Uttar Pradesh: మహిళ పోలీసుపై దాడి..ఎన్కౌంటర్లో దుండగుడు హతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆగస్టు 30న అయోధ్య రైల్వే స్టేషన్లో మహిళ కానిస్టేబుల్ పై దాడి చేసిన దుండగుల్లో ఒకరు హతమయ్యారు. మరో ఇద్దరికి బుల్లెట్ తగిలింది. ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్యలో శుక్రవారం ఉదయం ఈ ఘటన జరిగింది. లక్నో స్పెషల్ టాస్క్ఫోర్స్ ఎన్కౌంటర్ జరిపింది. నిందితులు అజాద్ ఖాన్, విశ్వంభర్ దయాళ్, అనీశ్ ను పట్టుకోవడానికి ప్రయత్నించే క్రమంలో వారిపై కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే నిందుతుల్లో ఒకడైన అనీశ్ పోలీసు కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు.
Also Read: USA:” ఆ విషయంలో భారత్ కు ప్రత్యేక మినహాయింపులేమీ లేవు”
Also Read
- IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
- PM Modi: ‘‘ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం’’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..
- CM Chandrababu: బాధితులకు ఊరట.. అగ్రిగోల్డ్ ఆస్తులపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
- Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
అసలేం జరిగిందంటే ఆగస్టు 30న అయోధ్య రైల్వే స్టేషన్లో సరయు ఎక్స్ప్రెస్ కంపార్ట్మెంట్లో సీటు విషయంలో నిందితులకు మహిళ కానిస్టేబుల్ తో వివాదం తలెత్తింది. వారి మధ్య గొడవ మరింత ముదిరింది.దీంతో నిందితులు మహిళ కానిస్టేబుల్ పై విచక్షణా రహితంగా దాడి చేశారు. కత్తితో ఆమె ముఖం పై దాడి చేవారు. దీంతో ఆమె పుర్రెకు బలమైన గాయం అయ్యింది. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ రక్తపు మడుగులో పడి ఉన్న ఆ కానిస్టేబుల్ ను పోలీసు అయోధ్య రైల్వే స్టేషన్లో సరయు ఎక్స్ప్రెస్ కంపార్ట్మెంట్లో గుర్తించారు. వెంటనే చికిత్స కోసం ఆమెను లక్నోలోని కేజీఎంసీ ఆసుపత్రిలో చేర్పించారు. ఇప్పుడిప్పుడే ఆమె కోలుకుంటున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కానిస్టేబుల్ ను గాయపరిచి అక్కడి నుంచి పారిపోయిన నిందుతులపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారి కోసం గాలింపు చర్యలు మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో వారు ఈ రోజు ఉదయం పోలీసుల కంటపడ్డారు. అయితే నిందుతులు పోలీసులను చూడగానే వారిపై కాల్పులు జరపడం మొదలు పెట్టారు. దీంతో పోలీసులు కూడా ఎదరు కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే అనీత్ హతమయ్యాడు. మరో ఇద్దరికి బుల్లెట్ గాయాలయ్యాయి. గాయాలయిన వారిని పోలీసులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
తాజావార్తలు
-
IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
-
Vishwa Prasad : అందుకే సుమలతకు సపోర్ట్ చేయడానికి వచ్చా!
-
PM Modi: ‘‘ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం’’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..
-
CM Chandrababu: బాధితులకు ఊరట.. అగ్రిగోల్డ్ ఆస్తులపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
22A Lands: 22A భూములపై గుడ్ న్యూస్.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.!
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..