Arvind Kejriwal: సెలవు తీసుకుని అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలు ప్రారంభించమంటున్న మాజీ సీఎం
- ఫిబ్రవరి 2025లో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు.
- కార్యకర్తలను ఉద్దేశించి.
- మాజీ సీఎం వ్యాఖ్యలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arvind Kejriwal: ఫిబ్రవరి 2025లో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం వీడియో సందేశం ద్వారా కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. రానున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు కార్యకర్తలు హృదయపూర్వకంగా సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధం కావడానికి కొన్ని నెలల పాటు సెలవులు తీసుకోవాలని అరవింద్ కేజ్రీవాల్ పార్టీ కార్యకర్తలను కోరారు. బయటి నుంచి వచ్చిన కార్యకర్తలు ఢిల్లీలోని తమ పరిచయస్తులు, బంధువుల స్థలాల్లో మకాం వేసి పార్టీ కోసం పబ్లిసిటీ వర్క్ చేయాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వేరే పార్టీలను గెలవనివ్వకూడదని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.
Read also: Vivo Y19s: సరసమైన ధరకు అదిరిపోయే ఫీచర్లతో గ్లోబల్ మార్కెట్లో ఫోన్ను లాంచ్ చేసిన వివో
Also Read
- USA: ఉద్యోగంలో చేరిన కొన్ని రోజులకే.. అమెరికాలో ఏపీకి చెందిన టెక్కీ మృతి..
- Public Wi-Fi Risks: ఎయిర్పోర్ట్, రైల్వేస్టేషన్, హోటళ్లు.. ఇలా పబ్లిక్ Wi-Fiకి కనెక్ట్ అవుతున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి
- Prakash Raj: "నా ఓటు తొలగించి, ఆట మొదలుపెట్టారు".. SIRపై ప్రకాష్ రాజ్ వార్నింగ్..
- AP Economic Growth: ఏపీకి గుడ్ న్యూస్.. ఎల్నినో ప్రభావం ఉన్నా ఆర్థిక వృద్ధిలో దూకుడు..
ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులతో చాలా కాలంగా మాట్లాడాలని అనుకుంటున్నానని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. జైలు నుంచి విడుదలయ్యాక మీతో మాట్లాడాలని చాలాసార్లు అనుకున్నాను. కొందరిని కలవలేకపోయినందుకు చింతిస్తున్నట్లు తెలిపారు. గత 2 సంవత్సరాలుగా అత్యంత క్లిష్టమైన దశను దాటారు. దేవుడు తన ప్రియమైన శిష్యులను పరీక్షిస్తాడు. భవిష్యత్తు సవాళ్ల కోసం మనల్ని బలపరచడానికి దేవుడు కష్టాలను పంపుతాడని, దేవుడు గొప్ప కష్టాలను పంపినప్పుడు, దేవుడు మిమ్మల్ని భవిష్యత్తులో గొప్ప పని చేయబోతున్నాడనే సంకేతం అని అన్నారు.
Read also: UPSC Exam Calendar 2025: సవరించిన పరీక్ష తేదీల క్యాలెండర్ విడుదల చేసిన యూపీఎస్సీ
అందుకే కష్టాలకు భయపడకుండా ధైర్యంగా పని చేయాలని, మా పార్టీ చాలా ధైర్యంగా, విజ్ఞతతో అన్ని కష్టాలను ఎదుర్కొందని తెలిపారు. మమ్మల్ని బద్దలు కొట్టి కొనుక్కోవాలని ఎన్నో ప్రయత్నాలు చేసినా అది జరగలేదని ఆయన ఎన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలంతా ఇప్పుడు దృఢంగా ఒక కుటుంబంగా మారారు. నేను కార్యకర్తలను కలిసినప్పుడు, వారి దృష్టిలో నాపై ఉన్న ప్రేమను చూసి నేను పొంగిపోయాను. మీరు నన్ను చాలా ప్రేమిస్తారని నాకు తెలుసు, నేను కూడా మిమ్మల్ని చాలా ప్రేమిస్తానని అరవింద్ కేజ్రీవాల్ కార్యకర్తలతో అన్నారు.
आम आदमी पार्टी के कार्यकर्ता ही पार्टी की सबसे बड़ी ताक़त हैं। सभी AAP कार्यकर्ताओं के नाम मेरा संदेश। https://t.co/rfeZ9lD8Nn
— Arvind Kejriwal (@ArvindKejriwal) November 8, 2024
తాజావార్తలు
-
USA: ఉద్యోగంలో చేరిన కొన్ని రోజులకే.. అమెరికాలో ఏపీకి చెందిన టెక్కీ మృతి..
-
Public Wi-Fi Risks: ఎయిర్పోర్ట్, రైల్వేస్టేషన్, హోటళ్లు.. ఇలా పబ్లిక్ Wi-Fiకి కనెక్ట్ అవుతున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి
-
Hero – Director : హిట్స్ కోసం కొత్త రూట్ వెతుకుతున్న హీరోలు, దర్శకులు
-
Vaibhav Sooryavanshi: మైదానంలోనే కాదు మార్కెట్లోనూ వైభవ్ జోరు.. 15 ఏళ్లకే కోట్లలో సంపాదన!
-
Prakash Raj: “నా ఓటు తొలగించి, ఆట మొదలుపెట్టారు”.. SIRపై ప్రకాష్ రాజ్ వార్నింగ్..
ట్రెండింగ్
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?