Suicide: పెళ్లై 7 ఏళ్లు.. పిల్లలు పుట్టడం లేదని మనస్తాపంతో ఆత్మహత్య
- యూపీలోని ఎటావాలో విషాదం
- పెళ్లయి ఏడేళ్లయినా తల్లి కావడం లేదని ఓ మహిళ ఆత్మహత్య.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూపీలోని ఎటావాలో విషాదం చోటు చేసుకుంది. పెళ్లయి ఏడేళ్లయినా తల్లి కావడం లేదని ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. అయితే.. తన అత్తమామలు, భర్త కూడా పిల్లలు కావడం లేదని కొట్టి హింసించే వారని మహిళ తల్లిదండ్రులు ఆరోపించారు. పోస్టుమార్టం నివేదికలో మహిళ ఉరివేసుకుని చనిపోయిందని తేలింది. ఆమెను హత్య చేశారని తల్లిదండ్రులు చెబుతున్నారు. మరోవైపు.. ఊరి బయట మహిళ రక్తంతో తడిసిన బట్టలు లభించడం చర్చనీయాంశమైంది.
Read Also: Prashanth Reddy: ఢిల్లీ బాసులను ప్రసన్నం చేసుకోవడానికి.. తెలంగాణ ఆత్మను తాకట్టు పెట్టారు
Also Read
- Team India Squad: ఆఫ్ఘనిస్తాన్తో టీ20 సిరీస్కు భారత్ జట్టు ప్రకటన.. కొత్త వాళ్లకు చోటు..
- RBI New Loan Rules: లోన్ తీసుకునేవారికి RBI గుడ్న్యూస్.. కొత్త నిబంధనలతో భారీ మార్పులు
- Pakistan Cricket Board: పాక్ క్రికెట్లో మరో సంక్షోభం.. సెలెక్టర్ పదవికి మిస్బా-ఉల్-హక్ గుడ్బై
- SCO Summit: మోడీ ఫొటో తొలగింపుపై పాక్ యూ-టర్న్.. మళ్లీ ఏం చేసిందంటే..!
వివరాల్లోకి వెళ్తే.. శనివారం రాత్రి చౌబియా పోలీస్ స్టేషన్ పరిధిలోని మోహన్పూర్ గ్రామంలో సోమన్ (30) మృతదేహం ఇంటి లోపల మంచంపై పడి ఉంది. ఈ విషయాన్ని మృతురాలి భర్త అత్తమామలకు తెలియజేశాడు. సమాచారం అందుకున్న మహిళ తల్లిదండ్రులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. అయితే.. ఇంట్లో సోనమ్ అత్త మాత్రమే ఉంది. మహిళ తల్లిదండ్రులు వచ్చేలోపు భర్త ఇంటి నుండి పరారయ్యాడు. కాగా.. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఫోరెన్సిక్ బృందం పరిశీలించారు. అనంతరం.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరోవైపు.. పోలీసులు అత్తను విచారించగా.. సోనమ్ను కొట్టామని, దాని వల్లే ఆమె చనిపోయిందని చెప్పింది. ఈ ఘటనపై పోలీసులు మాట్లాడుతూ.. మహిళ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని.. తల్లి కావడంలేదని మనస్తాపంతో సూసైడ్ చేసుకుందని తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోందని చెప్పారు.
Read Also: Janasena: షాకింగ్: జానీ మాస్టర్ కు జనసేన కీలక ఆదేశాలు!
మృతురాలు సోనమ్కి పెళ్లయి ఏడేళ్లు అయింది. అప్పటి నుంచి ఆమె తల్లి కాలేకపోయింది. తల్లి కావడం కోసమని ఆమె తల్లిదండ్రులు, అత్తమామలు పలు ఆస్పత్రుల్లో చూపించారు. ఆ తర్వాత కూడా ఎలాంటి ప్రయోజనం చేకూరలేదు. దీంతో.. కుటుంబ సభ్యుల నుండి, సమాజం నుండి తనకు వచ్చిన అవమానాలతో మహిళ ఇబ్బంది పడేది. ఈ క్రమంలోనే.. అత్తమామలు తనను చిత్రహింసలకు గురిచేశారని మృతురాలి సోదరుడు ఆరోపించాడు. తన సోదరిని అత్తమామలు కొట్టి చంపారని, అనంతరం రక్తంతో తడిసిన బట్టలను గోనె సంచిలో వేసి చెరువు ఒడ్డున పడవేశారని తెలిపాడు.
తాజావార్తలు
-
Team India Squad: ఆఫ్ఘనిస్తాన్తో టీ20 సిరీస్కు భారత్ జట్టు ప్రకటన.. కొత్త వాళ్లకు చోటు..
-
RBI New Loan Rules: లోన్ తీసుకునేవారికి RBI గుడ్న్యూస్.. కొత్త నిబంధనలతో భారీ మార్పులు
-
Pakistan Cricket Board: పాక్ క్రికెట్లో మరో సంక్షోభం.. సెలెక్టర్ పదవికి మిస్బా-ఉల్-హక్ గుడ్బై
-
SCO Summit: మోడీ ఫొటో తొలగింపుపై పాక్ యూ-టర్న్.. మళ్లీ ఏం చేసిందంటే..!
-
Duleep Trophy: దులీప్ ట్రోఫీ ఫైనల్కు దూసుకెళ్లిన ఈస్ట్ జోన్.. 4 వికెట్ల తేడాతో గెలుపు..
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!