Crime: ప్రేమ వ్యవహారం? తండ్రి, కూతురిని చంపి.. తానూ ఆత్మహత్య చేసుకున్న యువకుడు..
- బీహార్లోని అరా రైల్వే స్టేషన్లో ఘటన
- తండ్రి, కూతురిని కాల్చిన యువకుడు
- తానూ ఆత్మహత్య చేసుకున్న యువకుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్లోని అరా రైల్వే స్టేషన్లో మంగళవారం సాయంత్రం ముగ్గురు మృతి చెందారు. 16 ఏళ్ల బాలికను, ఆమె తండ్రిని ఒక వ్యక్తి కాల్చి చంపాడు. దీని తర్వాత నిందితుడు కూడా తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. అరా రైల్వే స్టేషన్లోని ప్లాట్ఫామ్ నంబర్ 2, ప్లాట్ఫామ్ నంబర్ 3 లను కలిపే ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై ఈ సంఘటన జరిగింది. కాల్పులు జరిపిన వ్యక్తిని అమన్ కుమార్గా గుర్తించినట్లు భోజ్పూర్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) రాజ్ తెలిపారు. ఈ సంఘటన తర్వాత, రైల్వే స్టేషన్లో గందరగోళం నెలకొంది. మృతులందరూ ఉద్వంత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వారేనని చెబుతున్నారు.
READ MORE: Minister Komatireddy: ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం.. కేసీఆరే కాదు, ఎవరు సలహాలిచ్చిన స్వీకరిస్తాం..
Also Read
“ఆ వ్యక్తి అతను మొదట అమ్మాయిని, తరువాత ఆమె తండ్రిని కాల్చాడు, ఆ తర్వాత తనను తాను కాల్చుకున్నాడు. ఆ ముగ్గురూ అక్కడికక్కడే మరణించారు.’ అని ఎస్పీ వెల్లడించారు. హత్య వెనుక గల కారణాలు ఇంకా తెలియలేదని ఎస్పీ తెలిపారు. అయితే, ఇది ప్రేమ వ్యవహారం అని పలువురు అభిప్రాయపడుతున్నారు. పోలీసులు ముగ్గురి మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చనిపోయిన తండ్రి అనీల్ సింగ్, మైనర్ కూతురు జియా కుమారి అని ఎస్పీ వివరించారు. ఈ కేసుపై దర్యాప్తు ప్రారంభించామని, ఫోరెన్సిక్ నిపుణులు సంఘటన స్థలం నుంచి ఆధారాలు సేకరించారని ఎస్పీ తెలిపారు. ఆ అమ్మాయి ఢిల్లీ వెళ్లే రైలు ఎక్కడానికి స్టేషన్కు వచ్చిందని తెలిసింది.
READ MORE: Off The Record : డైలమాలో బీఆర్ఎస్ నేతలు..సిల్వర్ జూబ్లీ బహిరంగ సభపై గందరగోళం
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!