ఆసియా కప్ 2023 నిర్వహణపై సందిగ్దం కొనసాగుతున్న వేళ ఐపీఎల్ ఫైనల్ రోజే దీనిపై ఓ క్లారిటీ రానుందా..? అంటే అవుననే అంటున్నాయి బీసీసీఐ వర్గాలు. సుమారు 8 నెలలుగా కొనసాగుతున్న ఆసియా కప్ నిర్వహణ వివాదానికి త్వరలోనే తెరపడనుందా..? ఈ టోర్నీని పాకిస్తాన్ లేదా శ్రీలంకలలో నిర్వహించే అంశంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఐపీఎల్-16 ఫైనల్ ఇందుకు వేదిక కానుంది.
Also Read : Serial Killer: 30 మంది చిన్నారుల హత్య.. వీడికి జీవిత ఖైదు కూడా చాలా చిన్న శిక్షే
ఐపీఎల్16వ సీజన్ ఫైనల్ మ్యాచ్ చూసేందుకు అహ్మదాబాద్ కు రావాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి.. శ్రీలంక క్రికెట్ (ఎస్ఎల్సీ), బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ), అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) అధిపతులకు ఆహ్వానం పంపించారు. మే 28న అహ్మదాబాద్ వేదికగా ఐపీఎల్ ఫైనల్ జరుగనుంది. ఈ మేరకు బీసీసీఐ సెక్రటరీ, ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడు జై షా కూడా ట్విటర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించాడు. బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్, శ్రీలంకకు చెందిన క్రికెట్ బోర్డుల ప్రతినిధులు ఐపీఎల్ ఫైనల్ కు వస్తారని ఆసియా కప్ భవితవ్యం మీద ఇక్కడ ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని ట్వీట్టర్ వేదికగా పోస్ట్ చేశారు.
Also Read : Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
గత రెండు నెలల క్రితం ఆసియాకప్ ను పాకిస్తాన్ లో నిర్వహించేందుకు ఏసీసీ అంగీకరించింది. భారత్ తో జరిగే మ్యాచ్ లను మాత్రం తటస్థ వేదికపై జరిపించాలని నిర్ణయించినట్టు వార్తలు వచ్చాయి. కానీ ఉన్నట్టుండీ ఈ టోర్నీని శ్రీలంకకు తరలిస్తున్నారని.. అలా అయితే తాము ఆసియా కప్ ను బహిష్కరిస్తామని పాకిస్తాన్ బెదిరింపులకు దిగినట్టూ పుకార్లు షికార్లు చేశాయి. అయితే తాజాగా.. పీసీబీ హైబ్రిడ్ మోడల్ కు బీసీసీఐకి అంగీకారం తెలిపిందన్న వార్తలపై కూడా బోర్డు ప్రతినిధులు కొట్టిపారేశారు. అలాంటిదేమీ లేదని.. ఐపీఎల్ ఫైనల్ కు మూడు దేశాల క్రికెట్ బోర్డుల అధిపతులు వచ్చిన తర్వాత నిర్వహించే సమావేశంలో అన్ని వివరాలు వెల్లడవుతాయని తెలిపారు.
