ఎయిర్టెల్ నుంచి మరో సరికొత్త ప్లాన్ వచ్చేసింది. మిగతా రంగాలకు ధీటుగా కొత్త ప్లాన్ను అమల్లోకి తెచ్చింది. కస్టమర్లను ఆకట్టుకోవడం కోసం ఎయిర్టెల్ సరికొత్త రీఛార్జ్ ప్లాన్స్ను తీసుకొచ్చింది. దీని వ్యాలిటిడీ ఏకంగా 35 రోజులు కావడం విశేషం.
ఇది కూడా చదవండి: Machilipatnam: పేర్ని నాని, కొడాలి నానిపై టీడీపీ కౌంటర్ ఎటాక్.. అంతా మీ వల్లే..!
తన కస్టమర్లను ఆకట్టుకోవడం కోసం ఎయిర్టెల్ సరికొత్త రీఛార్జ్ ప్లాన్స్ను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఈ క్రమంలో తాజాగా ఎయిర్టెల్ 35 వ్యాలిడిటీ ఉన్న ప్లాన్ను తీసుకొచ్చింది. సాధారణంగా ఇప్పుడు రీఛార్జ్ ప్లాన్స్ వ్యాలిడిటీ ఏవైనా 28 రోజులు మాత్రమే ఉంటున్నాయి. కానీ ఎయిర్టెల్ దీనికి భిన్నంగా 35 రోజుల వ్యాలిడిటీతో సరికొత్త ప్లాన్ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్ ద్వారా తక్కువ ధరతో.. ఎక్కువ వ్యాలిడిటీ ఉండే రీఛార్జ్ ప్లాన్స్ను పొందుకోవచ్చు.
ఇది కూడా చదవండి:Maoist Landmines: దడ పుట్టిస్తున్న మందు పాతరలు.. ఏజెన్సీలో టెన్షన్ టెన్షన్..
ఎయిర్టెల్ తీసుకొచ్చిన 35 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ ధర రూ.289. దీనిలో కస్టమర్లు ఎస్ఎంఎస్, అన్లిమిటెడ్ కాలింగ్తో సహా అనేక ప్రయోజనాలను పొందుతారు. ఈ ప్లాన్ అపరిమిత వాయిస్ కాలింగ్, 300 ఎస్ఎంఎస్ సేవతో వస్తుంది. ఇందులో కస్టమర్లు 4 జీబీ డేటా ప్రయోజనం కూడా పొందుతారు. అంటే ఈ కొత్త రూ. 289 రీఛార్జ్ ప్లాన్ ఎక్కువ డేటాను ఉపయోగించాల్సిన అవసరం లేని వినియోగదారులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇక ఎయిర్టెల్ అందుబాటులోకి తీసుకొచ్చిన మరో చౌకైన ప్లాన్ ధర రూ.19. ధర పరంగా ఇది ఎయిర్టెల్ చౌకైన ప్లాన్. ఎయిర్టెల్ రూ. 19 టాప్ అప్ ప్లాన్లో 1 జీబీ డేటా ఒక రోజు అందుబాటులో ఉంటుంది. తక్కువ డేటా అవసరమయ్యే కస్టమర్లకు ఈ ప్లాన్ ఉత్తమం.
ఇది కూడా చదవండి: T20 World Cup: టీ20 ప్రపంచకప్లో మొదటి వికెట్.. టోర్నీ నుంచి నిష్క్రమించిన తొలి టీమ్ ఇదే!