UP: రోజూ మద్యం తాగమని భర్తను బలవంతం పెట్టిన భార్య..విడాకులకు దారి తీసిన ఉదంతం
- ఉత్తర్ ప్రదేశ్లోని ఆగ్రాలో భార్య.. భర్తల మధ్య వింత వివాదం
- భార్య రోజూ మద్యం తాగుతూ.. తనను కూడా తాగమని బలవంతం చేస్తున్నట్లు భర్త ఆరోపణ
- పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య
- పెళ్లయిన రెండు నెలలకే దంపతుల మధ్య వివాదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తర్ ప్రదేశ్లోని ఆగ్రాలో భార్య, భర్తల మధ్య వింత వివాదం చోటుచేసుకుంది. సాధారణంగా భర్త రోజూ మద్యం తాగుతుంటే ఇళ్లాలు మందలిస్తుంది. కానీ ఇక్కడ మాత్రం సీన్ మారింది. భార్య రోజూ మద్యం తాగుతూ.. తనను కూడా తాగమని బలవంతం చేస్తున్నట్లు భర్త ఆరోపించాడు. ఈ పరిస్థితి విడాకుల దాకా చేరింది. ఆగ్రాలోని ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్లో.. భార్యాభర్తల మధ్య గొడవకు కారణం తెలుసుకున్న కౌన్సెలర్లు షాక్ అయ్యారు. తన భార్య మద్యం తాగుతుందని మరియు తనను మద్యం తాగమని బలవంతం చేస్తుందని భర్త ఆరోపించారు. ఆమె ఒత్తిడికి విసిగిపోయిన భర్త తన భార్యను ఆమె తల్లిదండ్రుల వద్ద వదిలిపెట్టాడు. దీంతో భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Also Read
అయితే.. విచారణ అనంతరం భార్యాభర్తల మధ్య జరిగిన గొడవను పోలీసులు జిల్లాలోని ఫ్యామిలీ కౌన్సెలింగ్ కేంద్రానికి తరలించారు. కౌన్సెలర్ ప్రకారం.. దంపతులు కౌన్సెలింగ్ చేస్తుండగా.. అక్కడే ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. “నాకు రెండు నెలల క్రితమే వివాహమైంది. నేను ప్రతిరోజూ మద్యం తాగలేను. అయితే రోజూ మద్యం తాగమని భార్య బలవంతం చేస్తుంది. నా భార్య ఒకేసారి మూడు నుంచి నాలుగు పెగ్గులు తాగుతుంది.” అని భర్త ఆరోపించాడు. ఆ అర్ధాంగి భర్త ఆరోపణలన్నింటినీ అంగీకరించింది. భర్త చెప్పిన విషయాలన్నీ వస్తవమేనని ఒప్పుకుంది. తన భర్త తనను కొట్టి ఇంటి నుంచి వెళ్లగొట్టాడని సికంద్రాలో నివాసముంటున్న భార్య ఆరోపించింది. ప్రస్తుతం తన తల్లి ఇంట్లో ఉంటున్నట్లు పేర్కొంది. ఇరువురి వాదనలు విన్న కౌన్సెలర్ దంపతుల మధ్య రాజీ కుదుర్చే ప్రయత్నం చేశారు. వినక పోవడంతో మరో కొద్ది రోజులు గడువు ఇచ్చారు.
తాజావార్తలు
-
Putin: మరోసారి భారత్ టూర్కు పుతిన్.. ఎప్పుడంటే..!
-
Twisha Sharma Case: ట్విషా శర్మ భర్తపై లుక్ ఔట్ నోటీసులు
-
Manchu Manoj: రాజకీయాల్లోకి మంచు వారి కోడలు! స్పష్టం చేసిన హీరో మనోజ్….
-
PM Modi: ఐస్లాండ్ ప్రధాని క్రిస్ట్రాన్ మ్జోల్తో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
-
Sudheer Joker: రాయల్ ఫ్యామిలీ దొంగ… ఆసక్తి రేపుతున్న ‘సుధీర్ జోకర్’ బ్యాంగర్!
ట్రెండింగ్
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!