AP News: ఏపీ వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మెరుపు దాడులు.. పరారైన డాక్యుమెంట్ రైటర్లు!
- ఏపీ వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మెరుపు దాడులు
- పరారైన డాక్యుమెంట్ రైటర్లు
- రికార్డులు పరిశీలిస్తున్న అధికారులు
ఏపీ వ్యాప్తంగా ఏసీబీ అధికారుల బృందాలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మెరుపు దాడులు నిర్వహిస్తున్నాయి. విజయవాడ ఇబ్రహీంపట్నం, పలనాడు జిల్లా నరసరావుపేట, తిరుపతి రేణిగుంట, విజయనగరం భోగాపురం, విశాఖ మధురవాడ, ఒంగోలు, కర్నూలు కడప వంటి అన్ని ప్రాంతాల్లో ఉన్న సబ్ రిజిస్టర్ కార్యాలయాలు అధికారులు మెరుపు దాడులు చేస్తున్నారు. సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ప్రైవేటు వ్యక్తులు పనిచేయడంతో పాటు ఏజెంట్లు సబ్ రిజిస్టర్ కార్యాలయ సిబ్బంది కొమ్మక్కై అవినీతికి పాల్పడుతున్నారని అంశాల మీద విచారణ చేస్తున్నారు. కార్యాలయాల తలుపులు మూసి లోపల రికార్డులు పరిశీలిస్తున్నారు.
అవినీతి ఆరోపణల నేపథ్యంలో రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేపట్టారు. సబ్ రిజిస్ట్రార్ సిబ్బంది, దస్తావేజుల విభాగంలో లావాదేవీలపై సమగ్రంగా తనిఖీలు చేపట్టారు. అధికారుల నుంచి పలు రికార్డులు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. లంచం, అక్రమ రిజిస్ట్రేషన్లపై వచ్చిన ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకొని ఈ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ పనిచేస్తున్న సబ్ రిజిస్టర్ ఆనంద రెడ్డిపై అవినీతి తీవ్రస్థాయిలో ఆరోపణలు ఉన్నాయి. ఆళ్లగడ్డ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకు ఏసీబీ అధికారులు రాగానే డాక్యుమెంట్ రైటర్లు పరారయ్యారు. ఏసీబీ అధికారులు కీలక దస్త్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఆళ్లగడ్డ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకు ఏసీబీ అధికారులు రాగానే డాక్యుమెంట్ రైటర్లు పరారయ్యారు. ఏసీబీ అధికారులు కీలక దస్త్రాలు స్వాధీనం చేసుకున్నారు.
Also Read
- Tamil Nadu Politics: తమిళనాడులో రాజకీయ సంచలనం.. ‘విజయ్’ కింగ్ మేకర్గా మారతారా? మరో షాకింగ్ సర్వే!
- Iran: ఇరాన్లో ఘోరం.. ఆయుధ మిషన్ పేలి 14 మంది సైనికులు మృతి
- Astrology: మే 2 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి శుభవార్త..
- Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
Also Read: Nigar Sultana: జూనియర్లను గదిలోకి పిలిచి.. బంగ్లా కెప్టెన్పై సీనియర్ పేసర్ ఆరోపణలు!
శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు కొనసాగుతున్నాయి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అధికారులు రికార్డ్స్ ను పరిశీలిస్తున్నారు. ఇప్పటివరకు కార్యాలయంలో అవినీతి జరిగినట్టు ఎటువంటి ఆధారాలు దొరకలేదు. తనిఖీలు కొనసాగుతున్నాయని అధికారులు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్టర్ కార్యాలయాలపై ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయని, అందులో భాగంగా ఇక్కడ కూడా తనిఖీ చేస్తున్నాం అని చెప్పారు.
తాజావార్తలు
-
Tamil Nadu Politics: తమిళనాడులో రాజకీయ సంచలనం.. ‘విజయ్’ కింగ్ మేకర్గా మారతారా? మరో షాకింగ్ సర్వే!
-
Delhi Capitals Record: ఢిల్లీ క్యాపిటల్స్ సంచలనం.. ఐపీఎల్ చరిత్రలోనే టాప్ చేజ్ నమోదు!
-
Pickleball Players’ Plane Crash: టెక్సాస్లో ఘోర విమాన ప్రమాదం.. క్రీడాకారులతో వెళ్తున్న ఫ్లైట్ కూలి ఐదుగురు మృతి
-
Iran: ఇరాన్లో ఘోరం.. ఆయుధ మిషన్ పేలి 14 మంది సైనికులు మృతి
-
KL Rahul: 75 పరుగులతో ఆరెంజ్ క్యాప్, కోహ్లీ రికార్డు బ్రేక్.. కేఎల్ రాహుల్ సెన్సేషన్
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!