Jayasudha: బీజేపీ తీర్థం పుచ్చుకున్న జయసుధ.. మళ్లీ పోటీ అనేది కేవలం రూమర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణపై బీజేపీ అధిష్టానం ఫోకస్ చేసింది. వచ్చే ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా ఇప్పటికే నుంచే వ్యూహాలను రచిస్తుంది. అందులో భాగంగానే ఇప్పటికే పలు పార్టీలకు చెందిన అసంతృప్త నేతలను కమలం పార్టీలో చేర్చుకోవడంలో సఫలం అవుతుంది. అయితే, తాజాగా సినీనటి, సికింద్రాబాద్ మాజీ ఎమ్మెల్యే జయసుధ బీజేపీ పార్టీలో చేరారు. తరుణ్ చుగ్, కిషన్ రెడ్డిల సమక్షంలో ఆమె కమలం పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా జయసుధ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశంలో జరుగుతున్న అభివృద్ధి చూడటం వల్లే బీజేపీ పార్టీలో చేరినట్లు ఆమె తెలిపారు. సంవత్సరం నుంచి బీజేపీ నాయకులతో చర్చలు జరుగుతున్నాయి.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశాను.. ఒక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాను.. కుల, మతాల పరంగా కాదు మంచి పని చెయ్యాలని కోరుకుంటున్నా.. క్రైస్తవుల వాయిస్ కోసం నేను పని చేస్తాను అని జయసుధ అన్నారు.
Read Also: Visakha : అక్కడేలా పార్క్ చేశావమ్మా… మద్యం మత్తులో మహిళా డాక్టర్ ర్యాష్ డ్రైవింగ్
Also Read
- Tickets Prices Hike: మరి ఇంత దారుణమా.. SRH vs RCB మ్యాచ్ టికెట్ ధరలు అంతలా పెంచేసారేంట్రా బాబు..!
- AIADMK Crisis: అన్నాడీఎంకేలో మరింత ముదిరిన సంక్షోభం.. స్పీకర్తో విడివిడిగా ఇరు వర్గాల భేటీ
- Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
- CM Chandrababu: భూ వివాదాలకు చెక్.. పేదరికం లేని సమాజమే నా లక్ష్యం..
ఎమ్మెల్యేగా నా పదవి కాలాన్ని పూర్తి చేశాను అని జయసుధ అన్నారు. ఆ తర్వాత రాజకీయాల్లో కనిపించక పోవడానికి చాలా కారణాలు ఉన్నాయి.. రాజకీయాలంటే మీకు తెలుసు కదా.. సమయాన్ని గౌరవించాలి.. టైంను నమ్ముతా.. ఇప్పటికీ సినిమాలు నాకు రావడం అదృష్టం అని ఆమె అన్నారు. అప్పుడప్పుడు.. మంచి క్యారెక్టర్లు ఉంటే చేస్తున్నాను.. ఇక, సికింద్రాబాద్ నుంచి మళ్లీ పోటీ అనేది కేవలం రూమర్ మాత్రమేనని బీజేపీ నేత జయసుధ తెలిపారు.
Read Also: KA Paul: నాలుగేళ్ళ నుంచి రమ్మంటున్నా… నేనొద్దు మోడీనే ముద్దంటున్నాడు!
జయసుధ సికింద్రబాద్ నుంచి గతంలో ఎమ్మెల్యేగా పని ఉన్నారు.. ఆమె బాలనటిగా సినిమాల్లోకి వచ్చారు.. 9 నంది అవార్డులు జయసుధ గెలుచుకున్నారు.. సినిమా ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానాన్ని ఆమె సంపాదించుకున్నారు అని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. జయసుధ ఎమ్మెల్యేగా ఉన్నపుడు, నేను ఎమ్మెల్యేగా ఉన్నాను అని ఆయన పేర్కొన్నారు. జయసుధ బీజేపీ పార్టీలో చేరటం మాకు చాలా లాభం.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్య పాలన రావాలని ప్రజలు కోరుకుంటున్నారు.. బీఆర్ఎస్ పార్టీ ఓడితెనే ప్రజల ఆకాంక్ష నెరవేరుతుంది అని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి అన్నారు.
Read Also: Top Headlines@5PM: టాప్ న్యూస్
తాజావార్తలు
-
Tickets Prices Hike: మరి ఇంత దారుణమా.. SRH vs RCB మ్యాచ్ టికెట్ ధరలు అంతలా పెంచేసారేంట్రా బాబు..!
-
AIADMK Crisis: అన్నాడీఎంకేలో మరింత ముదిరిన సంక్షోభం.. స్పీకర్తో విడివిడిగా ఇరు వర్గాల భేటీ
-
Jayam Ravi: 14 ఏళ్లు బానిసలా బతికా.. ‘నా పిల్లలను కూడా చూడనివ్వట్లేదు’ అంటూ ఏడ్చేసిన జయం రవి..
-
Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
-
NEET Paper Leak Case: నీట్ పేపర్ లీక్ కేసు.. ఎన్టీఏను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..