Atrocious: కదులుతున్న రైలులో మహిళపై అత్యాచారం.. మధ్యప్రదేశ్లో ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రదేశ్లోని రేవాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కదులుతున్న రైలులో ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు కామాంధుడు. ఈ ఘటనపై మహిళ ఏడుస్తూ వచ్చి జీఆర్పీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో.. పోలీసులు వెంటనే చర్యలు తీసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో నిందితుడిపై మహిళ తీవ్ర ఆరోపణలు చేసింది. తాను రైలులో వస్తువులు విక్రయిస్తానని, తాను రైలు ఎక్కినప్పుడు.. బోగీ మొత్తం ఖాళీగా ఉందని మహిళ తెలిపింది. దీన్ని అవకాశంగా తీసుకున్న నిందితుడు తలుపులన్నీ మూసి వెనుక నుంచి వచ్చి అత్యాచారానికి పాల్పడినట్లు మహిళ పేర్కొంది.
ఈ సంఘటన కట్ని సమీపంలోని పకారియా రైల్వే స్టేషన్ నుండి నివేదించబడింది. కట్నిలోని తన సోదరి ఇంటికి వచ్చినట్లు ఆ మహిళ పోలీసులకు తెలిపింది. అయితే.. తిరిగి తన గ్రామం సత్నాకు వెళ్తుండగా.. DMU రైలు ఎక్కినట్లు తెలపింది. కట్నీ నుంచి పకారియా రైల్వే స్టేషన్కు రైలు చేరుకోగానే చాలాసేపు ఆగింది. దీంతో బాధితురాలు.. రైలు దిగి వెళ్తుండగా, చాలా సేపటి తర్వాత సత్నాకు వెళ్ళే మరో రైలు వచ్చింది. దీంతో ఆమే ఆ రైలు ఎక్కింది.
Also Read
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
- Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
Read Also: Jamal Kudu: సోషల్ మీడియాను ఒక ఊపు ఊపిన జమాల్ కుడు సాంగ్ ఎక్కడిదో తెలుసా?
అయితే రైలు ఎక్కిన తర్వాత ఒంటరిగా ఉన్న మహిళను చూసి కమలేష్ కుష్వాహ అనే వ్యాపారి ఆమేపై కన్నేశాడు. బోగీ మొత్తం ఖాళీగా ఉందన్న విషయాన్ని అవకాశంగా తీసుకుని ముందుగా తలుపులన్నీ మూసేసి ఆ మహిళపై బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. బోగీ అంతా ఖాళీగా ఉండడంతో మహిళ అరుపులు ఎవరికీ వినిపించలేదు. ఆ తర్వాత నిందితుడు మహిళను సాత్నా స్టేషన్లో దించి మళ్లీ బోగీ తలుపులు మూసుకున్నాడు. ఈ ఘటనపై బాధిత మహిళ.. పోలీసులను ఆశ్రయించడంతో.. వారు వెంటనే నిందితుడిని పట్టుకునేందుకు రైలును వెంబడించారు.
ఈ క్రమంలో రైల్వే పోలీసులు.. కైమా రైల్వే స్టేషన్కు చేరుకుని నిందితుడు ఉన్న బోగీని తెరవడానికి ప్రయత్నించారు. కాని నిందితుడు తలుపులు తీయకుండా ఉంచాడు. దీంతో రైలు స్టార్ట్ కావడంతో నిందితుడు పట్టుబడలేదు. ఆ తర్వాత GRP పోలీసులు మళ్లీ రైలును వెంబడించి.. రేవా రైల్వే స్టేషన్లో తలుపును తెరిచేందుకు సాంకేతిక సిబ్బందిని రప్పించి నిందితుడిని పట్టుకున్నారు. ఆ తర్వాత.. అక్కడికి చేరుకున్న బాధిత మహిళ నిందితుడిని గుర్తించింది. నిందితుడు కమలేష్ కుష్వాహ, యూపీలోని బండా నివాసిగా గుర్తించారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!