Nayanthara: మొన్న సమంత.. నేడు నయనతార..
- చర్చకు దారితీసిన నయనతార పోస్ట్
- గతంలో సమంతకు కూడా ఇదే పరిస్థితి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nayanthara: సోషల్ మీడియా తరచుగా సెలబ్రిటీలకు యుద్ధభూమిగా మారుతూ ఉంటుంది. గతంలో సమంత తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పంచుకున్న ఫోటో ఒకటి చర్చనీయాంశమైంది. ఆమె అప్పట్లో హైడ్రోజన్ పెరాక్సైడ్, డిస్టిల్డ్ వాటర్ మిశ్రమంతో ఆవిరి పట్టడం మంచి ఎంపిక… ఇది మ్యాజిక్ లాగా పనిచేస్తుంది.. అవనవసరంగా మాత్రలు మింగడం మానుకోండి.” అని సమంత స్టోరీలో రాసుకొచ్చింది. అయితే ఈ విధానాన్ని కొంతమంది వైద్యులు సోషల్ మీడియాలో తప్పుపట్టారు. అప్పటికే దెబ్బ తిన్న ఊపిరి తిత్తులలోకి హైడ్రోజన్ పెరాక్సైడ్ ప్రవేశిస్తే, న్యుమోనియా సహా పలు వ్యాధులను కలగజేస్తుంది. కొన్నిసార్లు మరణానికి దారి తీస్తుందని హెచ్చరించారు.
Read Also: Chinmayi Sripada: నా భర్త అలాంటి వాడు.. ట్రోలర్స్కు చిన్మయి స్ట్రాంగ్ వార్నింగ్
Also Read
- 'The Hundred'లో రోహిత్ శర్మ.! MI లండన్ ఘన విజయం.!
- AP Coronavirus Cases: ఏపీలో భయపెడుతోన్న కరోనా..! పర్యాటకులపై ఆంక్షలు
- CM Vijay and Trisha Controversy: ఆలయ ఉత్సవాల్లో త్రిష, విజయ్ ఫొటోలతో వివాదాస్పద ఫ్లెక్సీ.. ఇద్దరిపై కేసు
- Lalit Kumar Modi: ఐపీఎల్ 2009 ఫెమా కేసులో క్లీన్ చిట్.. ఆనందంతో డాన్స్ చేస్తూ రచ్చ రచ్చ.!
అలాగే లేడీ సూపర్ స్టార్ నయనతార పంచుకున్న ఓ పోస్ట్ కూడా చర్చకు దారి తీసింది. ఈ ఏడాదిలోనే ఇన్స్టాలోకి అడుగుపెట్టిన నయనతార.. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉంటున్నారు. ఇన్స్టా వేదిక తన అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మందారపువ్వులతో చేసే టీ గురించి పోస్ట్ పెట్టారు. ఆ టీ తనకెంతో ఇష్టమని పేర్కొన్నారు. దీనివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుయన్నాయని వెల్లడించారు. రోగ నిరోధక శక్తి పెరుగుతుందని.. మధుమేహం, అధిక రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారికి ఇది ఉపశమనం కలిగిస్తుందని చెప్పారు. దీనిపై ఓ వైద్యుడు స్పందించాడు. ది లివర్ డాక్టర్ అనే ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టాడు. 8.7 మిలియన్ల మంది ఫాలోవర్స్ను ఆమె తప్పుదోవ పట్టిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆమె మాటల్లో నిజం లేదని పేర్కొన్నాడు. ఆయన ట్వీట్ వైరల్గా మారడంతో నయనతార తన పోస్ట్ను తొలగించారు.
ఈ పోస్ట్పై విమర్శలు రావడంతో తొలగించిన నయనతార.. తాజాగా ఇన్స్టాలో ఆసక్తికర సందేశాన్ని పంచుకున్నారు. ‘‘తెలివి తక్కువ వారితో వాదించవద్దు. ఆ విధంగా మిమ్మల్ని వారి స్థాయికి తీసుకువెళ్లి, ఓడిస్తారు’’ అని అమెరికన్ రైటర్ మార్క్ ట్వైన్ సూక్తిని నయన్ షేర్ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తనని విమర్శించిన వారిని ఉద్దేశించే ఈవిధంగా పెట్టారని పలువురు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
‘The Hundred’లో రోహిత్ శర్మ.! MI లండన్ ఘన విజయం.!
-
Trump 200% Tariff: ట్రంప్ సంచలన నిర్ణయం.. జెనరిక్ మందులపై 200% టారిఫ్.. భారత ఫార్మా పరిశ్రమపై భారీ ప్రభావం?
-
AP Coronavirus Cases: ఏపీలో భయపెడుతోన్న కరోనా..! పర్యాటకులపై ఆంక్షలు
-
NBK : ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్కు బాలయ్య.. షూటింగ్ కు బ్రేక్
-
India Test Squad: శ్రీలంకతో టెస్టు సిరీస్.. టీమిండియాలోకి మరో కొత్త ప్లేయర్!
ట్రెండింగ్
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్టాప్లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!
-
Best Camera Phones: DSLRకు పోటీగా ఫొటోగ్రఫీ అనుభవం..! బెస్ట్ కెమెరా ఫోన్ల లిస్ట్ ఇదిగో..!
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!