Emergency Landing: మంటలు చెలరేగడంతో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బెంగళూరు నుండి కొచ్చికి ప్రయాణిస్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానంలోని ఇంజిన్ లలో ఒకదానిలో మంటలు చెలరేగడంతో శనివారం అర్థరాత్రి బెంగళూరు విమానాశ్రయంలో “అత్యవసర ల్యాండింగ్” చేసింది. విమానం ల్యాండ్ అయిన తర్వాత 179 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందిని సురక్షితంగా తరలించినట్లు బెంగళూరు విమానాశ్రయం ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు.
విమానం, IX 1132, బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో రాత్రి 11.12 గంటలకు ల్యాండ్ అయింది. విమానాశ్రయం నుండి టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల తరువాత, ఆన్బోర్డ్ సిబ్బంది కుడి ఇంజిన్లో మంటలను గమనించి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ (ATC) కు నివేదించారు. దాంతో పూర్తి స్థాయి అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. దాంతో ల్యాండింగ్ అయిన వెంటనే మంటలను ఆర్పివేశారు. టేకాఫ్ అయిన తర్వాత కుడి ఇంజిన్ నుండి మంటలు చెలరేగాయని అనుమానిస్తున్నందున, బెంగళూరు-కొచ్చి విమానం తిరిగి వచ్చింది.
Also Read
- Hyderabad: ఉద్యోగం పేరుతో చిత్రహింసలు.. ఒమన్లో చిక్కుకున్న హైదరాబాద్ మహిళ..
- Lalchand Rajput: రోహిత్ మరో రెండేళ్లు హాయిగా ఆడగలడు.. ‘హిట్మ్యాన్’ కెరీర్పై తొలి కోచ్ రాజ్పుత్ ధీమా
- Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు..? ఆల్-పార్టీ మీటింగ్లో కీలక పరిణామం..
- Nurse Murder Case: ఆపరేషన్ థియేటర్లో నర్సు హత్య.. విషం ఇంజెక్ట్ చేసి చంపిన ప్రియుడు..
బెంగళూరులో ముందు జాగ్రత్తగా ల్యాండింగ్ చేసింది. గ్రౌండ్ సర్వీసులు కూడా మంటలను నివేదించాయి. ప్రయాణికులకు ఎటువంటి గాయాలు కాకుండా సిబ్బంది తరలింపును పూర్తి చేశారు. ఇది కలిగించిన అసౌకర్యానికి మేము చింతిస్తున్నాము., మా అతిథులు వీలైనంత త్వరగా వారి గమ్యస్థానానికి చేరుకోవడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లను అందించడానికి కృషి చేస్తున్నాము ” అని ఎయిర్లైన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. కారణాన్ని నిర్ధారించడానికి రెగ్యులేటర్తో సమగ్ర దర్యాప్తు జరుగుతుందని తెలిపింది.
అంతకుముందు, 137 మంది ప్రయాణికులతో బెంగళూరుకు వెళ్తున్న మరో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం సాంకేతిక లోపం కారణంగా తమిళనాడులోని తిరుచిరాపల్లిలో “అత్యవసర ల్యాండింగ్” చేసింది.
తాజావార్తలు
-
Viral Look: ఈయన ఆయన నేనా? గుర్తుపట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరో! ‘భాయ్జాన్’కు ఏమైంది?
-
Hyderabad: ఉద్యోగం పేరుతో చిత్రహింసలు.. ఒమన్లో చిక్కుకున్న హైదరాబాద్ మహిళ..
-
Lalchand Rajput: రోహిత్ మరో రెండేళ్లు హాయిగా ఆడగలడు.. ‘హిట్మ్యాన్’ కెరీర్పై తొలి కోచ్ రాజ్పుత్ ధీమా
-
Yadhu Vamsi: ‘నా కొడుకు సాధించాడు’.. తండ్రి కలను నిజం చేసిన యదు వంశీ! వీడియో వైరల్
-
IND vs ENG 3rd ODI: రోహిత్-కోహ్లీ భవిష్యత్తుపై ప్రశ్న.. హ్యారీ బ్రూక్ సమాధానం ఇదే!
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!