Ambati Rambabu: అవగాహన లేని డీజీపీ, ఎస్పీల వల్లే హింస..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ambati Rambabu: ఎన్నికల సమయంలో అవగాహన లేని డీజీపీ, ఎస్పీలను పెట్టడం వలస హింస జరిగిందని వ్యాఖ్యానించారు అంబటి రాంబాబు.. డీజీపీ కార్యాలయానికి వెళ్లి వైసీపీ ప్రతినిధులు అంబటి రాంబాబు, మేరుగ నాగార్జున, లేళ్ల అప్పిరెడ్డి, పేర్నినాని.. తమ కేడర్పై టీడీపీ దాడులకు పాల్పడుతోందని డీజీపీకి ఫిర్యాదు చేశారు.. అనంతరం మీడియాతో మాట్లాడిన అంబటి రాంబాబు.. పోలీసు వ్యవస్థలో కొంతమంది టీడీపీ వారితో కలిసిపోయారని ఆరోపించారు. మాకు బాగా ఓట్లు పడేచోట భారీగా పోలీసులను పెట్టారు.. టీడీపీకి బలమైన గ్రామాలలో పోలీసులను పెట్టలేదని.. దీంతో వారు పోలింగ్ బూత్ లను క్యాప్చర్ చేశారు.. నన్ను హౌస్ అరెస్టు చేసి, నా ప్రత్యర్థిని యథేచ్చగా తిరగనిచ్చారు.. చాలా దుర్మార్గపు చర్యలకు దిగారు.. పోలీసు అధికారులను ఉన్నట్టుండి మార్చారు.. అధికారులను మార్చిన తర్వాత ఎందుకు హింస జరిగింది? అని ప్రశ్నించారు.
Read Also: Perni Nani: పోలింగ్ తర్వాత హింసకు వారే కారణం.. పక్కా ప్లాన్ ప్రకారమే దాడులు..!
Also Read
ఎన్నికల కమిషన్ తీసుకున్న తప్పుడు నిర్ణయం వలనే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు అంబటి రాంబాబు.. పోలీసు పరిశీలకుడు ఢిల్లీ ఆదేశాలు, పురంధేశ్వరి ఆదేశాలతోనే చేశారని విమర్శించారు.. సీఎస్, డీజీపీలను ఢిల్లీకి పిలిచారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చన్న ఆయన.. తన నియోజకవర్గంలో రీపోలింగ్ అవసరం లేదని ఎన్నికల కమిషన్ ఎలా చెబుతుంది? అని నిలదీశారు.. వెబ్ కెమెరాలను విశ్లేషించకుండా ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకుంటారు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు అంబటి రాంబాబు.. ఇక, మీడియాతో మాట్లాడే అంబటి రాంబాబు.. ఏ అంశాలపై స్పందించారో తెలుసుకోవడానికి కింది వీడియోను క్లిక్ చేయండి..
తాజావార్తలు
-
DELHI: సిగరేట్కు అగ్గిపుల్ల ఇవ్వలేదని యువకుడి దారుణహత్య..
-
Polavaram District: ఏపీలో విషాదం.. ఒకే ప్రియుడి కోసం ఇద్దరు యువతులు ఆత్మహత్య..
-
Delhi: బ్రిక్స్ డ్యూటీలో సెక్యూరిటీ సిబ్బంది తుపాకీలతో రీల్స్.. ఒకరు సస్పెండ్
-
UP Elections: యూపీలో బీజేపీకి ‘‘కర్ణిసేన’’ తలనొప్పి.. 50 స్థానాల్లో పోటీ..
-
CM Revanth Reddy : ఇందిరమ్మ ఇళ్లు అమ్ముకోవచ్చు కానీ..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!