Suicide: పెళ్లై 7 ఏళ్లు.. పిల్లలు పుట్టడం లేదని మనస్తాపంతో ఆత్మహత్య
- యూపీలోని ఎటావాలో విషాదం
- పెళ్లయి ఏడేళ్లయినా తల్లి కావడం లేదని ఓ మహిళ ఆత్మహత్య.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూపీలోని ఎటావాలో విషాదం చోటు చేసుకుంది. పెళ్లయి ఏడేళ్లయినా తల్లి కావడం లేదని ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. అయితే.. తన అత్తమామలు, భర్త కూడా పిల్లలు కావడం లేదని కొట్టి హింసించే వారని మహిళ తల్లిదండ్రులు ఆరోపించారు. పోస్టుమార్టం నివేదికలో మహిళ ఉరివేసుకుని చనిపోయిందని తేలింది. ఆమెను హత్య చేశారని తల్లిదండ్రులు చెబుతున్నారు. మరోవైపు.. ఊరి బయట మహిళ రక్తంతో తడిసిన బట్టలు లభించడం చర్చనీయాంశమైంది.
Read Also: Prashanth Reddy: ఢిల్లీ బాసులను ప్రసన్నం చేసుకోవడానికి.. తెలంగాణ ఆత్మను తాకట్టు పెట్టారు
Also Read
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
- Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
- Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
- First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
వివరాల్లోకి వెళ్తే.. శనివారం రాత్రి చౌబియా పోలీస్ స్టేషన్ పరిధిలోని మోహన్పూర్ గ్రామంలో సోమన్ (30) మృతదేహం ఇంటి లోపల మంచంపై పడి ఉంది. ఈ విషయాన్ని మృతురాలి భర్త అత్తమామలకు తెలియజేశాడు. సమాచారం అందుకున్న మహిళ తల్లిదండ్రులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. అయితే.. ఇంట్లో సోనమ్ అత్త మాత్రమే ఉంది. మహిళ తల్లిదండ్రులు వచ్చేలోపు భర్త ఇంటి నుండి పరారయ్యాడు. కాగా.. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఫోరెన్సిక్ బృందం పరిశీలించారు. అనంతరం.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరోవైపు.. పోలీసులు అత్తను విచారించగా.. సోనమ్ను కొట్టామని, దాని వల్లే ఆమె చనిపోయిందని చెప్పింది. ఈ ఘటనపై పోలీసులు మాట్లాడుతూ.. మహిళ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని.. తల్లి కావడంలేదని మనస్తాపంతో సూసైడ్ చేసుకుందని తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోందని చెప్పారు.
Read Also: Janasena: షాకింగ్: జానీ మాస్టర్ కు జనసేన కీలక ఆదేశాలు!
మృతురాలు సోనమ్కి పెళ్లయి ఏడేళ్లు అయింది. అప్పటి నుంచి ఆమె తల్లి కాలేకపోయింది. తల్లి కావడం కోసమని ఆమె తల్లిదండ్రులు, అత్తమామలు పలు ఆస్పత్రుల్లో చూపించారు. ఆ తర్వాత కూడా ఎలాంటి ప్రయోజనం చేకూరలేదు. దీంతో.. కుటుంబ సభ్యుల నుండి, సమాజం నుండి తనకు వచ్చిన అవమానాలతో మహిళ ఇబ్బంది పడేది. ఈ క్రమంలోనే.. అత్తమామలు తనను చిత్రహింసలకు గురిచేశారని మృతురాలి సోదరుడు ఆరోపించాడు. తన సోదరిని అత్తమామలు కొట్టి చంపారని, అనంతరం రక్తంతో తడిసిన బట్టలను గోనె సంచిలో వేసి చెరువు ఒడ్డున పడవేశారని తెలిపాడు.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!