Sonia Gandhi: సోనియా గాంధీ పేరుతో ప్రజాపాలన అభయహస్తం దరఖాస్తు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ప్రజాపాలన అభయహస్తం కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తులు భారీగా వచ్చాయి. పథకాలు పొందేందుకు ప్రజలు ప్రజా పాలన కార్యక్రమానికి హజరై క్యూ లైన్ లలో నిలబడి మరీ దరఖాస్తులు ఇచ్చారు. డిసెంబర్ 28న మొదలైన ఈ ప్రొగ్రాం జనవరి 6వ తేదీన ముగిసింది. ఇప్పటి వరకు కోటి 24 లక్షల మంది ప్రజలు ఆరు గ్యారెంటీల కోసం అప్లయ్ చేసుకున్నారు. ఇంత సీరియస్ గా జరిగిన ఈ కార్యక్రమంలోనూ ఆకతాయిలు కొందరు తమ అతి తెలివి ప్రదర్శించారు.
Read Also: Uttarpradesh : దారుణం.. విద్యార్థిని కిడ్నాప్ చేసి, ముఖంపై మూత్రం పోసి, ఉమ్మి నాకించి..
Also Read
అయితే, ఏకంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పేరుతో ప్రజా పాలన అభయహస్తం కోసం దరఖాస్తు చేశారు. ఈ ఫాంలో కొడుకులుగా రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ ల పేర్లు రాసి ఉంచారు. ఇక, కూతురుగా కొండా సురేఖ, అల్లుడుగా శ్రీధర్ బాబు పేర్లు రాసి ప్రజాపాలనలో అభయహస్తంకు సదరు ఆకతాయిలు దరఖాస్తు ఇచ్చారు. ప్రస్తుతం ఈ దరఖాస్తుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ప్రభుత్వ పథకాల కోసం సామాన్యులు అందరు బాధపడుతుంటే.. ఆకతాయిలు మాత్రం ఇలాంటివి చేస్తున్నారు అని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Hero to Turn Director : హిట్టు కోసం తానే దర్శకత్వం చేసుకుంటున్న హీరో
-
Sai Pallavi: ‘రామాయణ’ టీమ్పై సాయిపల్లవి ఫ్యాన్స్ ఫైర్!
-
Dropped Catch: ఆ ఒక్క క్యాచ్ మిస్.! ఫలితం.. ఐపీఎల్ 2026 నుండి ముంబై ఇండియన్స్ అవుట్..
-
Box Office Clash : ఒకేరోజు రిలీజ్ అవుతున్న ‘ఎపిక్’ & ‘చెన్నై లవ్ స్టోరీ’
-
Urvil Patel: కోచ్ చెప్పాడు, కొట్టాను.. నయా సెన్సేషన్ ఉర్విల్ పటేల్ ఆసక్తికర వ్యాఖ్యలు!