Mann Ki Baat : ‘మన్ కీ బాత్’ వినకుంటే ఇంత శిక్ష.. 36 మంది నర్సింగ్ విద్యార్థులను గదిలో బంధించారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mann Ki Baat : చండీగఢ్ లోని ఓ నర్సింగ్ కాలేజీలో అమానుష ఘటన చోటు చేసుకుంది. మన్ కీ బాత్ వినలేదని నర్సింగ్ స్టూడెంట్లను వారం పాటు హాస్టల్ నుంచి బయటకు వెళ్లనీయకుండా నిర్బంధించారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో సోషల్ మీడియాలో భారీ వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వివరాల్లోకి వెళితే.. చండీగఢ్ లోని పీజీఐఎంఈఆర్ నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ నర్సింగ్ ఎడ్యుకేషన్ కు చెందిన 36 మంది నర్సింగ్ విద్యార్థులు మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. దీంతో కాలేజీ యాజమాన్యం కఠిన చర్యలు తీసుకున్నారు. విద్యార్థులను వారం పాటు హాస్టల్ నుంచి బయటకు రానివ్వలేదు. ఏప్రిల్ 30న ప్రసారమైన 100వ మన్ కీ బాత్ ఎపిసోడ్ ను మొదటి, మూడో సంవత్సరం విద్యార్థులు ఇనిస్టిట్యూట్ లోని లెక్చర్ థియేటర్-1లో తప్పనిసరిగా వినాలని హాస్టల్ -9 వార్డెన్ ఆదేశించారు. ఈ కార్యక్రమానికి హాజరుకాకపోతే బయటకు వెళ్లనివ్వబోమని విద్యార్థులను హెచ్చరించారు.
Read Also: Pakistan: ఇమ్రాన్కు గుండెపోటు వచ్చేలా ఇంజెక్షన్ ఇచ్చారు.. లాయర్ల ఆరోపణలు
Also Read
- US: అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి.. 17 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ఘోరం
- Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
- BRICS Summit: బ్రిక్స్ తర్వాత ప్రపంచ నాయకులకు అస్వస్థత అంటూ తప్పుడు ప్రచారం.. తీవ్రంగా ఖండించిన భారత్
- Dharmana Krishnadasu: వర్షాలు లేక సాగు ఆలస్యం.. ఎరువులు లేక రైతుల అవస్థలు.. ధర్మాన కృష్ణదాసు ఆవేదన..
‘‘ వార్డెన్, హాస్టల్ కోఆర్డినేటర్ పదేపదే మన్ కీ బాత్ వినాలని గుర్తు చేసినా.. హాస్టల్ -9 కు చెందిన మొత్తం 36 మంది విద్యార్థులు హాజరు కాలేదు. ఇందులో ఫస్ట్ ఇయర్ కు చెందిన 8 మంది, థర్డ్ ఇయర్ కు చెందిన 28 మంది విద్యార్థులు హాజరు కాలేదు. ఈ విషయంపై చర్యలు తీసుకోవాలని, సమాచారం కోసం తెలియజేస్తున్నాం’’ అని పీజీఐ డైరెక్టర్ నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే 28 మంది థర్డ్ ఇయర్ స్టూడెంట్స్, ఫస్ట్ ఇయర్ చదువుతున్న 8 మంది స్టూడెంట్స్ ను వారం రోజుల పాటు హాస్టల్ నుంచి బయటకు రావొద్దని మే 3న ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో తమను బయటకు రానివ్వలేదని విద్యార్థులు ఆరోపించారు. కాగా.. నర్సింగ్ విద్యార్థులపై తీసుకున్న చర్యలపై సోషల్ మీడియాలో వివిధ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీనిపై టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా స్పందించారు. ‘‘మన్ కీ బాత్ నేను కూడా వినలేదు. ఒక్కసారి మాత్రమే కాదు. ఎప్పుడూ నేను వినలేదు. మరి నాకు కూడా శిక్ష పడుతుందా? వారం రోజుల పాటు ఇంటి నుంచి బయటకు రాకుండా నిషేధం విధిస్తారా? నాకిప్పుడు చాలా టెన్సన్ గా ఉంది’’ అంటూ ట్వీట్ చేశారు.
Read Also:Suriya: కదన రంగంలో ‘కంగువ’.. యుద్ధ వీరుడు ఇలా ఉండాలి!
తాజావార్తలు
-
Telangana MLC Elections : ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా షురూ.. గ్రాడ్యుయేట్స్కు కీలక అలర్ట్
-
US: అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి.. 17 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ఘోరం
-
Udaya Bhanu: ‘పీఆర్’ పాలిటిక్స్..ఉదయభాను బాధ కరెక్టే, కానీ తప్పదు?
-
Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
-
Jeevanlal Lavidiya : మాజీ ఐటీ కమిషనర్కు మరో షాక్.. భార్యపైనా కేసు.!
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!