Asaduddin Owaisi: ఎన్సిపిలో తిరుగుబాటుపై అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర ఆగ్రహం.. మీటింగ్ అని పిలిచి బీజేపీతో వెళ్తారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asaduddin Owaisi: ఎన్సీపీలో శరద్ పవార్ తిరుగుబాటు తర్వాత ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కాంగ్రెస్పై విరుచుకుపడ్డారు. విపక్షాల సమావేశానికి కాంగ్రెస్ ఆహ్వానించిన వళ్లే బీజేపీతో కలిసి వెళ్లారు. ఇంతమంది సెక్యులరిజం సర్టిఫికెట్లు పంచి మాపై ఆరోపణలు చేస్తున్నారు. చాలా మంది నాయకులు అవకాశం కోసం ఎదురు చూస్తున్నందున కాంగ్రెస్ తన సొంత ఇంటిని చూసుకోవాల్సిన అవసరం ఉందని ఒవైసీ అన్నారు. ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్ కలిసి బీహార్ ఏఐఎంఐఎంకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.
Read Also:UtterPradesh Woman: ఆమె మృత్యుంజయురాలు.. రైలు పట్టాలు రైలు మధ్యలో పడినా బ్రతికింది
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
రాజస్థాన్ రాజధాని జైపూర్లో జరిగిన సభలో ఒవైసీ మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ పెద్దగా మాట్లాడుతోంది, మీ పార్టీలో ఏం జరుగుతుందో నాకు తెలుసు? మీ పార్టీలో ఎంత మంది అవకాశం కోసం ఎంతమంది ఎదురుచూస్తున్నారు. మాతో కూడా మాట్లాడుతున్నారు, నేనే ఆగండి సమయం వచ్చినప్పుడు చెబుతానన్నాను. దేశ ఐక్యతను కాపాడుకోవాల్సిన బాధ్యత కేవలం ముస్లింలదే’ అని అన్నారు. ‘అశోక్ గెహ్లాట్ కుమారుడు ఎన్నికల్లో ఓడిపోతే, దానికి మేము బాధ్యులమా? తన సహచరులెవరికైనా కోపం వస్తే దానికి ఒవైసీ కారణమా? ఇంతమంది బీజేపీ పేరు చెప్పి మిమ్మల్ని భయపెడతారు, ఒవైసీ పేరు చెప్పి భయపెడతారు కానీ భయపడకండి, మీరు సత్యానికి మద్దతు ఇవ్వండి’.
Read Also:11 Overs in ODI: అంతర్జాతీయ మ్యాచ్లో అంపైర్ల అజాగ్రత్త.. వన్డేలో 11 ఓవర్లు వేసిన బౌలర్!
ఓవైసీ ఇప్పుడు రాజస్థాన్లో కూడా AIMIM తరపున ఎన్నికలలో గట్టిగా పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించి సమావేశం నిర్వహించడానికి జైపూర్ చేరుకున్నారు. మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలపై ఒవైసీ మాట్లాడుతూ.. ‘పాట్నాలో విపక్షాల సమావేశం జరిగింది, శరద్పవార్ తీసుకొచ్చిన ప్రఫుల్ పటేల్ ఈరోజు బీజేపీని కలవడానికి వెళ్లారు. అయినప్పటికీ, కాంగ్రెస్ సెక్యులరిజం సర్టిఫికేట్లను పంపిణీ చేస్తుంది. కాంగ్రెస్ ఎలా మోసం చేసిందో చూడాలి. ఈరోజు మీడియాలో ప్రతి ప్రతిపక్ష నాయకుడు ఎన్సీపీని బీజేపీ విచ్ఛిన్నం చేసిందని ఏడుస్తున్నాడు. ఈరోజు 40 మంది ఎమ్మెల్యేలు వెళ్లిపోయారంటే అది తప్పా, బీహార్లో మా 4 మంది ఎమ్మెల్యేలను మీరు కొనుగోలు చేస్తే అది సరైనదేనా? మీరు చేస్తే మంచి అదే ఇతరులు తప్పా.. అంటూ విరుచుకుపడ్డారు.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!