Aadi Srinivas : కేసీఆర్ వాస్తవాలను దాచి పెట్టాలనుకునే ప్రయత్నం చేశారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ రద్దు కోసం హైకోర్టుకు వెళ్లిన మాజీ సీఎం కేసీఆర్ కు చుక్కెదురైంది. అయితే.. హైకోర్టు పిటిషన్ ను కొట్టివేయడం కేసీఆర్ కు చెంప పెట్టులాందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రశేఖర్ రావు వాస్తవాలను దాచి పెట్టాలనుకునే ప్రయత్నం చేశారని, చట్టం ముందు అందరూ సమానమే అన్న విషయాన్ని కేసీఆర్ మరిచిపోయారన్నారు ఆది శ్రీనివాస్. రాజ్యాంగబద్దంగా ఏర్పాటు చేసిన కమిషన్ను రద్దు చేయాలనే సాహసం చేశాడని, చంద్రశేఖర్ రావు జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ముందు హాజరై వాస్తవాలు చెప్పాలన్నారు. తప్పు జరిగిందని విచారణలో తేలితే కేసీఆర్ శిక్ష అనుభవించాల్సిందేనని ఆయన వ్యాఖ్యానించారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విసిరిన సవాల్ పైనే ప్రభుత్వం విచారణ జరుపుతోందని, ఏ విచారణకైనా సిద్ధమని సవాల్ విసిరి పారిపోతారా.? అని ఆయన ప్రశ్నించారు. నరసింహారెడ్డి కమిషన్ ముందు కేసీఆర్ హాజరు కావాల్సిందేనని ఆది శ్రీనివాస్ అన్నారు. విచారణ నుంచి తప్పించుకునే కేసీఆర్ ప్రయత్నం బెడిసికొట్టిందని, భద్రాద్రి పవర్ ప్లాంట్ లో పిడుగులు పడకుండా టెక్నాలజీ ఎందుకు ఏర్పాటు చేయలేదు..? అని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ పదేళ్ల అవినీతి అక్రమాలు బయటపడుతున్నాయి…బాధ్యులపై చర్యలు తప్పవన్నారు.
అనంతరం మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ముందు హాజరు కావడానికి కేసీఆర్ ఎందుకు భయపడుతున్నారు..? అని, తక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేసే అవకాశం ఉన్నా కేసీఆర్ అధిక ధరకు కొన్నాడన్నారు. నరసింహారెడ్డి కమిషన్ ముందు నిజాలు బట్టబయలు అవుతాయనే కేసీఆర్ హాజరు కావడం లేదని, విద్యుత్ ఒప్పందాలలో తీసుకున్న కమిషన్ బయటకు వస్తుందని కేసీఆర్ భయపడుతున్నారన్నారు. సొంత లాభం లేనిదే కేసీఆర్ ఏ పనిచేయడు, ఎవరినీ కలవడని, కేసీఆర్ నిర్ణయాల వల్ల రాష్ట్రం 10 వేల కోట్లు నష్టపోయిందన్నారు. భద్రాద్రి పవర్ ప్లాంట్ ను సబ్ క్రిటికల్ టెక్నాలజీ తో నిర్మించడానికి కేసీఆర్ అనుమతి ఇచ్చాడు..ఇందులో అవినీతి బయటపడుతుందని, యాదాద్రి పవర్ ప్లాంట్ లో అనేక అవకతవకలు జరిగాయన్నారు. విద్యుత్ కేంద్రాల అవినీతి లో కేసీఆర్ రెడ్ హ్యాండెడ్ గా దొరికారని, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆరే నిర్ణయాలు తీసుకున్నారని విచారణ లో అధికారులు స్పష్టం చేశారన్నారు యెన్నం శ్రీనివాస్ రెడ్డి.
Also Read
- Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
- Nellore: వివాహేతర సంబంధం.. నిండు ప్రాణం బలి.!
- Kolkata Airport Mosque: ముగ్గురు సీఎంలు టచ్ చేయలేకపోయారు.. సువేందు రాకతో ఎయిర్పోర్టు మసీదు తరలింపు.!
- Israel-France: ఇజ్రాయెల్ మంత్రి బెన్-గ్విర్కు ఫ్రాన్స్ షాక్.. దేశంలోకి రాకుండా నిషేధం
జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ను కేసీఆర్ భయపెట్టే ప్రయత్నం చేశారని, పిచ్చి తుగ్లక్ పాలన చేస్తున్న ఇద్దరు ముఖ్యమంత్రులను ప్రజలు ఇంటికి పంపించారన్నారు. రెండు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులను ఓడించడం ద్వారా తెలుగువారంతా తెలివి కల్ల వారని నిరూపించారని, విద్యుత్ కొనుగోళ్లు, విద్యుత్ కేంద్రాల ఏర్పాటు లో అవినీతి పైన ప్రాథమిక ఆధారాలున్నాయన్నారు. తన నిజాయితీని నిరూపించుకునే అవకాశం మా ప్రభుత్వం కేసీఆర్ కి ఇచ్చిందని, అసెంబ్లీ ఆమోదంతోనే జస్టిస్ నరసింహారెడ్డి జ్యుడిషియల్ కమిషన్ విచారణ జరుగుతోందన్నారు. చట్టబద్ద కమిషన్ ముందుకు రానని కేసీఆర్ అనడం అంటే రాజకీయ పార్టీ గా ఉండే బీఆర్ఎస్ కు లేదని, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్న బీఆర్ఎస్ పార్టీని రద్దు చేయాలని ఎన్నికల సంఘం ముందుకు వెళ్తామని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ తుగ్లక్ నిర్ణయాల కారణంగా 30 వేల కోట్ల భారం తెలంగాణ ప్రజల పైన పడిందన్నారు.
తాజావార్తలు
-
Rahman : ‘పెద్ది’ ఆ కోరిక తీర్చింది!
-
Ram Charan: నా కెరీర్లోనే ‘పెద్ది’ నంబర్ వన్ చిత్రం
-
AP Film Corporation: ఏపీ ఫిల్మ్ కార్పొరేషన్ నూతన బోర్డు ఏర్పాటు
-
OTR : పాలమూరు కాంగ్రెస్లో రచ్చ రచ్చ.. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం కుమ్ములాట!
-
Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?