AUS vs IND: భారత్ను అడ్డుకోవడం కష్టమే.. ఆస్ట్రేలియాకు ఆడమ్ హెచ్చరికలు!
- పెర్త్ వేదికగా తొలి టెస్ట్
- పెర్త్ పిచ్లో తెచ్చుకున్న భారత్ ఆటగాళ్లు
- ఆస్ట్రేలియాకు ఆడమ్ హెచ్చరికలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25కి సమయం ఆసన్నమైంది. ఐదు టెస్ట్ మ్యాచుల సిరీస్లో భాగంగా పెర్త్ వేదికగా శుక్రవారం నుంచి ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ టెస్టులో విజయం సాధించాలని ఇరు జట్లు బరిలోకి దిగుతున్నాయి. పెర్త్ పిచ్లో ఇంట్రాస్క్వాడ్ వార్మప్ మ్యాచ్ ఆడిన భారత్ ఆటగాళ్లు.. అక్కడి పరిస్థితులపై అవగాహన తెచ్చుకున్నారు. ప్రాక్టీస్ సెషన్స్లోనూ తీవ్రంగా సాధన చేస్తున్నారు. పెర్త్లో ట్రైనింగ్ సెషన్ను ప్రత్యక్షంగా చూసిన ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు ఆడమ్ గిల్క్రిస్ట్.. ఆసీస్ జట్టును హెచ్చరించాడు.
న్యూజీలాండ్ టెస్టు సిరీస్ ఓటమితో డీలా పడిందనుకుంటున్న టీమిండియా మళ్లీ పుంజుకోవడం ఖాయమని ఆడమ్ గిల్క్రిస్ట్ తమ జట్టుకు హెచ్చరికలు జారీ చేశాడు. ఫాక్స్ క్రికెట్తో గిల్క్రిస్ట్ మాట్లాడుతూ… ‘టీమిండియా ఇప్పుడు చాలా ఉత్సాహంగా ఉంది. జట్టులోని ప్రతి ఆటగాడు విజయం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. పెర్త్లో ట్రైనింగ్ సెషన్ బాగుంది. భారత్ ఆటగాళ్లను చూస్తుంటే.. ఫుల్గా ఛార్జ్ అయినట్లు అనిపిస్తోంది. టెస్టు సిరీస్ కోసం పూర్తిగా సిద్దమయ్యారు. భారత్ను అడ్డుకోవడానికి ఆస్ట్రేలియా చాలా కష్టపడాల్సిందే’ అని చెప్పాడు.
Also Read
- India: చైనా, అమెరికాలకు పోటీగా భారత్.. ఫ్రాన్స్తో కలిసి 6th జనరేషన్ ఫైటర్ జెట్!
- UP: డేటింగ్ యాప్తో బ్లాక్మెయిల్.. రూ.6 కోట్లు నొక్కేసిన కిలాడీ!
- India Real Estate: Gen Z ఇళ్లకు దూరమవుతుందా?.. రియల్ ఎస్టేట్పై ప్రభావం ఎంత?.. ఆర్థిక వ్యవస్థను ఎలా మార్చొచ్చు?
- UPI Charges: UPI ఛార్జీలపై కీలక అప్డేట్.. కిరాణా దుకాణాలు, చిన్న వ్యాపారులకు గుడ్న్యూస్
Also Read: Amazon Offers: కళ్లు చెదిరే డిస్కౌంట్.. ఈ స్మార్ట్ టీవీపై 30 వేల తగ్గింపు!
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కు చేరడంతో పాటు ఆస్ట్రేలియా గడ్డపై బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ హ్యాట్రిక్ సాధించడమే లక్ష్యంగా భారత్ బరిలోకి దిగనుంది. విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా, ఆర్ అశ్విన్, ఆర్ జడేజాలు గత పర్యటనల్లో ఆడారు. పుజారా, రహానేలు లేకపోవడం కాస్త లోటే అయినా.. జురెల్, సర్ఫరాజ్, గిల్, యశస్విలు సత్తాచాటేందుకు సిద్ధమయ్యారు. కుర్రాళ్లు ఎలా ఆడతారో చూడాలి.
తాజావార్తలు
-
India: చైనా, అమెరికాలకు పోటీగా భారత్.. ఫ్రాన్స్తో కలిసి 6th జనరేషన్ ఫైటర్ జెట్!
-
UP: డేటింగ్ యాప్తో బ్లాక్మెయిల్.. రూ.6 కోట్లు నొక్కేసిన కిలాడీ!
-
India Real Estate: Gen Z ఇళ్లకు దూరమవుతుందా?.. రియల్ ఎస్టేట్పై ప్రభావం ఎంత?.. ఆర్థిక వ్యవస్థను ఎలా మార్చొచ్చు?
-
UPI Charges: UPI ఛార్జీలపై కీలక అప్డేట్.. కిరాణా దుకాణాలు, చిన్న వ్యాపారులకు గుడ్న్యూస్
-
Jharkhand: జార్ఖండ్లో పేపర్ లీక్ నిరసనలు.. ప్రభుత్వంతో చర్చలు విఫలం
ట్రెండింగ్
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!