Madhya Pradesh: ప్రియుడితో కలిసి మొగుడిని చంపిన భార్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madhya Pradesh: ఏమిటో తెలియని గానీ ఈ మధ్య కాలంలో వివాహేతర సంబంధాలు ఎక్కువైపోతున్నాయి. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నారని అగ్నిసాక్షిగా కట్టుకున్న వారిని కడతేర్చుతున్నారు. ఇలాంటి నేరపూరిత కుట్రలో మహిళలు కూడా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జరిగిన హత్య ఘటనలో ఓ మహిళ తన భర్తను దారుణంగా హతమార్చేందుకు కుట్ర పన్నింది. తన వివాహేతర సంబంధాలకు భర్త అడ్డుగా నిలిచాడు. దీంతో మహిళ తన ప్రియుడి సాయంతో భర్తను హత్య చేసింది. ఈ షాకింగ్ సంఘటన వెలుగులోకి రావడంతో పోలీసులు ఆ మహిళ, తనకు సహకరించిన ప్రియుడితో పాటు మరో యువకుడిని అదుపులో తీసుకున్నారు. ముగ్గురిని కోర్టులో హాజరుపరిచి జైలుకు పంపారు.
Read Also:Priyanka Gandhi: జంతర్మంతర్ వద్ద రెజ్లర్లకు ప్రియాంక గాంధీ సంఘీభావం
Also Read
- Thummidihatti Barrage: తెలంగాణ, మహారాష్ట్ర మధ్య తుమ్మిడిహట్టి పంచాయితీ.. నేడు కేంద్రం సమక్షంలో చర్చలు..!
- YS Jagan: పులివెందులలో వైఎస్ జగన్ రెండు రోజుల పర్యటన!
- Kranti Goud: నెం.11 స్థానంలో బ్యాటింగ్కు వచ్చి చరిత్ర సృష్టించిన క్రాంతి గౌడ్..!
- Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
జావేద్ అనే యువకుడు వారం రోజులుగా కనిపించకుండా పోయాడు. ఏప్రిల్ 22న చందన్నగర్ పోలీస్ స్టేషన్లో అదృశ్యమైనట్లు ఫిర్యాదు నమోదైంది. ఆ తర్వాత హత్యకు గురైనట్లు తెలియగానే కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళనకు గురయ్యారు. జావేద్ కుటుంబీకులు సద్దాం అనే యువకుడిని అనుమానించారు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు సద్దాంను అదుపులోకి తీసుకున్నారు. అతడిని తమ స్టైల్లో విచారణ మొదలుపెట్టారు. మొదట్లో పోలీసుల ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పకుండా తప్పించుకున్నాడు. తప్పుదోవ పట్టించే సమాధానాలు చెప్పాడు. అయితే పోలీసులు తన ఖాకీ బ్యాడ్జీని చూపించిన వెంటనే సద్దాం జరిగిన విషయాన్ని బయటపెట్టాడు. ఈ క్రమంలోనే జావేద్ను హత్య చేసినట్లు అంగీకరించాడు.
Read Also: Check Seat Availability In Train: రైలులో సీట్ లభ్యతను ఎలా తెలుసుకోవాలి?
జావేద్ భార్య సాయంతో ఈ కుట్ర పన్నినట్లు సద్దాం పేర్కొన్నాడు. దీంతో పోలీసులు కూడా అయోమయంలో పడ్డారు. ఈ సమాచారం ఆధారంగా పోలీసులు జావేద్ భార్యను అదుపులోకి తీసుకుని విచారించారు. ఆ సమయంలో భర్త వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నందునే హత్య చేసినట్లు అంగీకరించింది. సద్దాం, షకీర్, జావేద్ భార్య రుక్సానా సహా ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ముగ్గురిని కోర్టులో హాజరుపరిచారు. ఆ సమయంలో కోర్టు వారిని జైలుకు పంపింది.
సద్దాం, రుక్సానా ఇద్దరికీ వివాహేతర సంబంధాలు ఉన్నాయి. వీరిద్దరూ ఒకే కాలనీలో నివసించేవారు. సద్దాం రిక్షా నడిపేవాడు. రుక్సానాతో ప్రేమలో ఉన్నాడు. రుక్సానా అభ్యర్థన మేరకు, అతను జావేద్ను తాగడానికి ఆహ్వానించాడు. జావేద్ తాగి రిక్షాలోనే చంపబడ్డాడు. ఆ తర్వాత జావేద్ మృతదేహాన్ని బహిరంగ ప్రదేశంలో పడేశారు.
తాజావార్తలు
-
Thummidihatti Barrage: తెలంగాణ, మహారాష్ట్ర మధ్య తుమ్మిడిహట్టి పంచాయితీ.. నేడు కేంద్రం సమక్షంలో చర్చలు..!
-
NTV Exclusive: ‘మండాడి’ కోసం 45 రోజులు సముద్రంలోనే.. నాలుగైదుసార్లు చావు అంచుల వరకు వెళ్లాం: సుహాస్
-
Bethlehem Family Unit: రూ. 250 కోట్ల దిశగా మలయాళ మూవీ.. తెలుగులోనూ రిలీజ్కు రెడీ!
-
YS Jagan: పులివెందులలో వైఎస్ జగన్ రెండు రోజుల పర్యటన!
-
Toxic : వంద కోట్ల గ్రాస్ కూడా రాబట్టలేక షాకిచ్చిన ‘యశ్ టాక్సిక్’
ట్రెండింగ్
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!