Jayasudha: బీజేపీ తీర్థం పుచ్చుకున్న జయసుధ.. మళ్లీ పోటీ అనేది కేవలం రూమర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణపై బీజేపీ అధిష్టానం ఫోకస్ చేసింది. వచ్చే ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా ఇప్పటికే నుంచే వ్యూహాలను రచిస్తుంది. అందులో భాగంగానే ఇప్పటికే పలు పార్టీలకు చెందిన అసంతృప్త నేతలను కమలం పార్టీలో చేర్చుకోవడంలో సఫలం అవుతుంది. అయితే, తాజాగా సినీనటి, సికింద్రాబాద్ మాజీ ఎమ్మెల్యే జయసుధ బీజేపీ పార్టీలో చేరారు. తరుణ్ చుగ్, కిషన్ రెడ్డిల సమక్షంలో ఆమె కమలం పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా జయసుధ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశంలో జరుగుతున్న అభివృద్ధి చూడటం వల్లే బీజేపీ పార్టీలో చేరినట్లు ఆమె తెలిపారు. సంవత్సరం నుంచి బీజేపీ నాయకులతో చర్చలు జరుగుతున్నాయి.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశాను.. ఒక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాను.. కుల, మతాల పరంగా కాదు మంచి పని చెయ్యాలని కోరుకుంటున్నా.. క్రైస్తవుల వాయిస్ కోసం నేను పని చేస్తాను అని జయసుధ అన్నారు.
Read Also: Visakha : అక్కడేలా పార్క్ చేశావమ్మా… మద్యం మత్తులో మహిళా డాక్టర్ ర్యాష్ డ్రైవింగ్
Also Read
- Germany: జర్మనీలో దుండగుడు కాల్పులు.. ఐదుగురు మృతి
- Sai Krishna Death Case: సాయికృష్ణ డెత్ కేసులో కీలక మలుపు.. లొంగిపోయిన హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని.!
- CM Chandrababu: పెట్టుబడుల కంటే ఆలోచనలే ముఖ్యం.. సీఐఐ సమ్మిట్పై సీఎం కీలక వ్యాఖ్యలు.!
- CM Chandrababu: రాజధాని నిర్మాణాల ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానిస్తం.!
ఎమ్మెల్యేగా నా పదవి కాలాన్ని పూర్తి చేశాను అని జయసుధ అన్నారు. ఆ తర్వాత రాజకీయాల్లో కనిపించక పోవడానికి చాలా కారణాలు ఉన్నాయి.. రాజకీయాలంటే మీకు తెలుసు కదా.. సమయాన్ని గౌరవించాలి.. టైంను నమ్ముతా.. ఇప్పటికీ సినిమాలు నాకు రావడం అదృష్టం అని ఆమె అన్నారు. అప్పుడప్పుడు.. మంచి క్యారెక్టర్లు ఉంటే చేస్తున్నాను.. ఇక, సికింద్రాబాద్ నుంచి మళ్లీ పోటీ అనేది కేవలం రూమర్ మాత్రమేనని బీజేపీ నేత జయసుధ తెలిపారు.
Read Also: KA Paul: నాలుగేళ్ళ నుంచి రమ్మంటున్నా… నేనొద్దు మోడీనే ముద్దంటున్నాడు!
జయసుధ సికింద్రబాద్ నుంచి గతంలో ఎమ్మెల్యేగా పని ఉన్నారు.. ఆమె బాలనటిగా సినిమాల్లోకి వచ్చారు.. 9 నంది అవార్డులు జయసుధ గెలుచుకున్నారు.. సినిమా ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానాన్ని ఆమె సంపాదించుకున్నారు అని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. జయసుధ ఎమ్మెల్యేగా ఉన్నపుడు, నేను ఎమ్మెల్యేగా ఉన్నాను అని ఆయన పేర్కొన్నారు. జయసుధ బీజేపీ పార్టీలో చేరటం మాకు చాలా లాభం.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్య పాలన రావాలని ప్రజలు కోరుకుంటున్నారు.. బీఆర్ఎస్ పార్టీ ఓడితెనే ప్రజల ఆకాంక్ష నెరవేరుతుంది అని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి అన్నారు.
Read Also: Top Headlines@5PM: టాప్ న్యూస్
తాజావార్తలు
-
Idupu Kayitham: అసలెందుకీ వివాదం.. ఎక్కడ మొదలైందంటే?
-
Ullipaya Chutney: రుచితో పాటు ఆరోగ్యం.. సాంప్రదాయ ‘చింతపండు ఉల్లిపాయ చట్నీ’ ఇంట్లోనే ఈజీగా ఇలా చేసేయండి!
-
Germany: జర్మనీలో దుండగుడు కాల్పులు.. ఐదుగురు మృతి
-
High Protein Breakfast: శరీరం ఉక్కులా మారాలంటే ఈ బ్రేక్ఫాస్ట్ తినాల్సిందే.. ఒక్కసారి తింటే లైఫ్ లాంగ్ టేస్ట్ మర్చిపోరు!
-
Sai Krishna Death Case: సాయికృష్ణ డెత్ కేసులో కీలక మలుపు.. లొంగిపోయిన హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని.!
ట్రెండింగ్
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!