Uttar Pradesh: మహిళ పోలీసుపై దాడి..ఎన్కౌంటర్లో దుండగుడు హతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆగస్టు 30న అయోధ్య రైల్వే స్టేషన్లో మహిళ కానిస్టేబుల్ పై దాడి చేసిన దుండగుల్లో ఒకరు హతమయ్యారు. మరో ఇద్దరికి బుల్లెట్ తగిలింది. ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్యలో శుక్రవారం ఉదయం ఈ ఘటన జరిగింది. లక్నో స్పెషల్ టాస్క్ఫోర్స్ ఎన్కౌంటర్ జరిపింది. నిందితులు అజాద్ ఖాన్, విశ్వంభర్ దయాళ్, అనీశ్ ను పట్టుకోవడానికి ప్రయత్నించే క్రమంలో వారిపై కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే నిందుతుల్లో ఒకడైన అనీశ్ పోలీసు కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు.
Also Read: USA:” ఆ విషయంలో భారత్ కు ప్రత్యేక మినహాయింపులేమీ లేవు”
Also Read
- Russia: చమురు మార్కెట్ను భారత్ శాసిస్తుంది.. రష్యా సంచలన వ్యాఖ్యలు..
- School Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా, సంక్రాంతి సెలవుల ప్రకటన.. ఎన్నిరోజులంటే..
- Suvendu Adhikari: బీజేపీ ప్రభుత్వానికి బుద్ధదేవ్ భార్య కితాబు.. సీపీఎం ప్రశంసలపై బెంగాల్లో చర్చ
- Vaibhav Sooryavanshi: కోహ్లీ నుంచి అద్భుతమైన సలహా.. 'ఆరెంజ్ క్యాప్' విజేత వైభవ్ సూర్యవంశీ భావోద్వేగం..
అసలేం జరిగిందంటే ఆగస్టు 30న అయోధ్య రైల్వే స్టేషన్లో సరయు ఎక్స్ప్రెస్ కంపార్ట్మెంట్లో సీటు విషయంలో నిందితులకు మహిళ కానిస్టేబుల్ తో వివాదం తలెత్తింది. వారి మధ్య గొడవ మరింత ముదిరింది.దీంతో నిందితులు మహిళ కానిస్టేబుల్ పై విచక్షణా రహితంగా దాడి చేశారు. కత్తితో ఆమె ముఖం పై దాడి చేవారు. దీంతో ఆమె పుర్రెకు బలమైన గాయం అయ్యింది. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ రక్తపు మడుగులో పడి ఉన్న ఆ కానిస్టేబుల్ ను పోలీసు అయోధ్య రైల్వే స్టేషన్లో సరయు ఎక్స్ప్రెస్ కంపార్ట్మెంట్లో గుర్తించారు. వెంటనే చికిత్స కోసం ఆమెను లక్నోలోని కేజీఎంసీ ఆసుపత్రిలో చేర్పించారు. ఇప్పుడిప్పుడే ఆమె కోలుకుంటున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కానిస్టేబుల్ ను గాయపరిచి అక్కడి నుంచి పారిపోయిన నిందుతులపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారి కోసం గాలింపు చర్యలు మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో వారు ఈ రోజు ఉదయం పోలీసుల కంటపడ్డారు. అయితే నిందుతులు పోలీసులను చూడగానే వారిపై కాల్పులు జరపడం మొదలు పెట్టారు. దీంతో పోలీసులు కూడా ఎదరు కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే అనీత్ హతమయ్యాడు. మరో ఇద్దరికి బుల్లెట్ గాయాలయ్యాయి. గాయాలయిన వారిని పోలీసులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
తాజావార్తలు
-
Russia: చమురు మార్కెట్ను భారత్ శాసిస్తుంది.. రష్యా సంచలన వ్యాఖ్యలు..
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
The Paradise: నానీ ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్.. ఆగస్టు రేసు నుంచి తప్పుకున్న ‘ది ప్యారడైజ్’? కారణం ఇదేనట!
-
School Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా, సంక్రాంతి సెలవుల ప్రకటన.. ఎన్నిరోజులంటే..
-
Suvendu Adhikari: బీజేపీ ప్రభుత్వానికి బుద్ధదేవ్ భార్య కితాబు.. సీపీఎం ప్రశంసలపై బెంగాల్లో చర్చ
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!