Bihar: ప్రేమలో పడ్డ ముగ్గురు పిల్లల తల్లి.. దగ్గరుండి పెళ్లి చేసిన భర్త!
- బీహార్లోని సహర్సా జిల్లాలో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన
- 12 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న మహిళ
- మళ్లీ ప్రేమలో పడ్డ ముగ్గురు పిల్లల తల్లి
- వారిద్దరికీ పెళ్లి చేసిన భర్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్లోని సహర్సా జిల్లాలో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ 12 ఏళ్ల క్రితం మహిళ ప్రేమ వివాహం చేసుకుంది. 12 ఏళ్ల తర్వాత ఆ మహిళ మరొకరితో ప్రేమలో పడింది. ఈ విషయం మహిళ భర్తకు తెలియడంతో.. మొదట ఆగ్రహానికి గురయ్యాడు. తర్వాత వారిద్దరికీ పెళ్లి జరిపించాడు. ఈ మొత్తం విషయానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
READ MORE: Youtuber Arrest: యూట్యూబర్ భానుచందర్ అరెస్ట్.. రిమాండ్కు తరలింపు
Also Read
- 10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
- CM Chandrababu Naidu: డేటానే కొత్త సంపద.. స్వర్ణాంధ్ర 2047 సాధనే లక్ష్యం.!
- Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
- Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
ఓ జాతీయ మీడియా కథనం ప్రకారం.. ఈ ఘటన సహర్సాలోని బైజ్నాథ్పూర్ గ్రామంలో జరిగింది. ఓ యువకుడు 12 సంవత్సరాల క్రితం రహువా తులసియాహి గ్రామానికి చెందిన అమ్మాయిని ప్రేమించాడు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ వారి కుటుంబాలు అంగీకరించలేదు. వీరిద్దరూ పారిపోయి పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. అంతా మామూలుగానే సాగుతోంది. ఇంతలో ఆమె అదే గ్రామంలోని మరో వ్యక్తిపై మనసు పారేసుకుంది. కులాంతర వివాహం చేసుకున్న ఈ జంట ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందడంలో ఈ యువకుడు సహాయం చేశాడు. అప్పటికే నుంచి ఈ మహిళతో సాన్నిహిత్యం పెరిగి.. క్రమంగా ప్రేమకు దారితీసింది.
READ MORE:Rahul Gandhi: అంబేద్కర్ని అవమానిస్తే దేశం సహించదు..
డిసెంబర్ 16వ తేదీ రాత్రి, యువకుడు మహిళ ఇంటికి చేరుకున్నాడు. వీరిద్దరూ బెడ్రూంలో ఉండగా.. మహిళ భర్త హఠాత్తుగా ఇంటికి వచ్చి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు. వారిని పోలీసుల ఎదుట హాజరుపరిచాడు. తన ప్రేమ వ్యవహారాన్ని అందరి ముందు ఒప్పుకున్న యువతి అతడితోనే కలిసి జీవిస్తానని చెప్పింది. దీంతో వారిద్దరికీ పెళ్లి జరిపించాడు. రెండోసారి ప్రేమ వివాహం చేసుకున్న.. ఆ మహిళ ముగ్గురు పిల్లలను భర్త వద్దే వదిలేసింది. మొదటి భర్త వద్ద ముగ్గురు పిల్లలు ఉంటున్నారు. గ్రామస్థుల సమక్షంలో జరిగిన ఈ పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మొత్తం ఘటనపై ప్రజలు రకరకాలుగా స్పందిస్తున్నారు.
తాజావార్తలు
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
CM Chandrababu Naidu: డేటానే కొత్త సంపద.. స్వర్ణాంధ్ర 2047 సాధనే లక్ష్యం.!
-
Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
-
Telangana Police : మాజీ డీజీపీలకు షాక్.. బుల్లెట్ప్రూఫ్ కార్లు వెనక్కి.!
-
Harish Rao : జూపల్లి మాట మార్చారు.. చర్చకు రాకుండా తప్పించుకున్నారు
ట్రెండింగ్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!