సార్వత్రిక ఎన్నికల వేళ దేశ రాజధాని ఢిల్లీలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. త్రిలోక్పురిలో పలువురు కొట్లాటకు దిగారు. ఈ ఘటనలో పలువురు కత్తిపోట్లకు గురయ్యారు. వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. కత్తిపోట్లకు గురైన ఓ యువకుడు మృతి చెందాడు. లాల్ బహదూర్ శాస్త్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు. మరో ఇద్దరు కూడా ఆ ప్రాంతంలో కత్తిపోట్లకు గురైనట్లు సమాచారం. వారిని కూడా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని పరిస్థితుల్ని సమీక్షిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు కత్తిపోట్లకు గల కారణాలపై వివరాలు సేకరిస్తున్నారు. ఆస్పత్రికి వచ్చిన పోలీసులు వివరాలు తెలుసుకుంటున్నారు. మరోవైపు యువకుడు ప్రాణాలు కోల్పోవడంతో ఆస్పత్రి దగ్గర బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
లాల్ బహదూర్ శాస్త్రి హాస్పిటల్ నుంచి తమకు సమాచారం అందిందని తూర్పు ఢిల్లీ డీసీపీ అపూర్వ గుప్తా తెలిపారు. ఆమె మీడియాతో మాట్లాడారు. కత్తిపోట్లలో గాయపడిన వ్యక్తి మరణించాడని చెప్పారు. మధ్యాహ్నం కూడా ఇద్దరు వ్యక్తులు కూడా ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం ఉందని చెప్పుకొచ్చారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
#WAṬCH | DCP East Delhi, Apoorva Gupta says, "We received information from Lal Bahadur Shastri Hospital that an injured man was admitted here and he succumbed to his injuries. We are verifying the facts and gathering more information. Two more people were admitted here in the… https://t.co/BPh0Hp9iRD pic.twitter.com/aS7AzXW3wR
— ANI (@ANI) April 17, 2024
#WATCH | Delhi: A youth died after allegedly being stabbed in Trilokpuri. He was admitted to Lal Bahadur Shastri Hospital where he succumbed to his injuries. Two others also were reportedly stabbed in the area.
Visuals from outside the hospital. pic.twitter.com/DhPvVRS8VS
— ANI (@ANI) April 17, 2024