IndiGo CEO Apology: ఇండిగో విమానయాన సంస్థ గత మూడు రోజులుగా ఆపరేషనల్ సమస్యలను ఎదుర్కొంటోంది. భారీ సంఖ్యలో విమానాలు రద్దు కావడంతో పాటు అనేక ఫ్లైట్లు ఆలస్యమవుతుండటంతో దేశవ్యాప్తంగా ఎయిర్ పోర్టుల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితులపై ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్ ఈరోజు (డిసెంబర్ 4న) అధికారికంగా క్షమాపణలు చెప్పారు.
విమాన ప్రమాదాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. టెక్నికల్ ప్రాబ్లమ్స్, మానవ తప్పిదాలతో ఫ్లైట్స్ ప్రమాదానికి గురవుతున్నాయి. తాజాగా వెనిజులాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. గాల్లోకి టేకాఫ్ అయిన క్షణాల్లోనే కుప్పకూలిపోయింది. వెనిజులాలోని టచిరా రాష్ట్రంలోని పారామిల్లో విమానాశ్రయం నుండి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఒక ప్రైవేట్ PA-31 విమానం కూలి పేలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న ఇద్దరు వ్యక్తులు మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. Also…
భారత్, చైనా మధ్య విమాన కనెక్టివిటీ తిరిగి ప్రారంభం కానుంది. చైనా ఈస్టర్న్ ఎయిర్లైన్స్ నవంబర్ 9 నుంచి షాంఘై, న్యూఢిల్లీ మధ్య రౌండ్-ట్రిప్ విమానాలను ప్రారంభించనుంది. ఈ నిర్ణయం రెండు దేశాల మధ్య సంబంధాలను బలపరిచే దిశగా ఒక కీలక అడుగుగా పరిగణిస్తున్నారు. షాంఘై, ఢిల్లీ మధ్య ప్రతి బుధ, శని, ఆదివారాల్లో ఈ విమానం నడుస్తుందని ఎయిర్లైన్స్ తెలిపింది. ఈ విమానం షాంఘైలోని పుడాంగ్ విమానాశ్రయం నుండి మధ్యాహ్నం 12:50 గంటలకు బయలుదేరి సాయంత్రం…
Air India Crash: గత నెలలో అహ్మదాబాద్ నుంచి లండన్ గాట్విక్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన క్షణాలకే కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలోని ఒక్కరు మినహా మొత్తం మంది చనిపోయారు. విమానంలో ఉన్న వారితో పాటు కింద ఉన్న వారితో సహా 270 మంది మరణించారు. బోయింగ్ 787-8 డ్రీమ్లైనన్ విమానం ప్రమాదానికి గురైంది.
అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత ప్రపంచ వ్యాప్తంగా విమానాల్లో వరుసగా సాంకేతిక లోపాలు కలవర పెడుతున్నాయి. తాజాగా జపాన్ ఎయిర్లైన్స్కి చెందిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. అసోసియేటెడ్ ప్రెస్ (AP) ప్రకారం.. జపాన్ ఎయిర్లైన్స్ విమానం దాదాపు 36,000 అడుగుల ఎత్తు నుంచి అకస్మాత్తుగా కిందికి వెళ్లింది. దీంతో సిబ్బంది వెంటనే ప్రయాణికులకు ఆక్సిజన్ మాస్క్లు అందించారు. ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
శుక్రవారం ఢిల్లీ నుంచి పూణే వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానాన్ని ఓ పక్షి ఢీకొట్టింది. దీని కారణంగా, ఈ విమానం తిరుగు ప్రయాణాన్ని ఎయిర్లైన్ రద్దు చేయాల్సి వచ్చింది. మార్గమధ్యలో పక్షి విమానాన్ని ఢీకొట్టిన విషయం పైలట్కు కూడా తెలియకపోవడం గమనార్హం. అయితే, పూణేలో ల్యాండింగ్ అయిన తర్వాత పక్షి ఢీ కొట్టినట్లు గుర్తించారు. దీంతో సంస్థ విమానం తిరుగు ప్రయాణాన్ని రద్దు చేశారు. ప్రస్తుతం ఇంజనీరింగ్ బృందం క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తోందని ఎయిర్ ఇండియా తెలిపింది.…
SpiceJet : ఈ రోజు ఉదయం శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరిన స్పైస్ జెట్ విమానం (SpiceJet)లో ప్రయాణికులకు కలవరాన్ని కలిగించే సంఘటన చోటుచేసుకుంది. విమానం తిరుపతి దిశగా ప్రయాణిస్తుండగా, ఆకాశంలో ప్రయాణిస్తున్న సమయంలో పైలట్ సాంకేతిక లోపాన్ని గుర్తించడంతో అప్రమత్తమయ్యారు. ఎటువంటి ప్రమాదం జరగకమునుపే, విమానాన్ని వెంటనే తిరిగి శంషాబాద్ ఎయిర్పోర్ట్కు తీసుకెళ్లారు. Ahmedabad Plane Crash: కేంద్రం కీలక నిర్ణయం.. కొత్త నిబంధనలు జారీ ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. వారు…
థాయిలాండ్ గాయకుడు రువాంగ్సక్ లాయ్చూజాక్ విమాన ప్రమాదానికి సంబంధించిన ఓ షాకింగ్ కథను పంచుకున్నారు. 1998లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 101 మంది మరణించిన తాను మాత్రం బయటపడ్డానని వెల్లడించారు. ఆ సమయంలో తాను సీటు నంబర్ 11Aలో కూర్చున్నట్లు తెలిపారు. ఆశ్యర్యం ఏంటంటే..
Telangana Aviation Director : అహ్మదాబాద్లో నిన్న జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం నేపథ్యంలో తెలంగాణ ఏవియేషన్ డైరెక్టర్ భరత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రమాదానికి సంబంధించి కొన్ని అపోహలు ప్రజల్లో ప్రచారంలో ఉన్నాయని ఆయన అన్నారు. విమాన సాంకేతికత, భద్రతా ప్రమాణాల గురించి స్పష్టత ఇవ్వడం కోసం ఆయన పలు ముఖ్యమైన విషయాలను వివరించారు. భరత్ రెడ్డి మాటల ప్రకారం, ఒక ఇంజన్ ఆగిపోతే మరొకటి పని చేస్తుందన్న భావన సరికాదని…
గత గురువారం (మార్చి 6)న అమెరికాలోని చికాగో నుండి న్యూఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానం సాంకేతిక కారణాల వల్ల చికాగో విమానాశ్రయంలో తిరిగి ల్యాండ్ కావాల్సి వచ్చింది. అందుకు గల సాంకేతిక కారణంపై విమానయాన సంస్థ వివరణ ఇచ్చింది. ఎయిర్ ఇండియా తన దర్యాప్తులో పాలిథిన్ సంచులు, గుడ్డలు, బట్టలు వంటి వాటిని విమానం టాయిలెట్లలోకి నెట్టడం వల్ల టాయిలెట్లు మూసుకుపోయాయని.. అవి నిరుపయోగంగా మారాయని ఎయిర్ ఇండియా తెలిపింది.