Atrocious: మనుషులా.. మృగాళ్లా?.. మైనర్ను చంపేసి మృతదేహంతో కిరాతక చర్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Atrocious: మహిళపట్ల జరిగే అఘాయిత్యాలు అరికట్టేందుకు ప్రభుత్వాలు ఎన్నో చట్టాలు తీసుకొస్తున్నాయి. కానీ, చిన్నా పెద్దా అనే తేడా లేకుండా కొంత మంది మగాళ్లు మృగాళ్లుగా మారి విరుచుకుపడుతున్నారు. ఆడవారు ఒంటరిగా కనిపిస్తే చాలు వారిని కిడ్నాప్ చేసి మరీ వాళ్ల కామవాంఛ తీర్చుకుంటున్నారు. మనుషులలాగా కాకుండా మృగాళ్లలా ప్రవర్తిస్తున్నారు. చిన్నపిల్లలు అని చూడకుండా తమ కామవాంఛను తీర్చుకుంటున్నారు కొంతమంది దుర్మార్గులు. వాళ్ల పసి హృదయాలను మొగ్గ దశలోనే తుంచేస్తున్నారు. చనిపోయిన మృతదేహాన్ని కూడా వదలడం లేదు. అలాంటే అమానవీయ ఘటన తాజాగదా అస్సాంలో చోటుచేసుకుంది.
Also Read: ICC World Cup 2023: ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్కు బెదిరింపు.. ఖలిస్తాన్ ఉగ్రవాది పన్నూపై కేసు నమోదు..
Also Read
- Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి జాతీయ స్థాయిలో గౌరవం.. దేశంలోనే నెం.1 రూట్గా విశాఖ-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం.!
- Malkajgiri: ఎట్టకేలకు చిక్కిన నేపాలీ గ్యాంగ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
- AFG vs IND: లంచ్ బ్రేక్.. ఆచితూచి ఆడుతున్న భారత బ్యాటర్లు.!
- Tamil Nadu: విత్తనాలు చల్లింది అన్నామలై.. పంట కోసుకున్నది విజయ్.. తమిళ గడ్డపై "సింగం" ఫార్ములా బ్లాక్బస్టర్!!
హత్యానంతరం మృతదేహంతో కిరాతక చర్యలకు పాల్పడిన ఉదంతం అస్సాంలోని కరీంగంజ్ జిల్లాలో వెలుగు చూసింది. కరీంగంజ్లో మైనర్ బాలికను గొంతుకోసి హత్య చేసి, ఆపై మృతదేహంపై అత్యాచారం చేసిన ముగ్గురు వ్యక్తులను అస్సాం పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ముగ్గురు నిందితుల్లో ఒకరు రైల్వే ఉద్యోగి. ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సెప్టెంబర్ 9న కరీంగంజ్ టౌన్ బైపాస్ సమీపంలో మైనర్ బాలిక మృతదేహం లభ్యమైంది. అదే రోజు మైనర్ బాలిక హత్యకు గురైనట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన సెప్టెంబర్ 9వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో జరిగిందని కరీంనగర్ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పార్థ ప్రతిమ్ దాస్ తెలిపారు. ముగ్గురు నిందితులు బాధితురాలి ఇంట్లోకి బలవంతంగా చొరబడి హత్య చేశారు. తర్వాత ఆమె మృతదేహంతో వారి కామవాంఛను తీర్చుకున్నారు.
Also Read: Lifestyle : మగవాళ్ళు ఇది మీకోసమే.. ఈ టిప్స్ ఫాలో అయితే చాలు అమ్మాయిలు పడిపోతారు..
