Donald Trump: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ముగిసింది.. ట్రంప్ సంచలన పోస్ట్
- ఇరాన్-ఇజ్రాయెల్యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన
- యుద్ధం ముగిసిందంటూ పోస్ట్ పెట్టిన ట్రంప్
- సీజ్ ఫైర్కు రెండు దేశాలు అంగీకరించాయన్న ట్రంప్
- 24 గంటల్లో సీజ్ ఫైర్ అమలులోకి వస్తుంది
- 12 రోజుల యుద్ధానికి ఇది ముగింపు. : డొనాల్డ్ ట్రంప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran-israel : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఆయన తెలిపిన ప్రకారం, అమెరికా మిత్ర దేశమైన ఇజ్రాయెల్ – ప్రత్యర్థి దేశమైన ఇరాన్ మధ్య పూర్తి స్థాయి కాల్పుల విరమణ (Complete and Total Ceasefire) కి ఒప్పందం కుదిరిందని తెలిపారు. ఈ విరమణను వచ్చే 24 గంటల్లో దశలవారీగా అమలు చేయనున్నట్లు తెలిపారు. “ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య పూర్తిస్థాయి కాల్పుల విరమణకి అంగీకారమైంది. దాదాపు ఆరు గంటల లోపు ఇరువురు తమ తుది మిషన్లను పూర్తి చేసిన తర్వాత 12 గంటల విరామం ప్రారంభమవుతుంది. ఆ సమయంలో యుద్ధం ముగిసినట్టుగా పరిగణిస్తాం,” అంటూ ట్రంప్ తన ట్రూత్ అకౌంట్లో పోస్టు చేశారు.
CM Chandrababu: డబుల్ ఇంజిన్ సర్కారు ఎలా ఉంటుందో చూపించాం.. ఇదే జోరు కొనసాగిద్దాం..
Also Read
- Car Crash: నటుడి ఇంట్లోకి దూసుకెళ్లిన కారు.. యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.!
- PM Modi MCG Visit: యువ క్రికెటర్లతో ప్రధాని మోడీ ముచ్చట్లు.. భారత్-ఆస్ట్రేలియా స్పోర్ట్స్ కొలాబరేషన్ రోడ్మ్యాప్ ప్రారంభం
- 900 Snakes Escape: పాముల పెంపక కేంద్రం మునిగి 900 నాగుపాములు బయటకు.. ప్రాణ భయంతో వణుకుతున్న ప్రజలు (వీడియో)
- Trump: టర్కీకి బయల్దేరే ముందు ఓవల్ ఆఫీస్లో ఏం జరిగింది.. ఇరాన్పై ట్రంప్ యుద్ధానికెళ్లడానికి కారణమిదేనా?
ట్రంప్ ఈ ఘర్షణను “12 రోజుల యుద్ధం” గా పేర్కొన్నారు. “ఇది ఏళ్ల తరబడి సాగే యుద్ధం కావచ్చు, కానీ ఇరు దేశాల ధైర్యం, సహనశీలత, తెలివితేటల వల్ల ఇది త్వరగా ముగిసింది. ప్రపంచం దీనిని గుర్తించి అభినందిస్తుంది,” అంటూ కొనియాడారు. ట్రంప్ ప్రకారం.. మొదటగా ఇరాన్ కాల్పుల విరమణను ప్రారంభిస్తుంది. ఆ తర్వాత 12 గంటలకే ఇజ్రాయెల్ కూడా అదే చేస్తుంది. మరో 12 గంటల తర్వాత అధికారికంగా యుద్ధం ముగిసినట్టు ప్రపంచం ప్రకటిస్తుందని వివరించారు. అయితే ట్రంప్ ప్రకటనపై ఇరాన్ లేదా ఇజ్రాయెల్ అధికారికంగా ఎలాంటి స్పందన ఇవ్వలేదు. ఈ విషయంలో ఇప్పటివరకు ఆ దేశాల నుండి ఎటువంటి నిర్ధారణ లేదన్నది స్పష్టంగా ఉంది.
ఈ ఘర్షణ జూన్ 13న మొదలైంది. ఇజ్రాయెల్ “ఆపరేషన్ రైజింగ్ లయన్” పేరుతో ఇరాన్ సైనిక, అణు కేంద్రాలపై భారీ వైమానిక దాడులు ప్రారంభించింది. దీనికి ప్రతిగా, ఇరాన్ ఈద్వారి విప్లవ గార్డు (IRGC) “ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3” ప్రారంభించి, ఇజ్రాయెల్ యుద్ధవిమాన ఇంధన కేంద్రాలు , విద్యుత్ సంస్థలపై డ్రోన్, మిస్సైల్ దాడులు జరిపింది. ఈ ఉద్రిక్తతల నడుమ అమెరికా కూడా రంగంలోకి దిగింది. ఆదివారం తెల్లవారుజామున “ఆపరేషన్ మిడ్నైట్ హామర్” పేరుతో అమెరికా మూడు కీలక ఇరాన్ అణు కేంద్రాలపై ప్రిసిషన్ వైమానిక దాడులు చేసింది. దీనికి ప్రతిగా, ఇరాన్ కатар , ఇరాక్లోని అమెరికా సైనిక కేంద్రాలపై మిస్సైల్ దాడులు నిర్వహించింది. అందులో కATARలోని అల్ ఉదెయ్ద్ ఎయిర్ బేస్ కూడా ఉంది. ఇది మిడిల్ ఈస్ట్లో అమెరికాకు అతిపెద్ద బేస్.
CM Chandrababu: షాకింగ్..! ఇద్దరు కంటే తక్కువ పిల్లలుంటే ఎన్నికల్లో పోటీకి అనర్హులు..
తాజావార్తలు
-
Botsa Satyanarayana: గవర్నర్కు బొత్స లేఖ.. విశాఖలో వద్దు.. విజయనగరం మార్చండి..!
-
IND vs ENG: అతడు ఎందుకు దండగ.. ఎప్పుడో జట్టు నుంచి తప్పించాల్సింది!
-
2026 Tata Harrier: టాటా హారియర్, సఫారీ స్టెల్త్ ఎడిషన్ విడుదల.. 13 JBL స్పీకర్లు, లెవెల్-2 ADASతో అదిరిపోయే ఫీచర్లు
-
Lenin : అఖిల్కు మాజీ వదిన కంగ్రాట్స్.. సోషల్ మీడియాలో సామ్ పోస్ట్ వైరల్
-
AP Cabinet: ఏపీ కేబినెట్ భేటీ.. పవన్ కల్యాణ్ సహా ఐదుగురు మంత్రుల డుమ్మా..!
ట్రెండింగ్
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!