Abhijeet Dipke: అమెరికా నుంచి ఢిల్లీ చేరుకున్న కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు.. నేటి నుంచి నిరసనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Abhijeet Dipke: నీట్ (NEET) పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్తో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నేటి నుంచి ఒక భారీ నిరసన ప్రదర్శన ప్రారంభం కానుంది. ఇందుకోసం ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే శనివారం ఉదయం సుమారు 7:35 గంటలకు అమెరికాలోని బోస్టన్ నుంచి ఢిల్లీలోని ఐజీఐ (IGI) ఎయిర్పోర్ట్కు చేరుకున్నాడు. తానే స్వయంగా జూన్ 6న భారత్కు తిరిగి వచ్చి ఈ శాంతియుత ఉద్యమాన్ని ప్రారంభిస్తానని ఈ వారం మొదట్లోనే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ల్యాండింగ్ అయిన వెంటనే అభిజీత్ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ ‘X’ లో స్పందిస్తూ.. “ల్యాండింగ్ పూర్తయింది.. జంతర్ మంతర్ వద్ద మీ అందరినీ కలవడానికి ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను. మీతో పాటు పుస్తకాన్ని, మన త్రివర్ణ పతాకాన్ని తీసుకురావడం మర్చిపోకండి. పోలీసులకు సానుభూతి, కృతజ్ఞతలకు చిహ్నంగా పూలను బహుకరించండి. ఈ ఉద్యమాన్ని మనం ప్రేమ, శాంతి మార్గాల్లో ముందుకు తీసుకెళ్లాలి” అని పోస్ట్ చేశాడు. కాగా, జూన్ 5వ తేదీ లోగా ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయకపోతే తాను సైతం ఈ నిరసనలో పాల్గొంటానని విద్యా సంస్కర్త, పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్చుక్ ఇదివరకే ప్రకటించారు.
మరోవైపు, ఈ నిరసన ప్రదర్శన కోసం ‘కాక్రోచ్ జనతా పార్టీ’ నుంచి తమకు ఇప్పటివరకు ఎలాంటి అనుమతి దరఖాస్తు అందలేదని ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు. అయినప్పటికీ, నిరసనలు జరిగే అవకాశం ఉన్నందున వారు న్యూఢిల్లీ ప్రాంతంలో 1,000 మందికి పైగా పోలీసులతో విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రదర్శనకారులతో ఎలాంటి ఘర్షణలకు దిగకుండా, చర్చల ద్వారానే పరిస్థితిని ప్రశాంతంగా ఉంచాలని పోలీసులు తమ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగానే సెంట్రల్ ఢిల్లీని 12 జోన్లుగా విభజించి, ప్రతి జోన్ బాధ్యతను ఒక డీసీపీ (DCP) ర్యాంక్ అధికారికి అప్పగించారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్లతో సహా పలువురు మంత్రుల నివాసాల వెలుపల భద్రతను కట్టుదిట్టం చేశారు. అన్ని జిల్లాల, యూనిట్ల డీసీపీలను అలర్ట్గా ఉండాలని ఢిల్లీ పోలీసులు ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ నిరసనల కారణంగా ట్రాఫిక్కు ఆటంకం కలిగే అవకాశం ఉండటంతో పాటు, శాంతిభద్రతల సవాళ్లు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
Also Read
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
- Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
- Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
- First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!