలు ఎన్నికల కు ముందు అనేక హామీలు ఇచ్చారని.. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని చెప్పి ఓట్లు దండుకున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. బాదుడే బాదుడు అని చెప్పి అధికారంలోకి వచ్చి రూ.15,485 కోట్ల విద్యుత్ చార్జీలు బాదారని విమర్శించారు. ఆ రోజు స్మార్ట్ మీటర్లు పగల కొట్టమని చెప్పిన టీడీపీ నాయకులు.. ఇప్పుడు ఎందుకు స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుందని అడిగారు. గ్రామాల్లో ఉన్న రోడ్లపై కూడా టోల్ వసూలు చేస్తారంట.. ఇదేనా సంపద సృష్టించడం అంటే.. అని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. అప్పుల కోసం చిప్ప పట్టుకుని తిరుగుతున్నారని.. అప్పులతోనే ప్రభుత్వాన్ని నడిపే స్థితికి వచ్చారని ఆయన తీవ్రంగా వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వంలో ఆదాయం పడిపోయిందన్నారు.
తాజావార్తలు
-
Ahmedabad: అహ్మదాబాద్ను ముంచెత్తిన కుండపోత వర్షం.. 2 గంటల్లో 177 మిల్లీమీటర్ల వర్షం
-
ZIM vs IND: జింబాబ్వేను వణికించిన టీమిండియా.. భారత్ ముందు 126 పరుగుల టార్గెట్!
-
Venky Anil5: ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్.. క్రేజీ వీడియో రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి!
-
Pakistan: సౌదీకి మేమున్నాం.. ఇరాన్కు పాకిస్తాన్ ప్రధాని వార్నింగ్..
-
Paper Leaks: పంజాబ్లో పేపర్ లీక్.. చిక్కుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ..
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?