AP News: ఏపీ వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మెరుపు దాడులు.. పరారైన డాక్యుమెంట్ రైటర్లు!
- ఏపీ వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మెరుపు దాడులు
- పరారైన డాక్యుమెంట్ రైటర్లు
- రికార్డులు పరిశీలిస్తున్న అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ వ్యాప్తంగా ఏసీబీ అధికారుల బృందాలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మెరుపు దాడులు నిర్వహిస్తున్నాయి. విజయవాడ ఇబ్రహీంపట్నం, పలనాడు జిల్లా నరసరావుపేట, తిరుపతి రేణిగుంట, విజయనగరం భోగాపురం, విశాఖ మధురవాడ, ఒంగోలు, కర్నూలు కడప వంటి అన్ని ప్రాంతాల్లో ఉన్న సబ్ రిజిస్టర్ కార్యాలయాలు అధికారులు మెరుపు దాడులు చేస్తున్నారు. సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ప్రైవేటు వ్యక్తులు పనిచేయడంతో పాటు ఏజెంట్లు సబ్ రిజిస్టర్ కార్యాలయ సిబ్బంది కొమ్మక్కై అవినీతికి పాల్పడుతున్నారని అంశాల మీద విచారణ చేస్తున్నారు. కార్యాలయాల తలుపులు మూసి లోపల రికార్డులు పరిశీలిస్తున్నారు.
అవినీతి ఆరోపణల నేపథ్యంలో రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేపట్టారు. సబ్ రిజిస్ట్రార్ సిబ్బంది, దస్తావేజుల విభాగంలో లావాదేవీలపై సమగ్రంగా తనిఖీలు చేపట్టారు. అధికారుల నుంచి పలు రికార్డులు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. లంచం, అక్రమ రిజిస్ట్రేషన్లపై వచ్చిన ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకొని ఈ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ పనిచేస్తున్న సబ్ రిజిస్టర్ ఆనంద రెడ్డిపై అవినీతి తీవ్రస్థాయిలో ఆరోపణలు ఉన్నాయి. ఆళ్లగడ్డ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకు ఏసీబీ అధికారులు రాగానే డాక్యుమెంట్ రైటర్లు పరారయ్యారు. ఏసీబీ అధికారులు కీలక దస్త్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఆళ్లగడ్డ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకు ఏసీబీ అధికారులు రాగానే డాక్యుమెంట్ రైటర్లు పరారయ్యారు. ఏసీబీ అధికారులు కీలక దస్త్రాలు స్వాధీనం చేసుకున్నారు.
Also Read
- Shreyas Iyer: మళ్లీ అదే తప్పు.. ఎంత చెప్పినా.. ఎవరు చెప్పినా మారని శ్రేయాస్ అయ్యర్ తీరు..
- T20 Team: సంజూ శాంసన్, తిలక్ వర్మకు దక్కని చోటు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంట్రీ..
- Europe Heatwave: బాబోయ్ ఎండలు.. కరిగిపోతున్న రహదారులు
- OTR: కరీంనగర్ కారు పార్టీలో అలజడి.. 'రెడ్ జోన్' వార్నింగ్తో లీడర్ల ఉరుకులు పరుగులు..
Also Read: Nigar Sultana: జూనియర్లను గదిలోకి పిలిచి.. బంగ్లా కెప్టెన్పై సీనియర్ పేసర్ ఆరోపణలు!
శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు కొనసాగుతున్నాయి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అధికారులు రికార్డ్స్ ను పరిశీలిస్తున్నారు. ఇప్పటివరకు కార్యాలయంలో అవినీతి జరిగినట్టు ఎటువంటి ఆధారాలు దొరకలేదు. తనిఖీలు కొనసాగుతున్నాయని అధికారులు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్టర్ కార్యాలయాలపై ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయని, అందులో భాగంగా ఇక్కడ కూడా తనిఖీ చేస్తున్నాం అని చెప్పారు.
తాజావార్తలు
-
Story Board : తెలంగాణలో బెంగాల్ తరహా రాజకీయం సాధ్యమా..?
-
Shreyas Iyer: మళ్లీ అదే తప్పు.. ఎంత చెప్పినా.. ఎవరు చెప్పినా మారని శ్రేయాస్ అయ్యర్ తీరు..
-
T20 Team: సంజూ శాంసన్, తిలక్ వర్మకు దక్కని చోటు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంట్రీ..
-
Harish Rao : రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్.. అసెంబ్లీలోనే కాదు ఎక్కడైనా చర్చకు సిద్ధం
-
Europe Heatwave: బాబోయ్ ఎండలు.. కరిగిపోతున్న రహదారులు
ట్రెండింగ్
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!