Team India: టీమిండియాలో కీలక మార్పులకు శ్రీకారం.. అప్పుడే ఒక వికెట్ డౌన్!
- టీమిండియాలో కీలక మార్పులకు శ్రీకారం
- దిలీప్ కాంట్రాక్టును పొడిగించే అవకాశాలు లేవు
- జింబాబ్వే పర్యటనకు వెళ్లని ఫీల్డింగ్ కోచ్ టీ దిలీప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BCCI to Move On From T Dilip: టీమిండియా సహాయ సిబ్బందిలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. భారత జట్టు ఫీల్డింగ్ కోచ్ టీ దిలీప్ కాంట్రాక్టును బీసీసీఐ మరోసారి పొడిగించే అవకాశాలు లేవని సమాచారం. ఇంగ్లండ్తో జరిగిన వైట్బాల్ సిరీస్ అనంతరం జింబాబ్వే పర్యటనకు వెళ్లే భారత జట్టుతో ఆయన ప్రయాణించలేదని తెలుస్తోంది. ఇటీవల కాలంలో భారత జట్టు ఫీల్డింగ్ ప్రమాణాలు గణనీయంగా పడిపోవడంతో ఫీల్డింగ్ విభాగంలో కొత్త మార్పులు తీసుకురావాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం.
మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ హయాంలో భారత జట్టు ఫీల్డింగ్ కోచ్గా టీ దిలీప్ బాధ్యతలు చేపట్టాడు. డ్రెస్సింగ్ రూమ్లో ఆటగాళ్లతో సన్నిహితంగా మెలుగుతూ మంచి గుర్తింపు సంపాదించాడు. ప్రతి మ్యాచ్ అనంతరం అత్యుత్తమ ఫీల్డర్కు ‘బెస్ట్ ఫీల్డర్ మెడల్’ అందించే ప్రత్యేక సంప్రదాయాన్ని కూడా ఆయనే ప్రారంభించాడు. 2024 టీ20 ప్రపంచ కప్ విజయం తర్వాత ద్రవిడ్ సహా విక్రమ్ రాథోడ్, పరాస్ మాంబ్రే తమ పదవుల నుంచి తప్పుకున్నప్పటికీ.. దిలీప్ మాత్రం కొనసాగాడు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఆయనకు మరో ఏడాది కాంట్రాక్ట్ ఇచ్చిన బీసీసీఐ.. ఇప్పుడు మళ్లీ పొడిగించే అవకాశం లేదని సమాచారం.
Also Read
- Cricket Record: 47 ఏళ్లకు అరంగేట్రం.. 51 ఏళ్ల వయసులో ప్రపంచ రికార్డు.. క్రికెట్లో 96 ఏళ్ల రికార్డు బద్దలు..
- Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వైభవ్ బౌలింగ్కు అంతా ఫిదా.. ఇషాన్ కిషన్కు తెలియని సీక్రెట్ ఇదే..!
- Anaya Bangar: ‘వ్యతిరేకించే ముందు తెలుసుకోండి’.. సౌతాఫ్రికా ఆల్రౌండర్కు ఘాటుగా బదులిచ్చిన అనయా బంగర్.!
- Suryakumar Yadav: కెప్టెన్గా విజయాల పరంపర.. కట్ చేస్తే జట్టులో చోటే లేదు.. తొలిసారి స్పందించిన సూర్య.. సంచలన వ్యాఖ్యలు
టీ దిలీప్ కాంట్రాక్ట్ గడువు ముగిసిపోయిందని క్రీడా జర్నలిస్ట్ రోహిత్ జుగ్లాన్ పేర్కొన్నాడు. జింబాబ్వే పర్యటనకు ఆయన భారత జట్టుతో వెళ్లడం లేదని, మరోసారి కాంట్రాక్ట్ పొడిగించే అవకాశాలు దాదాపు లేవని రాసుకొచ్చాడు. గత కొంతకాలంగా టీమిండియా ఫీల్డింగ్ తీవ్ర విమర్శలకు గురవుతోంది. 2026 టీ20 ప్రపంచ కప్ను గెలిచినప్పటికీ టోర్నీలో భారత్ ఏకంగా 15 క్యాచ్లు జారవిడిచింది. టోర్నీలో మనోళ్లే అత్యధిక క్యాచ్లు డ్రాప్ చేశారు. అంతేకాదు భారత జట్టు క్యాచ్ల సక్సెస్ రేట్ 72 శాతం మాత్రమే నమోదైంది. ఇది కూడా టోర్నీలోనే అత్యల్పం. ఈ సమస్యలు 2025 ఆసియా కప్ నుంచే ప్రారంభమై.. ఇంగ్లండ్ పర్యటనలో కూడా కొనసాగాయి.
ఇంగ్లండ్ పర్యటన అనంతరం భారత జట్టు మూడు టీ20ల సిరీస్ కోసం జింబాబ్వేకు చేరుకుంది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్కు విశ్రాంతి ఇవ్వడంతో ఈ పర్యటనలో వీవీఎస్ లక్ష్మణ్ తాత్కాలిక ప్రధాన కోచ్గా బాధ్యతలు నిర్వహించనున్నాడు. శ్రేయస్ అయ్యర్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించగా.. తిలక్ వర్మ వైస్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ గాయం నుంచి కోలుకుని పునరాగమనం చేశాడు. అశోక్ శర్మ, యశ్ ఠాకూర్లకు తొలిసారి భారత జట్టులో చోటు దక్కింది. జూలై 23, 25, 26 తేదీల్లో హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగే మూడు టీ20లు జరగనున్నాయి.
తాజావార్తలు
-
Metro Rail: ఓల్డ్ సిటీలో ఊపందుకున్న మెట్రో రైలు పనులు.. అధికారులకు ఎండీ కీలక ఆదేశాలు..
-
UP Floods: యూపీని ముంచెత్తిన వరదలు.. మధ్యప్రదేశ్తో తెగిన సంబంధాలు
-
TG EAPCET: తెలంగాణఎప్సెట్ (Bi.P.C) కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే..
-
Uttar Pradesh survey: సీఎం యోగి ఇష్టమే కానీ.. యూపీ ఎన్నికల వేళ కీలక సర్వే
-
GST Council: సెప్టెంబర్ 12న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం.. కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!