Bribe : లంచం తీసుకుంటూ పట్టుబడిన ఇద్దరు ఉద్యోగులు
ACB Raids on Warangal Municipal office
అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం కోసం ప్రజలను పీడిస్తున్న అధికారులు, ఉద్యోగులపై నిఘా పెట్టారు. ఈ నేపథ్యంలో జనం నుంచి లంచం పుచ్చుకుంటున్న వారిని వల పన్ని పట్టుకుంటున్నారు. ఇటీవల లంచం పుచ్చుకుంటుండగా భూపాలపల్లి జిల్లాలో ఒక పోలీస్ ఎస్సైని, వరంగల్ జిల్లాలో ఓ తహసిల్దార్ ను ఏసీబీ అధికారులు పట్టుకున్న విషయం తెలిసిందే. ఇవి మర్చిపోకముందే తాజాగా ఇద్దరు మున్సిపల్ శాఖ ఉద్యోగులు ఏసీబీ వలకు చిక్కారు. ఈరోజు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కు చెందిన కాశీబుగ్గ సర్కిల్ ఆఫీస్ లో ఏసీబీ అధికారులు దాడులు జరిపారు.
Also Read
Also Read : Gutta Sukender Reddy : రూపాయి విలువ పడిపోయిందే అందుకే..
లంచం తీసుకుంటున్న ఇద్దరు ఉద్యోగులను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఓ పని కోసం స్థానికుడి నుంచి సర్కిల్ ఆఫీస్ లో రూ.15 వేలు నగదు లంచం పుచ్చుకుంటుండగా రెవెన్యూ ఇన్ స్పెక్టర్ రబ్బాని, బిల్ కలెక్టర్ రంజిత్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. రబ్బాని, రంజిత్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాశీబుగ్గ సర్కిల్ ఆఫీసులో సోదాలు జరుపుతున్నట్లు తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అవినీతి ఆరోపణలకు కేరాఫ్ గా మారిన జీడబ్ల్యూఎంసీ ఆఫీస్ లో ఏసీబీ దాడులు కలకలం సృష్టించాయి.
తాజావార్తలు
-
LRS Fee : తెలంగాణ ప్రజలకు భారీ ఊరట.. LRS ఫీజుపై ప్రభుత్వం నిర్ణయం..!
-
Story Board : ఇరాన్ యుద్ధం.. గల్ఫ్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా?
-
Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..
-
Weight Loss Mistakes: బాబోయ్ బరువు తగ్గడానికి ఈ పని మాత్రం చస్తే చేయకండి..!
-
MI vs SRH: సెంచరీతో రఫ్ఫాడించిన ‘ర్యాన్ రికెల్టన్’.. SRH ముందు భారీ టార్గెట్.!
ట్రెండింగ్
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?