Delhi: దేశ రాజధాని ఢిల్లీని కమ్మేసిన దుమ్ము తుఫాన్.. దారి కనిపించక ప్రజలు ఇబ్బందులు
- దేశ రాజధాని ఢిల్లీని కమ్మేసిన దుమ్ము తుఫాన్
- దారి కనిపించక ప్రజలు ఇబ్బందులు
- ప్రజలు మాస్క్లు ధరించాలని సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం ఉదయం భారీ దుమ్ము తుఫాన్ కప్పేసింది. ఒక్కసారిగా ఉన్నట్టుండి వాతావరణం మారిపోయింది. నగరమంతా దుమ్ము తుఫాన్ కప్పేసింది. దీంతో ప్రజలు బయటకు రావడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దారి కనిపించక నానా తంటాలు పడ్డారు. రోడ్లపై ప్రయాణించే వాహనదారులైతే రహదారులు కనపించక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తక్కువ దూరం రోడ్డు కూడా స్పష్టంగా కనిపించని పరిస్థితి నెలకొంది. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. ముఖ్యంగా డ్రైవర్లు జాగ్రత్తగా వాహనాలు నడపాలని హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: IPS Couple Wedding: ఐపీఎస్ల పెళ్లితో ఎస్పీలో కుంపటి.. యూపీలో రాజకీయ దుమారం
Also Read
- August New Rules 2026: రేపటి నుంచి కొత్త రూల్స్ అమలు.. ప్రతి ఇంటి బడ్జెట్పై ప్రభావం చూపే 10 మార్పులు..
- Cauvery Dispute: కావేరీ వివాదం మళ్లీ వేడెక్కింది.. సీఎం విజయ్తో డీకే శివకుమార్ భేటీ వాయిదా
- Kulgam: కుల్గామ్లో ఉగ్ర దాడి.. వలస కార్మికుడు మృతి
- Saayoni Ghosh: పార్లమెంట్ను అడ్డుకోవడం భావ్యం కాదు.. టీఎంసీ రెబల్ సాయోని ఘోష్ ఆగ్రహం
ఢిల్లీని తీవ్ర తుఫాన్ ఆవహించనుందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. శుక్రవారం రాత్రి నుంచి శనివారం వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వార్నింగ్ ఇచ్చింది. రోజంతా మేఘావృతమై కొన్నిచోట్ల స్వల్ప జల్లులు పడే అవకాశముందని… మధ్యాహ్నం, సాయంత్రం సమయంలో గంటకు 20–30 కి.మీ వేగంతో గాలులు వీచి.. 40 కి.మీ వరకు ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
వర్ష సూచన..
ఏప్రిల్ 4 నుంచి 5 మధ్య ఒకటి లేదా రెండు సార్లు స్వల్ప నుంచి తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని… ఈ సమయంలో ఉరుములు, మెరుపులు ఉంటాయని.. గంటకు 40–50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఏప్రిల్ 6న మేఘావృతమై పెద్దగా వర్షం ఉండకపోవచ్చని పేర్కొంది. ఇక ఏప్రిల్ 7, 8 తేదీల్లో మళ్లీ స్వల్ప వర్షం, ఉరుములతో కూడిన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని.. ముఖ్యంగా దుమ్ము తుఫాన్ సమయంలో బయటకు వెళ్లేటప్పుడు మాస్క్లు ధరించాలని అధికారులు సూచించారు.
#WATCH | Delhi: The national capital experiences a severe dust storm that has significantly reduced visibility across the city.
(Visuals from Shanti Path) pic.twitter.com/OCCgsJN4JN
— ANI (@ANI) April 3, 2026
తాజావార్తలు
-
Off The Record: సొంత పార్టీ నేతలకు కేతిరెడ్డి బ్యాడ్ మార్నింగ్?
-
West Indies: వ్యక్తిగత కారణాలతోనే దూరం.. క్రికెట్ వెస్టిండీస్ ప్రకటనను గుర్తుచేసిన పేసర్..
-
August New Rules 2026: రేపటి నుంచి కొత్త రూల్స్ అమలు.. ప్రతి ఇంటి బడ్జెట్పై ప్రభావం చూపే 10 మార్పులు..
-
Tablet Launched: 10,100mAh బ్యాటరీ, కాగితం లాంటి డిస్ప్లే.. అదిరిపోయిన ఫీచర్స్..
-
Cauvery Dispute: కావేరీ వివాదం మళ్లీ వేడెక్కింది.. సీఎం విజయ్తో డీకే శివకుమార్ భేటీ వాయిదా
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!