Atrocious: కదులుతున్న రైలులో మహిళపై అత్యాచారం.. మధ్యప్రదేశ్లో ఘటన
మధ్యప్రదేశ్లోని రేవాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కదులుతున్న రైలులో ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు కామాంధుడు. ఈ ఘటనపై మహిళ ఏడుస్తూ వచ్చి జీఆర్పీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో.. పోలీసులు వెంటనే చర్యలు తీసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో నిందితుడిపై మహిళ తీవ్ర ఆరోపణలు చేసింది. తాను రైలులో వస్తువులు విక్రయిస్తానని, తాను రైలు ఎక్కినప్పుడు.. బోగీ మొత్తం ఖాళీగా ఉందని మహిళ తెలిపింది. దీన్ని అవకాశంగా తీసుకున్న నిందితుడు తలుపులన్నీ మూసి వెనుక నుంచి వచ్చి అత్యాచారానికి పాల్పడినట్లు మహిళ పేర్కొంది.
ఈ సంఘటన కట్ని సమీపంలోని పకారియా రైల్వే స్టేషన్ నుండి నివేదించబడింది. కట్నిలోని తన సోదరి ఇంటికి వచ్చినట్లు ఆ మహిళ పోలీసులకు తెలిపింది. అయితే.. తిరిగి తన గ్రామం సత్నాకు వెళ్తుండగా.. DMU రైలు ఎక్కినట్లు తెలపింది. కట్నీ నుంచి పకారియా రైల్వే స్టేషన్కు రైలు చేరుకోగానే చాలాసేపు ఆగింది. దీంతో బాధితురాలు.. రైలు దిగి వెళ్తుండగా, చాలా సేపటి తర్వాత సత్నాకు వెళ్ళే మరో రైలు వచ్చింది. దీంతో ఆమే ఆ రైలు ఎక్కింది.
Also Read
- Tamilnadu Elections: తమిళనాడులో ఓటేసిన సినీ, రాజకీయ ప్రముఖులు
- Petrol, Diesel Price Hike: ఎలక్షన్ తర్వాత పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్రం క్లారిటీ.. పాత రికార్డులు గుర్తు చేస్తూ..
- Nandre Burger: కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన.. రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ కు జరిమానా, డీమెరిట్ పాయింట్ కూడా.!
- Bengal Tiger: రూటు మార్చిన బెంగాల్ టైగర్.. మళ్లీ తూర్పుగోదావరి జిల్లాలోకి ఎంట్రీ!
Read Also: Jamal Kudu: సోషల్ మీడియాను ఒక ఊపు ఊపిన జమాల్ కుడు సాంగ్ ఎక్కడిదో తెలుసా?
అయితే రైలు ఎక్కిన తర్వాత ఒంటరిగా ఉన్న మహిళను చూసి కమలేష్ కుష్వాహ అనే వ్యాపారి ఆమేపై కన్నేశాడు. బోగీ మొత్తం ఖాళీగా ఉందన్న విషయాన్ని అవకాశంగా తీసుకుని ముందుగా తలుపులన్నీ మూసేసి ఆ మహిళపై బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. బోగీ అంతా ఖాళీగా ఉండడంతో మహిళ అరుపులు ఎవరికీ వినిపించలేదు. ఆ తర్వాత నిందితుడు మహిళను సాత్నా స్టేషన్లో దించి మళ్లీ బోగీ తలుపులు మూసుకున్నాడు. ఈ ఘటనపై బాధిత మహిళ.. పోలీసులను ఆశ్రయించడంతో.. వారు వెంటనే నిందితుడిని పట్టుకునేందుకు రైలును వెంబడించారు.
ఈ క్రమంలో రైల్వే పోలీసులు.. కైమా రైల్వే స్టేషన్కు చేరుకుని నిందితుడు ఉన్న బోగీని తెరవడానికి ప్రయత్నించారు. కాని నిందితుడు తలుపులు తీయకుండా ఉంచాడు. దీంతో రైలు స్టార్ట్ కావడంతో నిందితుడు పట్టుబడలేదు. ఆ తర్వాత GRP పోలీసులు మళ్లీ రైలును వెంబడించి.. రేవా రైల్వే స్టేషన్లో తలుపును తెరిచేందుకు సాంకేతిక సిబ్బందిని రప్పించి నిందితుడిని పట్టుకున్నారు. ఆ తర్వాత.. అక్కడికి చేరుకున్న బాధిత మహిళ నిందితుడిని గుర్తించింది. నిందితుడు కమలేష్ కుష్వాహ, యూపీలోని బండా నివాసిగా గుర్తించారు.
తాజావార్తలు
-
Tamilnadu Elections: తమిళనాడులో ఓటేసిన సినీ, రాజకీయ ప్రముఖులు
-
Petrol, Diesel Price Hike: ఎలక్షన్ తర్వాత పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్రం క్లారిటీ.. పాత రికార్డులు గుర్తు చేస్తూ..
-
Nandre Burger: కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన.. రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ కు జరిమానా, డీమెరిట్ పాయింట్ కూడా.!
-
Bengal Tiger: రూటు మార్చిన బెంగాల్ టైగర్.. మళ్లీ తూర్పుగోదావరి జిల్లాలోకి ఎంట్రీ!
-
Tollywood – Bollywood : బాలీవుడ్ హీరోలతో టాలీవుడ్ డైరెక్టర్స్
ట్రెండింగ్
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?