Ajit Doval: ఉగ్రవాద కార్యకలాపాలను ఎదుర్కొవలిసిందే.. బీజింగ్ సమావేశంలో అజిత్ దోవల్ కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ajit Doval: బీజింగ్ వేదికగా జరిగిన సమావేశంలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో సమావేశమైన భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ భద్రతా అంశాలపై పలు కీలక వ్యాఖ్యలను చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలోని అన్ని రకాల ఉగ్రవాద కార్యకలాపాలను ఎదుర్కొనాల్సిన అవసరాన్ని ఉందని ఆయన స్పష్టం చేశారు. మే 7న భారత్ పాకిస్తాన్ ఆక్రమిత ప్రాంతాల్లోని ఉగ్రవాద స్థావరాలపై జరిగిన దాడుల తర్వాత ఈ సమావేశం కీలకంగా మారింది. పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది అమాయకులు మరణించిన ఘటన నేపథ్యంలో ఆ దాడులు చేపట్టిన సంగతి తెలిసిందే.
Read Also: Donald Trump: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ముగిసింది.. ట్రంప్ సంచలన పోస్ట్
Also Read
అజిత్ దోవల్ శాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సభ్య దేశాల జాతీయ భద్రతా సలహాదారుల సమావేశంలో పాల్గొనడానికి చైనా పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో ద్వైపాక్షిక సంబంధాలపై అనేక అంశాలను చర్చించారు. ఇరు దేశాల మధ్య జరిగిన అనుభవాలను చర్చించడమే కాకుండా, పరస్పర విశ్వాసాన్ని అందించుకోవాల్సిన అవసరాన్ని కూడా ఇరు పక్షాలు చర్చించాయి. ముఖ్యంగా ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాలను బలపరిచే దిశగా చర్యలు చేపట్టాలని భారత విదేశాంగ మంత్రిత్వశాఖ (MEA) వెల్లడించింది.
Read Also:Operation Sindhu: ఇరాన్ నుంచి.. ఢిల్లీ చేరుకున్న 10 మంది ఏపీ విద్యార్థులు!
మరోవైపు, చైనా-భారత్ సంబంధాలు మరింత మెరుగవుతున్నాయని, ఏవైనా కీలక అంశాలను చక్కబెట్టుకోవడం ద్వారా సరిహద్దుల్లో శాంతి నెలకొల్పగలమని చైనా రాయబారి శూ ఫెహాంగ్ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ‘‘డ్రాగన్ (చైనా), ఏలిపెంట్ (భారత్) కలిసి నాట్యం చేస్తేనే విజయవంతమైన ఫలితాలు సాధ్యపడతాయి’’ అంటూ చైనా తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది. ఈ సమావేశంలో దోవల్ మాట్లాడుతూ.. మల్టీలాటరల్ వ్యవస్థల్లో చైనాతో సహకారాన్ని మరింత బలపరిచేందుకు భారతదేశం సిద్ధంగా ఉందని, SCO చైర్మన్ గా చైనా చేపట్టిన కార్యక్రమాలను భారత్ సంపూర్ణంగా మద్దతు ఇస్తుందన్నారు.
తాజావార్తలు
-
Fake Shopping Offers : రూ.999 ఆఫర్.. ఖాతా ఖాళీ.! సైబర్ మోసగాళ్ల కొత్త ట్రిక్
-
OTR: కలెక్టర్ vs పోలీస్?.. పెద్దపల్లిలో హాట్ టాపిక్గా మారిన రివ్యూ మీటింగ్
-
OTR: ఎమ్మెల్యే మాధవి వైఖరి మిగతా ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారిందా?
-
Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
-
ITR Filing: కొత్త ట్యాక్స్ విధానమే బెస్ట్? పాత విధానం ఎవరికి లాభం.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!