ఎస్పీ పార్థ ప్రతిమ్ దాస్ మాట్లాడుతూ, “సెప్టెంబర్ 9న మెడల్ పార్ట్ -1 నుంచి సంఘటన గురించి సమాచారం అందింది. అక్కడికి వెళ్లేచూసేసరికి ఆ ఇంట్లోమైనర్ బాలిక మృతదేహం కనిపించింది. ఘటన జరిగినప్పుడు ఆమె తల్లిదండ్రులు ఇంట్లో లేరు. మైనర్ బాలిక మృతదేహానికి సిల్చార్ మెడికల్ కాలేజీలో పోస్టుమార్టం నిర్వహించారు. దీని ఆధారంగా పోలీసులు సెక్షన్ 376(A) కింద కేసు నమోదు చేశాం. దీంతో పాటు నిందితులపై ఐపీసీతో పాటు పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశాం.” అని వెల్లడింతారు. చనిపోయిన బాలిక నోట్బుక్ నుంచి పోలీసులు మొబైల్ నంబర్ను పోలీసులు గుర్తించారు ఆ మొబైల్ నంబర్ ఆధారంగా బిప్లబ్ పాల్, శుభ్ర మలాకర్, రాహుల్ దాస్ అనే ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. విచారణలో రాహుల్ దాస్ బాధిత బాలికతో శారీరక సంబంధం పెట్టుకోవడానికి ప్రయత్నించాడని వెల్లడించాడు. అమ్మాయి వ్యతిరేకించడంతో రాహుల్ ఈ నీచమైన ఉద్దేశంతో దారుణానికి పాల్పడినట్లు తెలిసింది.
Also Read: Gaganyaan Mission: గగన్యాన్ మిషన్కు ముందు ఈ సంస్థపై కాసుల వర్షం.. ఒక్క నెలలో రూ. 49000 కోట్లు
అరెస్టు చేసిన ముగ్గురు వ్యక్తులు సెప్టెంబర్ 9న బాలిక ఇంట్లోకి వెళ్లడానికి కుట్ర పన్నారని, ఆమెతో బలవంతంగా శారీరక సంబంధం పెట్టుకోవడానికి ప్రయత్నించారని కరీంగంజ్ ఎస్పీ పార్థ ప్రతిమ్ దాస్ తెలిపారు. వారు రాత్రి 11:30 గంటలకు ఆమె ఇంటికి వెళ్లారని చెప్పారు. వారు గదిలోకి ప్రవేశించారని, ఆమెను గొంతుకోసి చంపినట్లు ఆయన వెల్లడించారు. బాలికను చంపేసిన తర్వాత వారు బాలిక మృతదేహంపై అఘాయిత్యానికి పాల్పడి అక్కడి నుంచి వెళ్లిపోయారని ఎస్పీ చెప్పారు. మొబైల్ నంబర్ దొరకడంతో అన్ని ఆధారాలు లభించాయని ఎస్పీ పేర్కొన్నారు.
రైల్వే ఉద్యోగి సూత్రధారి
రాహుల్ దాస్ రైల్వేలో నాల్గవ తరగతి ఉద్యోగి అని, ఈ కేసుకు ప్రధాన సూత్రధారి కూడా అని, రాహుల్ దాస్ శుభ్ర మలాకర్ నుంచి రెండు మొబైల్ సిమ్ కార్డులు తీసుకున్నారని, వీటిని రాహుల్ మలాకర్, బాధిత బాలిక వినియోగించారని ఎస్పీ దాస్ తెలిపారు. నెలల తరబడి నిరంతరం టచ్లో ఉన్నారని ఎస్పీ చెప్పారు. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
BCCI: ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనకు భారత జట్టు ప్రకటన.. వైభవ్ సూర్యవంశీకి తొలి అంతర్జాతీయ అవకాశం
-
Peddi Collections : బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ కలెక్షన్ల సునామీ.. ఏకంగా ఎన్ని కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందో తెలిస్తే మైండ్ బ్లాక్!
-
Maruti Suzuki Jimny: కొత్త జిమ్నీ వేరియంట్లు విడుదల.. 6 ఎయిర్బ్యాగ్లు, ADAS ఫీచర్లతో మరింత సురక్షితం
-
Aadhaar Update: ఆధార్లో ఈ తప్పులు ఉంటే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు.. ఇప్పుడే చెక్ చేసుకోండి
-
Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి జాతీయ స్థాయిలో గౌరవం.. దేశంలోనే నెం.1 రూట్గా విశాఖ-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!