IPL 2023: ఐపీఎల్ ఫైనల్ తర్వాతే.. ఆసియా కప్ వేదికపై తుది నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆసియా కప్ 2023 నిర్వహణపై సందిగ్దం కొనసాగుతున్న వేళ ఐపీఎల్ ఫైనల్ రోజే దీనిపై ఓ క్లారిటీ రానుందా..? అంటే అవుననే అంటున్నాయి బీసీసీఐ వర్గాలు. సుమారు 8 నెలలుగా కొనసాగుతున్న ఆసియా కప్ నిర్వహణ వివాదానికి త్వరలోనే తెరపడనుందా..? ఈ టోర్నీని పాకిస్తాన్ లేదా శ్రీలంకలలో నిర్వహించే అంశంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఐపీఎల్-16 ఫైనల్ ఇందుకు వేదిక కానుంది.
Also Read : Serial Killer: 30 మంది చిన్నారుల హత్య.. వీడికి జీవిత ఖైదు కూడా చాలా చిన్న శిక్షే
Also Read
- Sai Krishna Death Case: సాయికృష్ణ డెత్ కేసులో కీలక మలుపు.. లొంగిపోయిన హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని.!
- CM Chandrababu: పెట్టుబడుల కంటే ఆలోచనలే ముఖ్యం.. సీఐఐ సమ్మిట్పై సీఎం కీలక వ్యాఖ్యలు.!
- CM Chandrababu: రాజధాని నిర్మాణాల ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానిస్తం.!
- 6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
ఐపీఎల్16వ సీజన్ ఫైనల్ మ్యాచ్ చూసేందుకు అహ్మదాబాద్ కు రావాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి.. శ్రీలంక క్రికెట్ (ఎస్ఎల్సీ), బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ), అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) అధిపతులకు ఆహ్వానం పంపించారు. మే 28న అహ్మదాబాద్ వేదికగా ఐపీఎల్ ఫైనల్ జరుగనుంది. ఈ మేరకు బీసీసీఐ సెక్రటరీ, ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడు జై షా కూడా ట్విటర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించాడు. బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్, శ్రీలంకకు చెందిన క్రికెట్ బోర్డుల ప్రతినిధులు ఐపీఎల్ ఫైనల్ కు వస్తారని ఆసియా కప్ భవితవ్యం మీద ఇక్కడ ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని ట్వీట్టర్ వేదికగా పోస్ట్ చేశారు.
Also Read : Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
గత రెండు నెలల క్రితం ఆసియాకప్ ను పాకిస్తాన్ లో నిర్వహించేందుకు ఏసీసీ అంగీకరించింది. భారత్ తో జరిగే మ్యాచ్ లను మాత్రం తటస్థ వేదికపై జరిపించాలని నిర్ణయించినట్టు వార్తలు వచ్చాయి. కానీ ఉన్నట్టుండీ ఈ టోర్నీని శ్రీలంకకు తరలిస్తున్నారని.. అలా అయితే తాము ఆసియా కప్ ను బహిష్కరిస్తామని పాకిస్తాన్ బెదిరింపులకు దిగినట్టూ పుకార్లు షికార్లు చేశాయి. అయితే తాజాగా.. పీసీబీ హైబ్రిడ్ మోడల్ కు బీసీసీఐకి అంగీకారం తెలిపిందన్న వార్తలపై కూడా బోర్డు ప్రతినిధులు కొట్టిపారేశారు. అలాంటిదేమీ లేదని.. ఐపీఎల్ ఫైనల్ కు మూడు దేశాల క్రికెట్ బోర్డుల అధిపతులు వచ్చిన తర్వాత నిర్వహించే సమావేశంలో అన్ని వివరాలు వెల్లడవుతాయని తెలిపారు.

తాజావార్తలు
-
Sai Krishna Death Case: సాయికృష్ణ డెత్ కేసులో కీలక మలుపు.. లొంగిపోయిన హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని.!
-
CM Chandrababu: పెట్టుబడుల కంటే ఆలోచనలే ముఖ్యం.. సీఐఐ సమ్మిట్పై సీఎం కీలక వ్యాఖ్యలు.!
-
CBSE స్టూడెంట్స్కు రిలీఫ్.. 10వ క్లాస్కు కొత్త రూల్ లేదు.!
-
CM Chandrababu: రాజధాని నిర్మాణాల ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానిస్తం.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
ట్రెండింగ్
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!