Bribe : లంచం తీసుకుంటూ పట్టుబడిన ఇద్దరు ఉద్యోగులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ACB Raids on Warangal Municipal office
అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం కోసం ప్రజలను పీడిస్తున్న అధికారులు, ఉద్యోగులపై నిఘా పెట్టారు. ఈ నేపథ్యంలో జనం నుంచి లంచం పుచ్చుకుంటున్న వారిని వల పన్ని పట్టుకుంటున్నారు. ఇటీవల లంచం పుచ్చుకుంటుండగా భూపాలపల్లి జిల్లాలో ఒక పోలీస్ ఎస్సైని, వరంగల్ జిల్లాలో ఓ తహసిల్దార్ ను ఏసీబీ అధికారులు పట్టుకున్న విషయం తెలిసిందే. ఇవి మర్చిపోకముందే తాజాగా ఇద్దరు మున్సిపల్ శాఖ ఉద్యోగులు ఏసీబీ వలకు చిక్కారు. ఈరోజు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కు చెందిన కాశీబుగ్గ సర్కిల్ ఆఫీస్ లో ఏసీబీ అధికారులు దాడులు జరిపారు.
Also Read
- Asim Munir: అసిమ్ మునీర్ టెహ్రాన్ పర్యటన ఆకస్మిక రద్దు.. కారణమిదే!
- Unknown Gunmen: పాకిస్తాన్లో ‘‘ధురంధరులు’’.. 5 ఏళ్లలో 26 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు హతం..
- Sergio Gor: అమెరికాలో భారత పెట్టుబడులు కొత్త శిఖరాలకు చేరుకుంటున్నాయి.. సెర్జియో గోర్ కీలక వ్యాఖ్యలు
- West Bengal: మదర్సాల్లో ‘వందేమాతరం’ తప్పనిసరి.. సువేందు సంచలన నిర్ణయం..
Also Read : Gutta Sukender Reddy : రూపాయి విలువ పడిపోయిందే అందుకే..
లంచం తీసుకుంటున్న ఇద్దరు ఉద్యోగులను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఓ పని కోసం స్థానికుడి నుంచి సర్కిల్ ఆఫీస్ లో రూ.15 వేలు నగదు లంచం పుచ్చుకుంటుండగా రెవెన్యూ ఇన్ స్పెక్టర్ రబ్బాని, బిల్ కలెక్టర్ రంజిత్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. రబ్బాని, రంజిత్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాశీబుగ్గ సర్కిల్ ఆఫీసులో సోదాలు జరుపుతున్నట్లు తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అవినీతి ఆరోపణలకు కేరాఫ్ గా మారిన జీడబ్ల్యూఎంసీ ఆఫీస్ లో ఏసీబీ దాడులు కలకలం సృష్టించాయి.
తాజావార్తలు
-
Mule Account Scam : బ్యాంక్ అకౌంట్ అమ్ముకుంటే లైఫ్ క్లోజ్.. పోలీసుల సీరియస్ వార్నింగ్..!
-
Asim Munir: అసిమ్ మునీర్ టెహ్రాన్ పర్యటన ఆకస్మిక రద్దు.. కారణమిదే!
-
Unknown Gunmen: పాకిస్తాన్లో ‘‘ధురంధరులు’’.. 5 ఏళ్లలో 26 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు హతం..
-
Sergio Gor: అమెరికాలో భారత పెట్టుబడులు కొత్త శిఖరాలకు చేరుకుంటున్నాయి.. సెర్జియో గోర్ కీలక వ్యాఖ్యలు
-
IPL Tickets Block: 39 వేల టికెట్లు.. నిమిషాల్లో మాయం.! ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్ వెనుక పెద్ద దందా.?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!