Love Cheating: ప్రేమ పేరుతో యువతిని మోసం చేసి.. మోజు తీరాక..!
- ప్రేమ పేరుతో యువతిని మోసం చేసి పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిన యువకుడు
- యువతిని గర్భవతిని చేసి గర్భస్రావం చేయించిన యువకుడు
- యువతి తల్లిదండ్రులకు తెలిసిన విషయం
- పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేయడంతో యువకుడు పరారీ.
ప్రేమ పేరుతో ఓ యువతిని మోసం చేసి తీరా మోజు తీరిన తర్వాత పెళ్లి చేసుకోవడానికి ఆ ఘనుడు ముఖం చాటేశాడు. గర్భవతి అని తెలిసి మందుల ద్వారా గర్భస్రావం చేయించాడు. విషయం కాస్త యువతి తల్లిదండ్రులకు తెలియడంతో అసలు బాగోతం బయటపడింది. పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేయడంతో ఆ ఘనుడు పరారయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు శ్రీనివాసపురంలో చోటు చేసుకుంది. ఒక మైనర్ బాలికపై ప్రేమ పేరుతో గర్భవతిని చేసిన సతీష్ అనే యువకుడు పెళ్లి చేసుకోమని కోరితే ముఖం చాటేస్తున్నాడు.
Read Also: Minister Ram Prasad: ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలను జగన్ ఓర్వలేకపోతున్నాడు..
Also Read
- Jasprit Bumrah Poor Performance: బుమ్రా అత్యంత చెత్త రికార్డు.. కెరీర్లోనే.. ?
- West Bengal: బీజేపీ విజయం తర్వాత తెరుచుకున్న దుర్గా ఆలయం.. భక్తుల్లో ఆనందోత్సాహం
- Walking 10,000 Steps Daily: రోజుకు 10,000 అడుగులు నడవడం నిజంగా అవసరమా..? మోకాళ్లపై ప్రభావం ఏమిటి?
- Instagram Reel Leads to Poisoning: ప్రాణం మీదకు తెచ్చిన ఇన్స్టా రీల్ వంటకం.. నలుగురి పరిస్థితి విషమం..
కొవ్వూరు శ్రీనివాసపురంలో ఉన్న ఓ స్కూల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థినిని ప్రేమ పేరుతో ఇదే ప్రాంతానికి చెందిన దాసరి సతీష్ అనే యువకుడు ముగ్గులో దింపాడు. ప్రతిరోజు స్కూలుకు వెళుతున్న తమ కుమార్తె వెనుక సతీష్ వెంట పడుతున్నాడని తల్లిదండ్రులు గ్రహించారు. కుమార్తెను మందలించి తూర్పుగోదావరి జిల్లా కడియపులంకలో ఉన్న అమ్మమ్మ ఇంటికి పంపించారు. అక్కడ కూడా ఇద్దరు మధ్యన ప్రేమాయణం కొనసాగింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతితో కామ వాంఛ తీర్చుకున్నాడు. చివరకు గర్భవతిని చేశాడు.
Read Also: Stock Market: నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
మెడిసిన్స్ ద్వారా గర్భస్రావం కూడా చేయించాడు. యువతికి అధిక రక్తస్రావం కావడంతో తల్లిదండ్రులకు తెలిసి కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు తల్లిదండ్రులు తమ కుమార్తెను మోసం చేసిన యువకుడు సతీష్ని పెళ్లి చేసుకోమని అడిగారు. దీంతో.. సతీష్ ముఖం చాటేసాడు. ఈ క్రమంలో బాధితురాలు తల్లిదండ్రులు కొవ్వూరు పోలీసులను ఆశ్రయించారు. తల్లిదండ్రులు ఫిర్యాదు పై పోలీసులు సతీష్ పై కేసు నమోదు చేసి బాలిక మైనర్ కావడంతో యువకుడిపై ఫోక్స్ చట్టం కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం నిందితుడు సతీష్ పరారీలో ఉన్నాడు. ఇతన్ని పట్టుకోడానికి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
తాజావార్తలు
-
Jasprit Bumrah Poor Performance: బుమ్రా అత్యంత చెత్త రికార్డు.. కెరీర్లోనే.. ?
-
White House: లాక్డౌన్లో వైట్ హౌస్.. అమెరికా అధ్యక్షుడి నివాసం వద్ద గన్ ఫైర్.. రంగంలోకి సీక్రెట్ సర్వీస్!
-
Prabhas Fauj : ప్రభాస్ ఫౌజీ మూవీ షూటింగ్ కు వెళ్తున్న ప్రొడక్షన్ వాహనం కు యాక్సిడెంట్
-
West Bengal: బీజేపీ విజయం తర్వాత తెరుచుకున్న దుర్గా ఆలయం.. భక్తుల్లో ఆనందోత్సాహం
-
TVK : టీవీకే విజయకేతనం.. విజయ్ వెనుక అసలైన ‘చాణక్యుడు’ ఇతడే
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!