Air India: ప్రయాణికులకు ఊరట.. విధుల్లో చేరిన సిబ్బంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మూకుమ్మడి సిక్ లీవ్స్ కారణంగా ఎయిరిండియా విమాన సర్వీసులు నిలిచిపోయాయి. 100కు పైగా విమాన సర్వీసులు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాజాగా ప్రయాణికులకు ఎయిరిండియా గుడ్న్యూస్ చెప్పింది. సామూహిక సిక్ లీవ్లో ఉన్న ఎయిరిండియా సిబ్బంది తిరిగి విధుల్లో చేరినట్టు ఆ సంస్థ అధికారి ఒకరు ఆదివారం తెలిపారు. విమాన సర్వీసుల పునరుద్ధరణ జరుగుతోందని, ఈనెల 14వ తేదీ (మంగళవారం) నుంచి అన్ని సర్వీసులు యథాప్రకారం నడుస్తాయని వెల్లడించారు.
ఇది కూడా చదవండి: AP CEO: ప్రతి ఒక్కరూ ఓటు హక్కును స్వేచ్ఛగా, నిర్భయంగా వినియోగించుకోవాలి..
Also Read
- Saikrishna Custodial Death Case: సాయికృష్ణ కేసులో కొత్త ట్విస్ట్.. సీసీటీవీ హార్డ్డిస్క్లు మార్చారా..?
- Shreyas Iyer: కోహ్లీ రికార్డు బ్రేక్.. మ్యాచ్ రద్దయినా చరిత్ర సృష్టించిన శ్రేయస్.. తొలి భారతీయ కెప్టెన్గా రికార్డ్..
- AP Gold Mining: ఏపీలో గోల్డ్ మైనింగ్కు గ్రీన్ సిగ్నల్.. నాలుగు దశల్లో సర్వేలు, తవ్వకాలు
- AP Education Fee Hike: ఉన్నత విద్యా ఫీజులపై సర్కార్ కీలక నిర్ణయం...
మూకుమ్మడి సిక్ లీవులో ఉన్న సిబ్బంది మే 11వ తేదీన విధుల్లో చేరారని ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ఎంప్లాయీస్ యూనియన్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే కంపెనీ షెడ్యూల్డ్ సాఫ్ట్వేర్లో లోపం కారణంగా స్టాఫ్ సిక్ లీవులో ఉన్నట్టు చూపుతోందని తెలిపింది. ప్రతిరోజూ సుమారు 380 విమాన సర్వీసులను ఎయిరిండియా నడుపుతుండగా.. ఆదివారం సుమారు 20 విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఎయిర్లైన్స్ నిర్వహణా లోపాల కారణంగా సిబ్బంది సమ్మెకు దిగడంతో గత మంగళవారం నుంచి వందలాది విమాన సర్వీసులకు అంతరాయం కలిగింది. దీంతో సయోధ్య కుదిర్చేందుకు చీఫ్ లేబర్ కమిషనర్ గురువారం ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేశారు. సిబ్బంది సమ్మె విరమణకు అంగీకరించగా, ఎయిర్లైన్స్ సైతం 25 మంది సిబ్బందికి జారీ చేసిన టెర్మినేషన్ లేఖలను ఉపసంహరించుకునేందుకు ఒప్పుకుంది. ఎయిరిండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Arvind Kejriwal: మీరు ఆప్కి ఓటేస్తే నేను మళ్లీ జైలుకు వెళ్లాల్సిన అవసరం ఉండదు..
తాజావార్తలు
-
Saikrishna Custodial Death Case: సాయికృష్ణ కేసులో కొత్త ట్విస్ట్.. సీసీటీవీ హార్డ్డిస్క్లు మార్చారా..?
-
Akhil Akkineni : సమంత ‘మా ఇంటి బంగారం’పై అఖిల్ షాకింగ్ కామెంట్స్
-
Shreyas Iyer: కోహ్లీ రికార్డు బ్రేక్.. మ్యాచ్ రద్దయినా చరిత్ర సృష్టించిన శ్రేయస్.. తొలి భారతీయ కెప్టెన్గా రికార్డ్..
-
Australian Cricketer: 15 ఏళ్ల బాలికపై అత్యాచారం.. ఆస్ట్రేలియా క్రికెటర్కు జీవితకాల జైలు శిక్ష!
-
PM Narendra Modi: అమర్నాథ్ యాత్ర ప్రారంభం.. భక్తులకు ప్రధాని మోడీ లేఖ, ఐదు సంకల్పాలకు పిలుపు
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!