Adluri laxman : మీరు నిరూపిస్తే నేను కోర్టులో ఉన్న నా ఎలక్షన్ పిటిషన్ వెనక్కి తీసుకొంటా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం పాశిగామ గ్రామం వద్ద జిల్లా డీసీసీ అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గ్రామస్థులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల ప్రజలకు ఎటువంటి నష్టం జరగదు అని మీరు నిరూపిస్తే నేను కోర్టులో ఉన్న నా ఎలక్షన్ పిటిషన్ ను వెనక్కి తీసుకొంటానని అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. మాజీ మంత్రి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇథనాల్ ఫ్యాక్టరీ గురించి అన్ని శాఖల నుండి పూర్తి సమాచారాన్ని తెలుసుకున్న తర్వాత నే పాశిగామ గ్రామస్థులను కలిసి వారితో మాట్లాడటం జరిగిందని, మంత్రి కొప్పుల ఈశ్వర్ ఒక ప్రైవేట్ కార్యక్రమంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పైన చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు
Also Read : Volvo C40 Recharge: వోల్వో నుంచి మరో ఎలక్ట్రిక్ కార్.. ఒక్క ఛార్జ్తో 530 కి.మీ.
Also Read
- Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
- Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
- IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
- T20 World Cup: టీమిండియా ఘోర ఓటమి.. వరల్డ్ కప్ నుంచి ఔట్..
అంతేకాకుండా.. ‘మంత్రి కొప్పుల ఈశ్వర్ తేదీ, సమయం చెప్పండి మీరు మేము అందరం కలిసి ఈ ఫ్యాక్టరీ ఉన్న పర్లపెల్లి ,నారాయణఖేడ్ కి వెళ్లి అక్కడ ప్రజలను ఈ ఫ్యాక్టరీ గురించి అడిగి తెలుసుకుందాం. షుగర్ ఫ్యాక్టరీ నీ తెరిపిస్తామని మీ మేనిఫెస్టోలో పెట్టి ముఖ్యమంత్రి ఫ్యాక్టరీని తెరిపిస్తామని ప్రకటించడం జరిగింది.. సిద్దిపేట, సిరిసిల్ల తరహాలో ధర్మపురిని అభివృద్ధి చేయాలన్న ఆలోచన మంత్రి లేదు కానీ, ఇతర పార్టీల నుండి నాయకులను ఏ విధంగా పార్టీలోకి తీసుకురావాలనే దాని పైన ఆలోచన ఉంటుంది. మంత్రి పై ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే జీతాలు ఇచ్చి మరి సోషల్ మీడియాలో వారి పైన విషప్రచారం చేయించడం జరుగుతుంది. 2004 ముందు మంత్రి ఈశ్వర్ గారి ఆస్తులు ఎంత..? 2023 నాటికి ఆస్తులు ఎంతనో ప్రజలకు తెలపాలి.. జగిత్యాలలో చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరిన మంత్రికొప్పుల ఈశ్వర్ జీవన్ రెడ్డి సవాల్ నీ స్వీకరించి తేదీ, సమయాన్ని చెప్పాలని అంటే మంత్రి ఎందుకని నోరు మెదపడం లేదు.. కాలేశ్వరం లింక్ పేరిట ఈ ప్రాంతంలో 700 ఎకరాల మూడు పంటలు పండే భూములను పోలీసులను, అధికారులను పెట్టి రైతులను బెదిరింపులకు గురి చేసి బలవంతంగా వారి నుండి లాక్కున్నారు.. ఇథనాల్ ప్రాజెక్టు వల్ల ఈ ప్రాంత ప్రజలకు నిజంగా మేలు కలుగుతుందంటే గ్రామ ప్రజలకు తెలియకుండా పనులను ప్రారంభించాల్సిన అవసరం ఏముందో మంత్రి చెప్పాలి.’ అని ఆయన అన్నారు.
Also Read : Pawan Kalyan: జనసేనకి అధికారం కట్టబెట్టండి.. నచ్చకపోతే నేనే రాజీనామా చేస్తా
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!