Atrocious: కదులుతున్న రైలులో మహిళపై అత్యాచారం.. మధ్యప్రదేశ్లో ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రదేశ్లోని రేవాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కదులుతున్న రైలులో ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు కామాంధుడు. ఈ ఘటనపై మహిళ ఏడుస్తూ వచ్చి జీఆర్పీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో.. పోలీసులు వెంటనే చర్యలు తీసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో నిందితుడిపై మహిళ తీవ్ర ఆరోపణలు చేసింది. తాను రైలులో వస్తువులు విక్రయిస్తానని, తాను రైలు ఎక్కినప్పుడు.. బోగీ మొత్తం ఖాళీగా ఉందని మహిళ తెలిపింది. దీన్ని అవకాశంగా తీసుకున్న నిందితుడు తలుపులన్నీ మూసి వెనుక నుంచి వచ్చి అత్యాచారానికి పాల్పడినట్లు మహిళ పేర్కొంది.
ఈ సంఘటన కట్ని సమీపంలోని పకారియా రైల్వే స్టేషన్ నుండి నివేదించబడింది. కట్నిలోని తన సోదరి ఇంటికి వచ్చినట్లు ఆ మహిళ పోలీసులకు తెలిపింది. అయితే.. తిరిగి తన గ్రామం సత్నాకు వెళ్తుండగా.. DMU రైలు ఎక్కినట్లు తెలపింది. కట్నీ నుంచి పకారియా రైల్వే స్టేషన్కు రైలు చేరుకోగానే చాలాసేపు ఆగింది. దీంతో బాధితురాలు.. రైలు దిగి వెళ్తుండగా, చాలా సేపటి తర్వాత సత్నాకు వెళ్ళే మరో రైలు వచ్చింది. దీంతో ఆమే ఆ రైలు ఎక్కింది.
Also Read
Read Also: Jamal Kudu: సోషల్ మీడియాను ఒక ఊపు ఊపిన జమాల్ కుడు సాంగ్ ఎక్కడిదో తెలుసా?
అయితే రైలు ఎక్కిన తర్వాత ఒంటరిగా ఉన్న మహిళను చూసి కమలేష్ కుష్వాహ అనే వ్యాపారి ఆమేపై కన్నేశాడు. బోగీ మొత్తం ఖాళీగా ఉందన్న విషయాన్ని అవకాశంగా తీసుకుని ముందుగా తలుపులన్నీ మూసేసి ఆ మహిళపై బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. బోగీ అంతా ఖాళీగా ఉండడంతో మహిళ అరుపులు ఎవరికీ వినిపించలేదు. ఆ తర్వాత నిందితుడు మహిళను సాత్నా స్టేషన్లో దించి మళ్లీ బోగీ తలుపులు మూసుకున్నాడు. ఈ ఘటనపై బాధిత మహిళ.. పోలీసులను ఆశ్రయించడంతో.. వారు వెంటనే నిందితుడిని పట్టుకునేందుకు రైలును వెంబడించారు.
ఈ క్రమంలో రైల్వే పోలీసులు.. కైమా రైల్వే స్టేషన్కు చేరుకుని నిందితుడు ఉన్న బోగీని తెరవడానికి ప్రయత్నించారు. కాని నిందితుడు తలుపులు తీయకుండా ఉంచాడు. దీంతో రైలు స్టార్ట్ కావడంతో నిందితుడు పట్టుబడలేదు. ఆ తర్వాత GRP పోలీసులు మళ్లీ రైలును వెంబడించి.. రేవా రైల్వే స్టేషన్లో తలుపును తెరిచేందుకు సాంకేతిక సిబ్బందిని రప్పించి నిందితుడిని పట్టుకున్నారు. ఆ తర్వాత.. అక్కడికి చేరుకున్న బాధిత మహిళ నిందితుడిని గుర్తించింది. నిందితుడు కమలేష్ కుష్వాహ, యూపీలోని బండా నివాసిగా గుర్తించారు.
తాజావార్తలు
-
Temple Incident : అమ్మవారి గుడిలో అర్చకుడి దారుణం.. బయట తాళం.. లోపల వికృత చేష్టలు
-
IND vs SL 2nd Test Day 4: కొలంబోలో వర్షం కారణంగా ముందుగానే ఆట ముగింపు.. ఎవరిది పైచేయి?
-
Shiraz Mehdi: దిల్ రాజు సహా ఫిల్మ్ ఛాంబర్కు దర్శకుడు లీగల్ నోటీసులు, సీఎం రేవంత్ కు ఫిర్యాదు!
-
Kitchen Tips: అల్లం తొక్క క్షణాల్లో ఊడిపోవాలంటే ఈ టెక్నిక్ పాటించండి
-
IND vs SL: జడేజా ఖాతాలో చెత్త రికార్డు.. అందులో నంబర్ వన్!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..