Asaduddin Owaisi: ఎన్సిపిలో తిరుగుబాటుపై అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర ఆగ్రహం.. మీటింగ్ అని పిలిచి బీజేపీతో వెళ్తారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asaduddin Owaisi: ఎన్సీపీలో శరద్ పవార్ తిరుగుబాటు తర్వాత ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కాంగ్రెస్పై విరుచుకుపడ్డారు. విపక్షాల సమావేశానికి కాంగ్రెస్ ఆహ్వానించిన వళ్లే బీజేపీతో కలిసి వెళ్లారు. ఇంతమంది సెక్యులరిజం సర్టిఫికెట్లు పంచి మాపై ఆరోపణలు చేస్తున్నారు. చాలా మంది నాయకులు అవకాశం కోసం ఎదురు చూస్తున్నందున కాంగ్రెస్ తన సొంత ఇంటిని చూసుకోవాల్సిన అవసరం ఉందని ఒవైసీ అన్నారు. ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్ కలిసి బీహార్ ఏఐఎంఐఎంకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.
Read Also:UtterPradesh Woman: ఆమె మృత్యుంజయురాలు.. రైలు పట్టాలు రైలు మధ్యలో పడినా బ్రతికింది
Also Read
రాజస్థాన్ రాజధాని జైపూర్లో జరిగిన సభలో ఒవైసీ మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ పెద్దగా మాట్లాడుతోంది, మీ పార్టీలో ఏం జరుగుతుందో నాకు తెలుసు? మీ పార్టీలో ఎంత మంది అవకాశం కోసం ఎంతమంది ఎదురుచూస్తున్నారు. మాతో కూడా మాట్లాడుతున్నారు, నేనే ఆగండి సమయం వచ్చినప్పుడు చెబుతానన్నాను. దేశ ఐక్యతను కాపాడుకోవాల్సిన బాధ్యత కేవలం ముస్లింలదే’ అని అన్నారు. ‘అశోక్ గెహ్లాట్ కుమారుడు ఎన్నికల్లో ఓడిపోతే, దానికి మేము బాధ్యులమా? తన సహచరులెవరికైనా కోపం వస్తే దానికి ఒవైసీ కారణమా? ఇంతమంది బీజేపీ పేరు చెప్పి మిమ్మల్ని భయపెడతారు, ఒవైసీ పేరు చెప్పి భయపెడతారు కానీ భయపడకండి, మీరు సత్యానికి మద్దతు ఇవ్వండి’.
Read Also:11 Overs in ODI: అంతర్జాతీయ మ్యాచ్లో అంపైర్ల అజాగ్రత్త.. వన్డేలో 11 ఓవర్లు వేసిన బౌలర్!
ఓవైసీ ఇప్పుడు రాజస్థాన్లో కూడా AIMIM తరపున ఎన్నికలలో గట్టిగా పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించి సమావేశం నిర్వహించడానికి జైపూర్ చేరుకున్నారు. మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలపై ఒవైసీ మాట్లాడుతూ.. ‘పాట్నాలో విపక్షాల సమావేశం జరిగింది, శరద్పవార్ తీసుకొచ్చిన ప్రఫుల్ పటేల్ ఈరోజు బీజేపీని కలవడానికి వెళ్లారు. అయినప్పటికీ, కాంగ్రెస్ సెక్యులరిజం సర్టిఫికేట్లను పంపిణీ చేస్తుంది. కాంగ్రెస్ ఎలా మోసం చేసిందో చూడాలి. ఈరోజు మీడియాలో ప్రతి ప్రతిపక్ష నాయకుడు ఎన్సీపీని బీజేపీ విచ్ఛిన్నం చేసిందని ఏడుస్తున్నాడు. ఈరోజు 40 మంది ఎమ్మెల్యేలు వెళ్లిపోయారంటే అది తప్పా, బీహార్లో మా 4 మంది ఎమ్మెల్యేలను మీరు కొనుగోలు చేస్తే అది సరైనదేనా? మీరు చేస్తే మంచి అదే ఇతరులు తప్పా.. అంటూ విరుచుకుపడ్డారు.
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!