Amarnath Yatra: వారం ముందే అర్ధంతరంగా ముగిసిన అమర్నాథ్ యాత్ర.? కారణమేంటంటే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amarnath Yatra: ప్రతి సంవత్సరం లాగే అమరనాథ్ యాత్ర ఈసారి ముందుగా అనుకున్న ముహూర్తాని కంటే వారం ముందు అర్ధంతరంగా ముగిసింది. ఈ నిర్ణయానికి ముఖ్య కారణం వర్షాలు. బలటాల్, పహల్గాం మార్గాలలో ఏర్పడిన ప్రమాదకర పరిస్థితుల నేపథ్యంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 9న రక్షాబంధన్ నాడు ముగియాల్సిన యాత్రను అధికారుల సూచనలతో ఆగస్టు 3 నుంచే ముగించనున్నారు.
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
కాశ్మీర్ డివిజనల్ కమిషనర్ విజయ్ కుమార్ బిధూరి ఈ సమాచారాన్ని అందించారు. ఆయన తెలిపిన వివరాలు మేరకు.. ఇటీవలి భారీ వర్షాల కారణంగా బలటాల్, పహల్గాం మార్గాలపై మరమ్మతులు అత్యవసరంగా చేయాల్సి ఉంది. మార్గాలపై మిషనరీలు, సిబ్బంది నిబంధనల మేరకు పనిచేస్తుండటం వల్ల రేపటి (ఆగష్టు 3) నుంచి యాత్ర కొనసాగించడం సాధ్యపడదు. కాబట్టి ఈ ఏడాది అమరనాథ్ యాత్ర ఆగస్టు 3 నుంచి పూర్తిగా నిలిపివేస్తున్నాం అని తెలిపారు.
71 National Film Awards : జాతీయ అవార్డులు వచ్చిన వారికి ప్రైజ్ మనీ.. ఎవరికి ఎంత..?
ఇక శ్రీ అమరనాథ్ శ్రైన్ బోర్డు ప్రకారం.. ఈ ఏడాది ఇప్పటివరకు లక్షలాది భక్తులు అమరనాథ్ గుహాశ్రయాన్ని దర్శించారన్నారు. మొత్తం 4 లక్షల మంది పుణ్యదర్శనం చేసినట్లు తెలిపారు. అయితే, గత వారం రోజులుగా వాతావరణం, భద్రతా అంశాల కారణంగా యాత్రికుల సంఖ్యలో తగ్గుదల కనిపించిందని అధికారులు తెలిపారు. నిజానికి ప్రభుత్వం ఈసారి యాత్ర కోసం ప్రభుత్వం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. ఏప్రిల్ 22న పహల్గాం ప్రాంతంలో జరిగిన తీవ్రవాద దాడి అనంతరం అప్రమత్తతతో 600 అదనపు పారామిలిటరీ కంపెనీలను సెక్యూరిటీగా నియమించారు. ఇప్పటికే ఉన్న భద్రతా వ్యవస్థతో పాటు ఈ అధిక భద్రతా బలగాలు యాత్ర దారుల రక్షణకు పనిచేశాయి
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!