Asaduddin Owaisi: ఎన్సిపిలో తిరుగుబాటుపై అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర ఆగ్రహం.. మీటింగ్ అని పిలిచి బీజేపీతో వెళ్తారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asaduddin Owaisi: ఎన్సీపీలో శరద్ పవార్ తిరుగుబాటు తర్వాత ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కాంగ్రెస్పై విరుచుకుపడ్డారు. విపక్షాల సమావేశానికి కాంగ్రెస్ ఆహ్వానించిన వళ్లే బీజేపీతో కలిసి వెళ్లారు. ఇంతమంది సెక్యులరిజం సర్టిఫికెట్లు పంచి మాపై ఆరోపణలు చేస్తున్నారు. చాలా మంది నాయకులు అవకాశం కోసం ఎదురు చూస్తున్నందున కాంగ్రెస్ తన సొంత ఇంటిని చూసుకోవాల్సిన అవసరం ఉందని ఒవైసీ అన్నారు. ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్ కలిసి బీహార్ ఏఐఎంఐఎంకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.
Read Also:UtterPradesh Woman: ఆమె మృత్యుంజయురాలు.. రైలు పట్టాలు రైలు మధ్యలో పడినా బ్రతికింది
Also Read
- Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
- Shreyas Iyer: మా ఓటమికి కారణం ఆ ఇద్దరే.. అస్సలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన శ్రేయస్..
- Actor Vishal: ‘‘ఆయనకు ఏం తెలుసని మంత్రి పదవి ఇచ్చారు..?’’ సీఎం విజయ్పై విశాల్ ఘాటు వ్యాఖ్యలు..
- Epstein: ఎప్స్టీన్ కేసులో సంచలనం.. వెలుగులోకి కొత్త బాధితులు..
రాజస్థాన్ రాజధాని జైపూర్లో జరిగిన సభలో ఒవైసీ మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ పెద్దగా మాట్లాడుతోంది, మీ పార్టీలో ఏం జరుగుతుందో నాకు తెలుసు? మీ పార్టీలో ఎంత మంది అవకాశం కోసం ఎంతమంది ఎదురుచూస్తున్నారు. మాతో కూడా మాట్లాడుతున్నారు, నేనే ఆగండి సమయం వచ్చినప్పుడు చెబుతానన్నాను. దేశ ఐక్యతను కాపాడుకోవాల్సిన బాధ్యత కేవలం ముస్లింలదే’ అని అన్నారు. ‘అశోక్ గెహ్లాట్ కుమారుడు ఎన్నికల్లో ఓడిపోతే, దానికి మేము బాధ్యులమా? తన సహచరులెవరికైనా కోపం వస్తే దానికి ఒవైసీ కారణమా? ఇంతమంది బీజేపీ పేరు చెప్పి మిమ్మల్ని భయపెడతారు, ఒవైసీ పేరు చెప్పి భయపెడతారు కానీ భయపడకండి, మీరు సత్యానికి మద్దతు ఇవ్వండి’.
Read Also:11 Overs in ODI: అంతర్జాతీయ మ్యాచ్లో అంపైర్ల అజాగ్రత్త.. వన్డేలో 11 ఓవర్లు వేసిన బౌలర్!
ఓవైసీ ఇప్పుడు రాజస్థాన్లో కూడా AIMIM తరపున ఎన్నికలలో గట్టిగా పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించి సమావేశం నిర్వహించడానికి జైపూర్ చేరుకున్నారు. మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలపై ఒవైసీ మాట్లాడుతూ.. ‘పాట్నాలో విపక్షాల సమావేశం జరిగింది, శరద్పవార్ తీసుకొచ్చిన ప్రఫుల్ పటేల్ ఈరోజు బీజేపీని కలవడానికి వెళ్లారు. అయినప్పటికీ, కాంగ్రెస్ సెక్యులరిజం సర్టిఫికేట్లను పంపిణీ చేస్తుంది. కాంగ్రెస్ ఎలా మోసం చేసిందో చూడాలి. ఈరోజు మీడియాలో ప్రతి ప్రతిపక్ష నాయకుడు ఎన్సీపీని బీజేపీ విచ్ఛిన్నం చేసిందని ఏడుస్తున్నాడు. ఈరోజు 40 మంది ఎమ్మెల్యేలు వెళ్లిపోయారంటే అది తప్పా, బీహార్లో మా 4 మంది ఎమ్మెల్యేలను మీరు కొనుగోలు చేస్తే అది సరైనదేనా? మీరు చేస్తే మంచి అదే ఇతరులు తప్పా.. అంటూ విరుచుకుపడ్డారు.
తాజావార్తలు
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
-
Shreyas Iyer: మా ఓటమికి కారణం ఆ ఇద్దరే.. అస్సలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన శ్రేయస్..
-
Dal Dhokli Recipe : ఉల్లి, వెల్లుల్లి లేని ట్రెడిషనల్ గుజరాతీ ట్రెడిషనల్ వంటకం .. దీక్షలో ఉన్నప్పుడు భలే రుచిగా.!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..