Digvijay Singh: కల్వకుంట్ల కుటుంబ అవినీతిపై ప్రజలు విసిగిపోయారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Digvijay Singh: తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ అన్నారు. మార్పు కోసం ఓటేయడానికి సిద్ధం అయ్యారని ఆయన పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి విజన్తోనే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని.. ఓఆర్ఆర్ ఆయన హయాంలోనే వచ్చిందన్నారు. ఐటీలో బెంగళూరుతో హైదరాబాద్ పోటీ పడుతున్నదంటే దానికి కారణం వైఎస్ విజన్, ఆయన నిర్ణయాలే.. హైదరాబాద్ను గ్లోబల్ ఐటీ హబ్గా అభివృద్ధి చెందిందన్నారు.3 లక్షల కోట్లకుపైగా పెట్టుబడులు ఐటీ సెక్టార్ నుంచే వస్తున్నాయన్నారు. తెలంగాణ బాగు కోసమే సోనియా గాంధీ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని ఈ సందర్భంగా దిగ్విజయ్ సింగ్ వెల్లడించారు.
Read Also: Raja Singh: కేసీఆర్, కేటీఆర్ ఇద్దరు మోసగాళ్లే.. అబద్దాలు చెప్పడంలో దిట్ట..
Also Read
- Bigg Boss Agnipariksha 2: బిగ్బాస్ 10లోకి ఎంట్రీ ఇచ్చే కామనర్స్ వీరే.. ఇదిగో జాబితా.. !
- Nitin Nabin: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన నితిన్ నబిన్
- Reliance Ice Cream: ఇక నుంచి మార్కెట్లో రిలయన్స్ ఐస్ క్రీం.. కేవలం రూ.10 లకే..
- Chirag Paswan Death Threat: కేంద్రమంత్రి చిరాగ్ పాస్వాన్కు ముప్పు?.. కేంద్రం అలర్ట్
దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ.. “తెలంగాణలో ఇంకా విభజన హామీల్లో భాగంగా ఇచ్చిన ప్రాజెక్టులను అమలు చేయాల్సి ఉంది.. వాటిని అధికారంలోకే వస్తే ఫుల్ఫిల్ చేస్తాం.. అన్ని వర్గాల బాగు కోసమే సోనియా గాంధీ ఆరు గ్యారెంటీలను ప్రకటించారు.. కౌలు రైతులకు న్యాయం జరగడం లేదు.. వారికీ రైతు భరోసాను అందజేస్తాం.. వరికి బోనస్ ఇస్తాం.. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు.. రాష్ట్రంలో అవినీతి బాగా పెరిగిపోయింది.. కల్వకుంట్ల కుటుంబ అవినీతిపై ప్రజలు విసిగిపోయారు.. మధ్యప్రదేశ్లో మేము అధికారంలో ఉన్నప్పుడు అన్ని హామీలనూ అమలు చేశాం.. రాజస్థాన్, చత్తీస్ గఢ్, కర్ణాటకల్లో ఇచ్చిన గ్యారెంటీలు, హామీలను అమలు చేశాం.. భారత రాజ్యాంగంలో అన్ని వర్గాలకూ సమ న్యాయం జరిగేలా, వారి బతుకులు బాగుపడేలా అంబేద్కర్ హక్కులు కల్పించారు.. కానీ, ఇప్పుడు ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని బీజేపీ బలహీనపరుస్తున్నది.. పేదరికం, నిరుద్యోగం భారీగా పెరుగుతున్నది.. రాష్ట్రంలోనూ అలాంటి పరిస్థితే ఉన్నది.. ఎవరూ సంతోషంగా లేరు.. రైతులు, నిరుద్యోగులు అందరూ ఇబ్బందులు పడుతున్నారు.. పేపర్ లీకులతో నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం చేశారు.. ఉద్యోగాలు కల్పించలేదు.. 26/11 దాడుల్లో మరణించిన వారికి నివాళులు.. రాముడు అందరివాడు.. అందరికీ ప్రియమైనవాడు.. అందులో రాజకీయాలేమీ లేవు.. కానీ, బీజేపీ మాత్రం దర్మం పేరిట దేవుడిని రాజకీయాలకు వాడుకుంటున్నది.. విభజన రాజకీయాలకు మేము పూర్తిగా వ్యతిరేకం. ” అని దిగ్విజయ్ సింగ్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Bigg Boss Agnipariksha 2: బిగ్బాస్ 10లోకి ఎంట్రీ ఇచ్చే కామనర్స్ వీరే.. ఇదిగో జాబితా.. !
-
Nitin Nabin: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన నితిన్ నబిన్
-
Reliance Ice Cream: ఇక నుంచి మార్కెట్లో రిలయన్స్ ఐస్ క్రీం.. కేవలం రూ.10 లకే..
-
Chirag Paswan Death Threat: కేంద్రమంత్రి చిరాగ్ పాస్వాన్కు ముప్పు?.. కేంద్రం అలర్ట్
-
AP SIR Voter List Revision: ఎస్ఐఆర్ షెడ్యూల్లో మార్పులు.. కీలక తేదీలు ఇవే..
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!