Afghanistan – India: భారత్కు ఆఫ్ఘన్ బంగారం లాంటి ఆఫర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Afghanistan – India: భారత పర్యటనలో ఉన్న ఆఫ్ఘనిస్థాన్ పరిశ్రమ & వాణిజ్య మంత్రి అల్హాజ్ నూరుద్దీన్ అజీజీ సోమవారం కీలక ప్రకటన చేశారు. బంగారం తవ్వకంతో సహా కొత్త రంగాలలో పెట్టుబడులు పెట్టే కంపెనీలకు ఐదేళ్ల పన్ను మినహాయింపు ఇవ్వడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన వెల్లడించారు. భారతదేశం నుంచి ఆఫ్ఘనిస్థాన్లో అనేక రంగాలలో పెట్టుబడులు పెట్టాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా అజీజీ మాట్లాడుతూ.. పాకిస్థాన్తో ఉద్రిక్తతలు వాణిజ్య సమస్యలను సృష్టిస్తున్నాయని తెలిపారు. పెట్టుబడుల కోసం యంత్రాలను దిగుమతి చేసుకునే భారతీయ కంపెనీలకు 1% సుంకం మాత్రమే వసూలు చేస్తామని ఆయన వెల్లడించారు.
Also Read
- KTR: "మీ గల్లీ కేసీఆర్ మీరే కావాలి".. అలాంటి వాళ్లకే కార్పొరేట్ టికెట్ ఇస్తామన్న కేటీఆర్..
- Pakistan: హైజాక్ చేసిన అదే రైలు.. "జాఫర్ ఎక్స్ప్రెస్"నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు..?
- West Bengal: మమత మేనల్లుడి కోటకు బీటలు.. ఫల్తాలో భారీ విజయం దిశగా బీజేపీ..
- Rahul Gandhi: “భయపడొద్దు.. ముస్లింలకు మద్దతుగా నిలవాలి”.. రాహుల్ గాంధీ
పన్ను మినహాయింపులు..
ఆఫ్ఘన్ మంత్రి అజీజీ.. ” ఆఫ్ఘనిస్థాన్ అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉంది. అక్కడ మీకు ఎక్కువ మంది పోటీదారులు కనిపించరు” అని చెబుతూ పెట్టుబడులను ఆహ్వానించారు. పెట్టుబడి పెట్టే కంపెనీలకు టారిఫ్ మద్దతు, భూమిని ఇస్తామని ఆయన వెల్లడించారు. అదనంగా కొత్త రంగాలలో పెట్టుబడి పెట్టే కంపెనీలకు ఐదేళ్ల పన్ను మినహాయింపు ఇవ్వనున్నట్లు తెలిపారు. భారతీయ కంపెనీలు పెట్టుబడి కోసం యంత్రాలను దిగుమతి చేసుకుంటే, వాటికి 1 శాతం సుంకం మాత్రమే వసూలు చేస్తామని తెలిపారు. అలాగే బంగారం తవ్వకాలపై మాట్లాడుతూ.. “బంగారు తవ్వకాలకు కచ్చితంగా సాంకేతిక, వృత్తిపరమైన బృందాలు లేదా వృత్తిపరమైన కంపెనీలు అవసరం” అని ఆయన అన్నారు. అయితే ఉద్యోగాలను సృష్టించడానికి దేశంలోనే ప్రాసెసింగ్ జరగాలని ఆయన షరతు విధించారు.
వ్యాపారంలో సమస్యలు తొలగించాలి..
ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంచడానికి “చిన్న” అడ్డంకులను తొలగించాలని అజీజీ భారత ప్రభుత్వాన్ని కోరారు. “మేము భారతదేశం – ఆఫ్ఘనిస్థాన్ మధ్య సంబంధాలను మెరుగుపరచాలనుకుంటున్నాము” అని ఆయన భారత ప్రభుత్వ అధికారుల సమక్షంలో అన్నారు. “వీసాలు, ఎయిర్ కారిడార్లు, బ్యాంకింగ్ లావాదేవీలు వంటి కొన్ని చిన్న అడ్డంకులు ఈ మొత్తం ప్రక్రియను నిజంగా ప్రభావితం చేస్తాయి. ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులను మెరుగుపరచడానికి వీటిని పరిష్కరించాల్సిన అవసరం ఉంది” అని అన్నారు.
READ ALSO: Women’s Kabaddi World Cup 2025: మహిళల కబడ్డీ ప్రపంచకప్ విజేతగా భారత్..
తాజావార్తలు
-
Reliance Industries: రిలయన్స్ ఇన్వెస్టర్లకు పండగ.. ఐదు రోజుల్లోనే రూ.24 వేల కోట్ల సంపద
-
Ansiba Hassan: ‘జిహాదీ’ అంటూ వేధించారు.. మలయాళ నటి షాకింగ్ కామెంట్స్
-
KTR: “మీ గల్లీ కేసీఆర్ మీరే కావాలి”.. అలాంటి వాళ్లకే కార్పొరేట్ టికెట్ ఇస్తామన్న కేటీఆర్..
-
Pakistan: హైజాక్ చేసిన అదే రైలు.. “జాఫర్ ఎక్స్ప్రెస్”నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు..?
-
Gujjalapudi Hari: టాలీవుడ్లో తీవ్ర విషాదం.. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ గుజ్జలపూడి హరి కన్నుమూత
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?